Shocking : బిర్యానీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త.! గుంటూరు హోటళ్లలో విస్తుపోయే నిజాలు.!
- హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు
- అపరిశుభ్ర కిచెన్లు.. బూజు పట్టిన మాంసం స్వాధీనం
- కెమికల్ రంగులతో ఆహారం తయారీ.. ఆరోగ్యానికి ముప్పు
- నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లకు నోటీసులు.. లైసెన్స్ రద్దుకు హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Hotel Raids : గుంటూరు నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలే లక్ష్యంగా ఫుడ్ కంట్రోల్ అధికారులు భారీ తనిఖీలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఆహారాన్ని విక్రయిస్తున్న నిర్వాహకుల తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులలో వెలుగు చూసిన దృశ్యాలు వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
తనిఖీల్లో భాగంగా అధికారులు హోటళ్లలోని కిచెన్లను పరిశీలించి షాక్కు గురయ్యారు. వంట గదులు కనీస పరిశుభ్రత లేకుండా, కబేళాల (Slaughter Houses) కంటే అధ్వానంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. గోడలపై బూజు, నేలపై అపరిశుభ్రత మధ్యే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. హోటల్ సిబ్బంది కనీస ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం గమనార్హం.
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
OnePlus ధమాకా..! రూ.16 వేలకే అదిరిపోయే ట్యాబ్.. మిస్ అవ్వకండి.!
ఈ దాడుల్లో అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. రోజులు, వారాల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రిడ్జ్లలో ఉంచిన చికెన్, మటన్ ముక్కలు తీయడానికి కూడా రానంతగా గడ్డకట్టుకుపోయాయి. ఇది కనీసం మూడు నాలుగు రోజుల క్రితం నాటిదని అధికారులు నిర్ధారించారు. కొన్ని చోట్ల బూజు పట్టిన మాంసాన్ని కూడా వంటకు సిద్ధంగా ఉంచడం కనిపించింది.
ఆహారం ఆకర్షణీయంగా కనిపించేందుకు క్యాన్సర్ కారకమైన కెమికల్ రంగులను విచ్చలవిడిగా వాడుతున్నట్లు గుర్తించారు. ఇవి ప్రజల జీర్ణ వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయని హెచ్చరించారు. సాధారణంగా పచ్చి మాంసాన్ని, వండిన ఆహారాన్ని వేర్వేరుగా ఉంచాలి. కానీ, గుంటూరులోని ఈ హోటళ్లలో వండిన పదార్థాలను, పచ్చి మాంసాన్ని కలిపి ఒకే ఫ్రిడ్జ్లో ఉంచడం కనిపించింది. ఫ్రిడ్జ్ల లోపల రక్తం గడ్డకట్టుకుపోయి, భరించలేని దుర్వాసన వస్తున్నా పట్టించుకోకుండా ఆహారాన్ని నిల్వ చేస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించిన హోటల్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. పట్టుబడిన నాణ్యత లేని ఆహార పదార్థాలను వెంటనే సీజ్ చేసి నాశనం చేశారు. “ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఏ హోటల్ను వదిలిపెట్టం. ఆహార నాణ్యత పెంచే వరకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. తప్పు చేసిన వారి లైసెన్సులను రద్దు చేయాలని కమిషనర్కు నివేదిక పంపిస్తాం” అని ఫుడ్ కంట్రోల్ అధికారి పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు.
Yogi Adityanath: “బాబ్రీ మసీదు” ఎప్పటికీ నిర్మితం కాదు.. వారి కలలు నిజం కావు..
తాజావార్తలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!