Shocking : బిర్యానీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త.! గుంటూరు హోటళ్లలో విస్తుపోయే నిజాలు.!
- హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు
- అపరిశుభ్ర కిచెన్లు.. బూజు పట్టిన మాంసం స్వాధీనం
- కెమికల్ రంగులతో ఆహారం తయారీ.. ఆరోగ్యానికి ముప్పు
- నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లకు నోటీసులు.. లైసెన్స్ రద్దుకు హెచ్చరిక
Guntur Hotel Raids : గుంటూరు నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలే లక్ష్యంగా ఫుడ్ కంట్రోల్ అధికారులు భారీ తనిఖీలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఆహారాన్ని విక్రయిస్తున్న నిర్వాహకుల తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులలో వెలుగు చూసిన దృశ్యాలు వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
తనిఖీల్లో భాగంగా అధికారులు హోటళ్లలోని కిచెన్లను పరిశీలించి షాక్కు గురయ్యారు. వంట గదులు కనీస పరిశుభ్రత లేకుండా, కబేళాల (Slaughter Houses) కంటే అధ్వానంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. గోడలపై బూజు, నేలపై అపరిశుభ్రత మధ్యే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. హోటల్ సిబ్బంది కనీస ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం గమనార్హం.
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
OnePlus ధమాకా..! రూ.16 వేలకే అదిరిపోయే ట్యాబ్.. మిస్ అవ్వకండి.!
ఈ దాడుల్లో అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. రోజులు, వారాల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రిడ్జ్లలో ఉంచిన చికెన్, మటన్ ముక్కలు తీయడానికి కూడా రానంతగా గడ్డకట్టుకుపోయాయి. ఇది కనీసం మూడు నాలుగు రోజుల క్రితం నాటిదని అధికారులు నిర్ధారించారు. కొన్ని చోట్ల బూజు పట్టిన మాంసాన్ని కూడా వంటకు సిద్ధంగా ఉంచడం కనిపించింది.
ఆహారం ఆకర్షణీయంగా కనిపించేందుకు క్యాన్సర్ కారకమైన కెమికల్ రంగులను విచ్చలవిడిగా వాడుతున్నట్లు గుర్తించారు. ఇవి ప్రజల జీర్ణ వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయని హెచ్చరించారు. సాధారణంగా పచ్చి మాంసాన్ని, వండిన ఆహారాన్ని వేర్వేరుగా ఉంచాలి. కానీ, గుంటూరులోని ఈ హోటళ్లలో వండిన పదార్థాలను, పచ్చి మాంసాన్ని కలిపి ఒకే ఫ్రిడ్జ్లో ఉంచడం కనిపించింది. ఫ్రిడ్జ్ల లోపల రక్తం గడ్డకట్టుకుపోయి, భరించలేని దుర్వాసన వస్తున్నా పట్టించుకోకుండా ఆహారాన్ని నిల్వ చేస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించిన హోటల్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. పట్టుబడిన నాణ్యత లేని ఆహార పదార్థాలను వెంటనే సీజ్ చేసి నాశనం చేశారు. “ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఏ హోటల్ను వదిలిపెట్టం. ఆహార నాణ్యత పెంచే వరకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. తప్పు చేసిన వారి లైసెన్సులను రద్దు చేయాలని కమిషనర్కు నివేదిక పంపిస్తాం” అని ఫుడ్ కంట్రోల్ అధికారి పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు.
Yogi Adityanath: “బాబ్రీ మసీదు” ఎప్పటికీ నిర్మితం కాదు.. వారి కలలు నిజం కావు..
తాజావార్తలు
-
Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
-
Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
-
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
-
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
-
AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!