Gogikar Sai Krishna
Author- NTV Telugu-
CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
CM Revanth Reddy : హైదరాబాద్లోని ఖైరతాబాద్ నెక్లెస్ రోడ్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిబా ఫూలే, శ్రీమతి సావిత్రీబాయి ఫూలే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఒకవైపు అంబేద్కర్, మరోవైపు ఫూలే, ఇంకోవైపు ఇందిరా గాంధీ విగ్రహాల కలయికతో నెక్లెస్ రోడ్ చౌరస్తా మహనీయుల స్ఫూర్తి కేంద్రంగా మారిందని కొనియాడారు. 136 సంవత్సరాల తర్వాత కూడా మనం ఫూలేను గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప […] -
Police Medals : తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల పంట.. విజేతల పూర్తి జాబితా ఇదే.!
Police Medals : భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు పోలీసు అధికారులు , సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పతకాలతో గౌరవించింది. విధుల్లో చూపిన అసమాన ధైర్యసాహసాలు, విశిష్ట సేవలు , నిబద్ధతకు గుర్తింపుగా ‘రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం’ (PPMDS), ‘శౌర్య పతకం’ (PMG) , ‘ప్రశంసనీయ సేవా పతకాలను’ (PMMS) ప్రకటించింది. ప్రజాసేవలోనూ, శాంతిభద్రతల పరిరక్షణలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ఈ పురస్కారాలు లభించాయి. విశిష్ట సేవా […] -
Telangana Cabinet Decisions : రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు, సన్నాలకు బోనస్, ఈవీ ఆటోలకు భారీ సబ్సిడీ.!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ప్రజారోగ్యంతో పాటు సంక్షేమం, వ్యవసాయం, విద్య , పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రక్రియ ద్వారా కొత్తగా 62 లక్షల మందికి లబ్ధి చేకూరడంతో, రాష్ట్రంలో మొత్తం రేషన్ లబ్ధిదారుల […] -
Independence Day : పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం..
Independence Day : భారత స్వాతంత్య్ర త్య్ర దినోత్సవ (పంద్రాగస్టు) వేడుకల కోసం చారిత్రాత్మక గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ శుభసందర్భంగా గోల్కొండ కోట ప్రాంగణంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకలకు మంత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, విఐపిలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానుండటంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక గ్యాలరీలు, […] -
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..
Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం సచివత్వంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్, గ్రేటర్ పరిధిలోని సిటిజన్స్ అర్బన్ రీస్ట్రక్చరింగ్ అండ్ ఎకానమీ (CURE) ప్రాజెక్ట్ పరిధిలో నిర్మించతలపెట్టిన ఇందిరమ్మ ఇళ్లకు భూకేటాయింపులు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేద, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని […] -
Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్ డ్రాప్’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిందితుడు బొల్లా కిరణ్ అగత్యాలు, కిరాతకాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. గత ఆరేళ్లుగా సీక్రెట్గా డెడ్ డ్రాప్ పద్ధతి ద్వారా దాదాపు 203 మంది కస్టమర్లకు.. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారవేత్తలకు.. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠా, ఆ అక్రమ సంపాదనతో అమానుష దారుణాలకు ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. వరంగల్ సహా ఇతర మారుమూల ప్రాంతాల నుంచి మైనర్లు, పేద అమ్మాయిలను […] -
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
మనలో చాలామంది మార్కెట్లో కొన్న అరటిపండ్లు నల్లగా మారితే, అవి బాగా పండిపోయి లోపల కుళ్ళిపోయాయని భావించి పారేస్తుంటాము. బాగా పండిన లేదా కుళ్ళిపోయిన పండ్లను నేరుగా తినడం సురక్షితం కాకపోయినప్పటికీ, తొక్కపై నల్లటి మచ్చలు వచ్చి లోపల మెత్తగా ఉన్నంత మాత్రాన అది పాడైపోయిందని అర్థం కాదు. పండే కొద్దీ అరటిపండ్లలోని పిండిపదార్థం సహజ చక్కెరలుగా మారి మరింత తియ్యగా తయారవుతాయి. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాంస్కృతిక కార్యక్రమాల్లో లేదా పండుగ రోజుల్లో పిల్లలు, […] -
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైడ్రా (HYDRA) కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన ముందస్తు ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టారన్న వ్యవహారంలో ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ‘వాణి కో-ఆపరేటివ్ హెచ్జిఎస్ సొసైటీ’కి సంబంధించిన భవనాల కూల్చివేత అంశంపై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ, ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించింది. కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ లెక్కచేయకుండా యంత్రాలతో కూల్చివేతలు చేపట్టడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం […] -
Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
Ponguleti Srinivas : ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను పొంగులేటి కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. గతంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాసిన లేఖను ఈ సందర్భంగా గుర్తుచేసిన […] -
CM Chandrababu : ఏపీలో పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా , ఇతర ఉన్నతాధికారులు నేరుగా పాల్గొనగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేంజ్ ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు , ఎస్ఐలు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. మొత్తం 1,200కు పైగా పోలీస్ స్టేషన్ల నుంచి స్టేషన్ హౌస్ […]
తాజావార్తలు
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
-
Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
-
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!