సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ పేరు మార్చుకోనున్నట్లు ప్రముఖ టెక్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోయినప్పటికీ, రానున్న వార్షిక సదస్సులో సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేరు మార్చనున్నట్లు సమాచారం. ఇప్పటికే అమెరికా ప్రభుత్వంతో తలెత్తుతున్న సమస్యల వల్ల ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య పడిపోతుందని భావించిన ఫేస్ బుక్ నిర్వాహకులు ఇలా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దిగ్గజ సమస్యలు అవసరాన్ని బట్టి మాతృ […]
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో ఏపీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బంద్ నిర్వహిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్య నేతలను హౌస్ అరెస్టులు చేసి, భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా టీడీపీ అధికార ప్రతినిధి పంచమూర్తి అనురాధ భావోద్వేగ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో.. జగన్ మోహన్ […]
ఏపీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖలు రాశారు. టీడీపీ కార్యాలయంపై దాడులను ఖండిస్తూ ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిషా లకు లేఖలు రాశారు. ఈ దాడులపై విచారణ చేపట్టేందుకు సీబీఐ, ఎన్ఐఏలను రంగంలోకి దించాలని కోరారు. అంతేకాకుండా ఇలానే ఉంటే ఏపీ పరిస్థితులు మరింత దిగజారిపోతాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పోలీసులపై నమ్మకం పోయిందని, వెంటనే కేంద్ర బలగాలను రాష్ట్రంలో దించాలని […]
రోజురోజుకి చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో రికార్డు స్థాయిలో ధరలు కొండెక్కాయి. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా టమాట ధరలు ఆకాశానంటుతుండగా.. ఉల్లి సామాన్యులను కంటతడి పెట్టిస్తోంది.ఇప్పుడు చికెన్ ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు కోడి గుడ్డుతో సరిపెట్టుకుంటున్నారు. ఒక్క చికెన్ ధరలు మాత్రమే కాదు.. మటన్ ధరలు కూడా పెరిగిపోయాయి. శుభకార్యాల సీజన్ కావడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో కిలో చికెన్ స్కిన్ లెస్ ధర రూ. 280 నుంచి రూ. 300 […]
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యాదాద్రి ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే ఎంతో మంది ధన రూపేన, వస్తు రూపేన కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా టీఆర్ఎస్ నేతలు యాదాద్రి ఆలయానికి విరాళం ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ఎం. హనుమంత రావు, ఎం కృష్ణ రావుతో పాటు కెపి వివేక్ ఆనంద్ లు […]
ఏపీలో రాజకీయం రాజుకుంది. అటు టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిస్తే.. కౌంటర్ గా వైసీపీ కూడా టీడీపీ నేతల వ్యాఖ్యలపై నిరసనలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, పార్టీ నాయకులపై దాడులు ద్వారా అంతర యుద్ధం జరగాలని జగన్ కోరుకున్నాడని ఆరోపణలు చేశారు. జగన్ తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టాడని విమర్శించారు. […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు, అందాల నటి కీర్తిసురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం వరకు కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాకుండా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేశ్ బాబు రికార్డుల జాబితాలో […]
జగనన్న తోడు నిధులు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి జమ చేయనున్నారు.తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు జగన్ సర్కార్ జగనన్న తోడు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 2020 నవంబర్ నుండి 2021 సెప్టెంబర్ వరకు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన లబ్దిదారులకు ఈ ప్రయోజనం అందనుంది. ఈ పథకం వల్ల 4,50,546 మంది చిరు వ్యాపారస్తులు […]
రోజురోజుకు ప్రజల మానసిక స్థితి ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే ఇది.. హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీకి చెందిన ఓ మహిళ తన తండ్రి మందలించడంతో ఉసురుతీసుకుంది. మమత అనే మహిళ తన తల్లిదండ్రులతో కేపీహెచ్ బీ కాలనీలో నివాసం ఉంటోంది. మమత కు 2019 వివాహం జరిగింది. అయితే భర్తకు కాన్సర్ ఉందని తెలియడంతో రెండు నెలలకే విడాకులు […]
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగి సామాన్యుల జేబులకు చిల్లులు వేయడానికి రెడీ అయిపోయాయి. రెండు రోజుల స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడంతో వాహనదారులు షాక్ కు గురయ్యారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమని వాహనదారులు అంటున్నారు. బుధవారం పెట్రోల్ పై 37 పైసల పెంపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46 లకు చేరుకుంది. ఇక డీజిల్ పై 38 పైసలు పెంచగా […]