Salman Ali Agha: “ఈ బలహీనతే మా కొంప ముంచింది”.. పాక్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Ali Agha: పాకిస్థాన్ టీ20 టోర్నీకి ముందు ఎంత రచ్చ చేసిందో పెద్దగా చెప్పనవసరం లేదు. తామే కప్పు గెలుస్తామన్న రీతిలో బిల్డప్ కొట్టింది. ఐసీసీ, శ్రీలంక క్రికెట్ టీమ్ పాక్తో మాట్లాడి కన్వీన్స్ చేసి మరీ టోర్నీలోకి అడుగు పెట్టేలా, భారత్పై పాక్ మ్యాచ్లు జరిగేలా చేశారు. తీరా చూస్తే శ్రీలంక పాకిస్థాన్ చావు దెబ్బ కొట్టింది. తాము ఇంటికి పోతూ.. పాకిస్థాన్ను సైతం వెంట తీసుకెళ్లింది. నిన్నటి మ్యాచ్పై కెప్టెన్ సల్మాన్ అఘా స్పందించాడు. తమ జట్టు వైఫల్యాలను స్పష్టంగా అంగీకరించాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ సమస్యే తమ కొంప ముంచిందని ఒప్పుకున్నాడు. “టోర్నమెంట్ మొత్తం మన బ్యాటింగ్ సరిగా పనిచేయలేదు. సాహిబ్జాదా ఫర్హాన్కు సరైన మద్దతు లభించి ఉంటే కథ వేరుగా ఉండేది. మిడిల్ ఆర్డర్ సమస్య ఎన్నాళ్లుగానో ఉంది. దాన్ని సమీక్షించాల్సిందే. 18 ఓవర్లు బాగా ఆడాం. చివరి రెండు ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. 160 కూడా కాపాడటం కష్టమే అయ్యేదేమో! మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సాహిబ్జాదా ఫర్హాన్ తన శతకం జట్టుకు ఉపయోగపడకపోవడం బాధ కలిగించింది. జట్టుకోసం బాగా ఆడాలనుకున్నా. ఫఖర్ సైతం శతకం చేయాలని ఆశపడ్డా. నా శతకం జట్టును సెమీఫైనల్కు తీసుకెళ్లలేకపోయింది.. అందుకే బాధగా ఉంది” అని అఘా స్పష్టం చేశాడు.
READ MORE: Pakistan: ఇరాన్ మంటల్లో కాలిపోతున్న లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ..
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ సెమీస్కు చేరాలంటే శ్రీలంకను 147 పరుగులకే కట్టడి చేయాల్సి ఉండేది. న్యూజిలాండ్ నెట్ రన్రేట్లో దాటాల్సి ఉండేది. కానీ.. శ్రీలంక జట్టు ఏ మాత్రం తగ్గలేదు. చివరి వరకు పోరాడి ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగుల చేసింది. శ్రీలంక పోరాడి ఓడింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ రెండూ జట్లు మూడు పాయింట్లతో సమానంగా ఉన్నా, మెరుగైన నెట్ రన్రేట్ కారణంగా న్యూజిలాండ్ రెండో స్థానంతో సెమీఫైనల్ చేరింది. గ్రూప్లోని మరో జట్టు ఇంగ్లాండ్ ఇప్పటికే మూడు విజయాలతో అర్హత సాధించింది. ఇక శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక శివతాండవం చేశాడు. కేవలం 31 బంతుల్లో అజేయంగా 76 పరుగులు చేసి మ్యాచ్ను చివరి క్షణాల వరకూ తీసుకెళ్లాడు. మొత్తంగా, ఈ మ్యాచ్ పాకిస్థాన్కు ఆలస్యంగా వచ్చిన పాఠంలా మారింది. విజయం సాధించినా లక్ష్యం చేరుకోలేకపోవడం జట్టు లోపాలను స్పష్టంగా బయటపెట్టింది. ఇక ముందు మార్పులు తప్పవన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
READ MORE: Ayatollah Arafi: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఆయతుల్లా అరాఫీ నియామకం..
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!