Komatireddy Venkat Reddy : తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తే, గత పదేళ్ల కాలంలో ఆయన చేసిన అప్పులు, అక్రమాలపై లెక్కలు తేలుస్తామని మంత్రి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో, ప్రతిపక్ష నేతకు కూడా ప్రజా […]
PVC Ration Card: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ విప్లవంలో భాగంగా సామాన్యులకు అందించే సేవలను మరింత సులభతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా, నిత్యవసర వస్తువుల సరఫరాకు కీలకమైన రేషన్ కార్డును కూడా ఇప్పుడు సరికొత్త రూపంలోకి మార్చుకునే వెసులుబాటును కల్పించాయి. ఇప్పటివరకు మనం వాడుతున్న కాగితం రేషన్ కార్డులు త్వరగా పాడైపోవడం, చిరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, ఇప్పుడు మీ రేషన్ కార్డును ఏటీఎం కార్డులాగా ధృడంగా ఉండే పీవీసీ (PVC) […]
రంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన కాటేదాన్లో ఆదివారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాటేదాన్ టాటా నగర్ పరిధిలోని ఒక ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని ప్లాస్టిక్ నిల్వలకు మంటలు అంటుకోవడంతో అవి క్షణాల్లోనే భవనం మొత్తానికి వ్యాపించాయి. ప్లాస్టిక్ వస్తువులు కాలుతుండటంతో ఆ ప్రాంతమంతా కిలోమీటర్ల మేర దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది, దీంతో స్థానిక కాలనీల ప్రజలు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదం జరిగిన […]
Pawan Kalyan : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది, అంటే 2026 జనవరి 3వ తేదీ శనివారం నాడు ఆయన కొండగట్టు క్షేత్రానికి విచ్చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు కావడంతో అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు భక్తుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో భాగంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. […]
Tara Sutaria : బాలీవుడ్ బ్యూటీ తార సుతారియా , ఆమె ప్రియుడు వీర్ పహారియా తాజాగా ముంబైలో జరిగిన ప్రముఖ పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ మ్యూజిక్ కాన్సెర్ట్లో సందడి చేశారు. అయితే, ఈ వేడుకలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కాన్సెర్ట్ మధ్యలో ఏపీ ధిల్లాన్ ఆహ్వానం మేరకు తార సుతారియా స్టేజీపైకి వెళ్లగా, ఆ సమయంలో వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం , అక్కడే […]
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ‘రాజా సాబ్’ ఈవెంట్.. ఈ రూట్లలో వెళ్లకండి..! టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’ (The Raja Saab) ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్కు భారీ సంఖ్యలో అభిమానులు, సినీ ప్రముఖులు తరలివచ్చే అవకాశం ఉండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై ప్రయాణికులకు కీలక సూచనలు […]
Ponguleti Srinivas Reddy : ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి భద్రత, భరోసా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమ పాలనలో స్పష్టమైన తేడా ఉందని, మొన్నటి ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా […]
మంత్రుల గొంతు మూగబోయిందా?పార్టీ, ప్రభుత్వంపై ఆ రేంజ్లో విపక్షం విరుచుకుపడుతుంటే కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్నారా?అప్పోజిషన్ గ్యాప్ కూడా ఇవ్వకుండా సర్కార్పై ఎటాక్ చేస్తుంటే వీళ్లంతా మౌనవ్రతం ఎందుకు చేస్తున్నారు?చెప్పుకోవడానికి ఊరంతా బలగమే ఉన్నా…అసలు ఉపయోగమే లేకుండాపోయిందా?రాజకీయ పదవులు అనుభవిస్తూ…పెదవులు మూసుకున్న ఆ నేతలెవరు? మాకెందుకు..తిట్టింది మమ్మల్ని కాదుగా అనుకుంటున్నట్టున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అలా అని తనదాకా వస్తే మాత్రం…చూశారా?ఎవరు మద్దతుగా లేరు అని అనుకోవడం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మారిందట. కాంగ్రెస్ పార్టీ […]
ఆ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పడిగాపులు కాస్తున్నారా?పార్టీ అధికారంలోకి వచ్చినా…ఇప్పటి వరకు హైకమాండ్ వాళ్ల వైపు ఎందుకు చూడలేదు?గత ప్రభుత్వ హయాంలో నిర్బంధాలు ఎదుర్కొన్న నేతలకు గుర్తింపు లేకపోవటానికి కారణం ఏంటి?జనం కోసం కేసులు, కోర్టు మెట్లెక్కినా ప్రయోజనం లేకుండా పోయిందా?పార్టీ అధికారంలోకి రావటానికి కీలకమైన ఆ జిల్లాలో ఏం జరుగుతోంది?పక్క పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్లకు ప్రియారిటీ ఇచ్చి…సొంత వాళ్లను ఎందుకు వదిలేశారు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నానా కష్టాలు […]
Bus Accident : సంగారెడ్డి జిల్లా కంది వద్ద జాతీయ రహదారి 65పై శనివారం ఘోర ప్రమాదం తప్పింది. మెదక్ నుండి పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం […]