Jagga Reddy : మాట నిలబెట్టుకున్న జగ్గారెడ్డి
- సంగారెడ్డి, సదాశివపేటలో కాంగ్రెస్ మెజారిటీ
- చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ప్రకటన
- 38లో 22, 26లో 16 స్థానాలు కైవసం
- జిల్లాలో హంగ్ మున్సిపాలిటీలపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి , సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం, జగ్గారెడ్డి తాను అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం చైర్మన్ , వైస్ చైర్మన్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు.
Amazon & Flipkart లో రచ్చ.! Moto G57 Power పై భారీ డిస్కౌంట్.!
Also Read
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
- Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
జగ్గారెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం, సంగారెడ్డి మున్సిపాలిటీ చైర్పర్సన్గా కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్గా షేక్ షఫీ ఎంపికయ్యారు. సదాశివపేట మున్సిపాలిటీ చైర్పర్సన్గా మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్గా రేణుక చిరును ఫైనల్ చేశారు. వీరంతా ఈ నెల 16వ తేదీన (ఎల్లుండి) అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ 22 వార్డులను కైవసం చేసుకుంది. అలాగే సదాశివపేటలోని 26 వార్డులలో 16 స్థానాలను గెలుచుకొని తిరుగులేని పట్టు సాధించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గారెడ్డి ప్రతి వార్డుకు 8 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తెస్తానని, అలాగే ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని ఇచ్చిన హామీలు ఓటర్లను ఎంతగానో ఆకర్షించాయి.
సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలలో సంగారెడ్డి, సదాశివపేటతో పాటు నారాయణఖేడ్, ఆందోల్-జోగిపేటలను కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే, కొన్ని మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటంతో అక్కడ క్యాంపు రాజకీయాలు వేడెక్కాయి. స్వతంత్రులు , ఇతర పార్టీల మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏదేమైనా, తన సొంత నియోజకవర్గ పరిధిలో జగ్గారెడ్డి ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి రాజకీయాల్లో తన మార్కును మరోసారి చాటుకున్నారు.
Ryzen 5 + 16GB RAM + SSD.. ఇప్పుడు 46,699 కే.! డీల్ మిస్ అవ్వకండి.!
తాజావార్తలు
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!