Jagga Reddy : మాట నిలబెట్టుకున్న జగ్గారెడ్డి
- సంగారెడ్డి, సదాశివపేటలో కాంగ్రెస్ మెజారిటీ
- చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ప్రకటన
- 38లో 22, 26లో 16 స్థానాలు కైవసం
- జిల్లాలో హంగ్ మున్సిపాలిటీలపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి , సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం, జగ్గారెడ్డి తాను అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం చైర్మన్ , వైస్ చైర్మన్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు.
Amazon & Flipkart లో రచ్చ.! Moto G57 Power పై భారీ డిస్కౌంట్.!
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
జగ్గారెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం, సంగారెడ్డి మున్సిపాలిటీ చైర్పర్సన్గా కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్గా షేక్ షఫీ ఎంపికయ్యారు. సదాశివపేట మున్సిపాలిటీ చైర్పర్సన్గా మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్గా రేణుక చిరును ఫైనల్ చేశారు. వీరంతా ఈ నెల 16వ తేదీన (ఎల్లుండి) అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ 22 వార్డులను కైవసం చేసుకుంది. అలాగే సదాశివపేటలోని 26 వార్డులలో 16 స్థానాలను గెలుచుకొని తిరుగులేని పట్టు సాధించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గారెడ్డి ప్రతి వార్డుకు 8 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తెస్తానని, అలాగే ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని ఇచ్చిన హామీలు ఓటర్లను ఎంతగానో ఆకర్షించాయి.
సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలలో సంగారెడ్డి, సదాశివపేటతో పాటు నారాయణఖేడ్, ఆందోల్-జోగిపేటలను కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే, కొన్ని మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటంతో అక్కడ క్యాంపు రాజకీయాలు వేడెక్కాయి. స్వతంత్రులు , ఇతర పార్టీల మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏదేమైనా, తన సొంత నియోజకవర్గ పరిధిలో జగ్గారెడ్డి ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి రాజకీయాల్లో తన మార్కును మరోసారి చాటుకున్నారు.
Ryzen 5 + 16GB RAM + SSD.. ఇప్పుడు 46,699 కే.! డీల్ మిస్ అవ్వకండి.!
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!