Gogikar Sai Krishna
Author- NTV Telugu-
PSLV C52 : నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ52
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ52 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ నుంచి దీనిని ప్రయోగించారు. 25 గంటలపాటు కౌంట్డౌన్ ముగించుకుని సోమవారం ఉదయం 5.59 గంటలకు ప్రయోగించిన రాకెట్ నింగిలో లక్ష్యం దిశగా వెళ్లింది. ఇది మూడు ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్తోంది. ఇస్రో ఈ ఏడాదిలో చేపడుతున్న మొదటి ప్రయోగం ఇదే కావడం గమనార్హం. శ్రీహరికోట PSLV C 52 రాకెట్ ప్రయోగం విజయవంతం […] -
DGP Mahender Reddy : మేడారం జాతరకు భారీగా భద్రతా ఏర్పాట్లు
తెలంగాణాకే తలమానికమైన మేడారం జాతరకు ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తొమ్మిది వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 400 సీసీ కెమెరాలతో నిత్యం పహారా కాయనున్నట్లు ఆయన తెలిపారు. క్రౌడ్ కంట్రోల్ నియంత్రణకు 33 డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 33 చోట్ల పార్కింగ్ స్థలాన్ని పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. 37 […] -
Revanth Reddy : దేశంలో ఉన్న తల్లులను అవమానించేలా మాట్లాడారు
ఇటీవల అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అస్సాం సీఎం వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అస్సాం సీఎం మాటలు దేశంలో ఉన్న తల్లులను అవమానించేలా మాట్లాడారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట […] -
V Hanumantha Rao : బీజేపీ ఫ్రస్టేషన్లో ఉంది
ఇటీవల అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అస్సాం సీఎం వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు మాట్లాడుతూ.. బీజేపీ ఫ్రెస్టేషన్లో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్ మీద మాట్లాడినందుకు కాదు.. మోడీ నీ రాజు […] -
Asaduddin Owaisi : హిజాబ్ ధరించిన అమ్మాయి ఇండియా ప్రధానమంత్రి అవుతుంది
కర్ణాటకలో చెలరేటిన హిజాబ్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే తాజాగా లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం ట్విట్లర్ వేదికగా.. హిజాబ్ ధరించిన అమ్మాయి ఏదో ఒక రోజు భారత ప్రధానమంత్రి అవుతుందని అన్నారు. హిజాబ్లు ధరించినందుకు ముస్లిం విద్యార్థుల బృందం తమ కళాశాలలోకి ప్రవేశించకుండా నిరోధించిన తర్వాత కర్ణాటక హిజాబ్ వ్యవహారం చెలరేగిన నేపథ్యంలో ఇది జరిగింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ ఒవైసీ ఆదివారం ఒక వీడియోను ట్వీట్ […] -
KTR : ఐటీ రంగాన్ని నగరం నలువైపులా విస్తరిస్తున్నాము
హైదరాబాద్లో ఐటీ రంగం శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పలు అంతర్జాతీయ కంపెనీలు తమ సేవలను విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా ఒకప్పుడు కేవలం మాదాపూర్, హైటెక్ సిటీకే పరిమితమైన ఐటీ కంపెనీలు ప్రస్తుతం నగర నలుమూలల విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ కంపెనీలను నగరానికి అన్ని దిశల్లో విస్తరించేందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే […] -
Kishan Reddy : గౌరవ ముఖ్యమంత్రి కి గౌరవంగా సమాధానం చెప్పుతాం
హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ కార్పోరేటర్లు, ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మరో కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే హజరయ్యారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లడుతూ.. బీజేపీ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద పని చేయడం లేదని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రికి గౌరవంగా సమాధానం చెప్పుతామని ఆయన […] -
Geetha Reddy : రాహుల్.. తండ్రి ఎవరని అడిగే నీ తండ్రి ఎవరు
అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్.. రాజీవ్ గాంధీ కుమారుడే అన్న విషయానికి రుజువులు చూపాలని బీజేపీ ఎప్పుడైనా అడిగిందా అంటూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రశ్నించారు. దీంతో అస్సాం సీఎంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి గీతా రెడ్డి అస్సాం సీఎం […] -
Atchannaidu : జగన్కు ఆస్కార్ కాదు.. మోసకార్ ఇవ్వాల్సిందే..
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షులు నాయకులు అచ్చెన్నాయుడు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆస్కార్ అవార్డకు మించి నటించారని ఆయన అన్నారు. జగన్రెడ్డికి మోసకార్ అవార్డు ఇవ్వాల్సిందేనని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ లోపాయికారితనం, చేతకానితనం మరోసారి బహిర్గతమైందని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనప్పుడు ప్రజలిచ్చిన పదవుల్లో కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. సీఎం, […] -
Drug Case : ఢిల్లీ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ వైద్యుడు
మాదకద్రవ్యాలకు యువతే కాకుండా ఎంతో చదువుకున్న వైద్యులు కూడా బానిసలవుతున్నారు. ఢిల్లీ డ్రగ్స్ కేసులో హైదరాబాద్రె చెందిన డాక్టర్ కు ప్రమేయం ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఢిల్లీలో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న కేసులో ఇప్పటికే నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు 22 మంది అరెస్ట్ చేశారు. అయితే ఇందులో హైదరాబాద్ కు చెందిన వైద్యుడు ఆదిత్య రెడ్డి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆదిగ్య రెడ్డి సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్నారు. మానసిక రోగులపై ఈ డ్రగ్స్ […]
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..