Gogikar Sai Krishna
Author- NTV Telugu-
ISSF World Cup2026: ISSF వరల్డ్ కప్లో భారత్ డబుల్ ధమాకా.. ఈషాకు గోల్డ్, మనుకు బ్రాంజ్.!
ISSF World Cup2026 : చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ప్రఖ్యాత ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) వరల్డ్ కప్లో భారత మహిళా షూటర్లు సత్తా చాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్కు డబుల్ మెడల్ ధమాకా లభించింది. హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని ముద్దాడగా, పారిస్ ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈషా సింగ్ ఆధిపత్యం.. మను పోరాటం ఫైనల్లో 21 […] -
Rain Alert : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 3 గంటల్లో వర్షం, 40 కిమీ వేగంతో ఈదురుగాలులు.!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న రెండు నుంచి మూడు గంటల్లో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడిన ఉరుముల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షంతో పాటు గంటకు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆకస్మిక వర్షాల వల్ల నగరంలో పలుచోట్ల రోడ్లపై […] -
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు షాక్.. వెంటనే తొలగించాలని ఆదేశం.!
హైదరాబాద్ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ‘హైడ్రా’ కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏ.వి. రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. వరుస కోర్టు ధిక్కరణ కేసులపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రంగనాథ్ను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ఆదేశించింది. అంతేకాకుండా, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. లోతుకుంట భూముల వివాదం.. కోర్టు ఆగ్రహం సికింద్రాబాద్ సమీపంలోని లోతుకుంట సర్వే […] -
Kishan Reddy : కేసీఆర్ మొండి వైఖరితోనే సింగరేణికి తీరని అన్యాయం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వింత ప్రవర్తన, మొండి వైఖరి వల్లే సింగరేణి సంస్థ తీవ్రంగా నష్టపోయిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా బొగ్గు గనులను పారదర్శకంగా వేలం పాట ద్వారా కేటాయించాలని ఆదేశించినప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలం పాటల్లో పాల్గొనకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. నూతన బొగ్గు బ్లాకులు లభించక, ఆదాయ మార్గాలు మూసుకుపోయి సింగరేణి వెనుకబడిపోవడానికి కేసీఆర్ ద్రోహమే […] -
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
ప్రధాని నరేంద్ర మోడీకి చెందిన ’56 అంగుళాల ఛాతీ’ మళ్లీ యువశక్తి ముందు లొంగిపోయిందని, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల నిరసన దెబ్బకు తలవంచక తప్పలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాడు సుదీర్ఘ పోరాటంతో రైతులు నల్ల చట్టాలను రద్దు చేయిస్తే, నేడు విద్యార్థుల ఆగ్రహంతో కేంద్ర విద్యాశాఖే విఫలమైందని విమర్శించారు. నీట్ (NEET) వివాదంలో నష్టపోయిన బాధితులందరికీ తక్షణమే న్యాయం చేయాలని, నిరసన తెలిపిన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన […] -
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
ఉత్తర తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్లో రూ.2,278.14 కోట్ల అంచనా వ్యయంతో ‘ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని రాష్ట్ర రోడ్లు, భవనాల (R&B) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణ రూపురేఖలను మార్చే గేమ్చేంజర్గా నిలవడమే కాకుండా ప్రాంతీయ పురోగతికి సరికొత్త శకాని నాంది పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు. 2,009 […] -
Bandi Sanjay : ‘జెన్-జీకి మంత్రి పదవులు ఇవ్వండి’.. రేవంత్కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ సంచలన సవాల్ విసిరారు. రాష్ట్రంలో మాటలు చెప్పడం కాదని, చిత్తశుద్ధి ఉంటే 21 నుండి 30 ఏళ్ల వయస్సున్న ‘జెన్-జీ’ (Gen-Z) యువతకు మంత్రి పదవులు ఇచ్చి ఆచరణలో చూపించాలని డిమాండ్ చేశారు. సీఎం వద్ద ఖాళీగా ఉన్న హోమ్, విద్యా, మున్సిపల్ వంటి కీలక శాఖలను యువతకే అప్పగించాలని వ్యాఖ్యానించారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్న […] -
Mohan Bhagwat : మాతృశక్తిని మర్చిపోవడమే దేశ పతనానికి కారణం
హైదరాబాద్లో నిర్వహించిన విశ్వమాంగల్య సభ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న అనేకమంది మహిళలు హాజరైన ఈ సభలో ‘యుగానుకూల మాతృత్వం’ అనే అంశంపై ఆయన కీలక ఉపన్యాసం చేశారు. శతాబ్దాలుగా మన సమాజంలో వస్తున్న మార్పులు, పాశ్చాత్య భావజాల ప్రభావం , భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను ఈ సందర్భంగా మోహన్ భాగవత్ విస్తృతంగా విశ్లేషించారు. మాతృశక్తి సంప్రదాయం , […] -
Kishan Reddy : కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు రఘునందన్ రావు, డాక్టర్ కె. లక్ష్మణ్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో పాటు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, శ్రీపాల్ రెడ్డి తదితర […] -
Harish Rao : డాక్టర్ మమతకు హరీష్ రావు సెల్యూట్.. ‘దేవుళ్లు ఎందుకంటారో నిరూపించారు.!’
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రాణాపాయం తప్పించి, ఆయన ప్రాణాలను కాపాడిన డాక్టర్ మమతా రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా డాక్టర్ మమతా రెడ్డికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలను కాపాడటంలో ఆమె అసాధారణమైన అంకితభావంతో, తీవ్రమైన ఒత్తిడిలో కూడా అచంచలమైన నిబద్ధతను, సమయస్ఫూర్తిని ప్రదర్శించారని హరీష్ రావు […]
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..