Pargi Municipal : పరిగి మున్సిపాలిటీలో హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే ఇంటికి భారీగా పోలీసులు..!
- సమానంగా కాంగ్రెస్–బీఆర్ఎస్ విజయం
- ఇండిపెండెంట్లపై పార్టీల దృష్టి
- మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
- పరిగిలో క్యాంపు రాజకీయాలు ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pargi Municipal : పరిగి మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం వికారాబాద్ జిల్లా పరిగిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడం, స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్లుగా మారడంతో ఇరు పార్టీల మధ్య ‘వార్డ్’ వార్ కాస్తా ‘కిడ్నాప్’ డ్రామాకు దారితీసింది. పరిగి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో 8 వార్డుల్లో విజయం సాధించి సమానంగా నిలిచాయి. దీంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి స్వతంత్ర అభ్యర్థుల మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి ఇరు పార్టీల నేతలు రంగంలోకి దిగారు.
Flat 31% Discount : భారతదేశపు మొట్టమొదటి అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్పై భారీ డీల్..!
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి తన తల్లిని కిడ్నాప్ చేశారని ఒక స్వతంత్ర అభ్యర్థి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు పరిగిలోని మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్నారు. అయితే, పోలీసులు విచారించగా సదరు స్వతంత్ర అభ్యర్థి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను ఎవరి ఒత్తిడితోనూ ఇక్కడికి రాలేదని, తన ఇష్టపూర్వకంగానే మాజీ ఎమ్మెల్యే ఇంటికి వచ్చానని పోలీసులకు స్పష్టం చేయడంతో కిడ్నాప్ ఆరోపణలు సద్దుమణిగాయి.
ఇదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీపై ప్రతిదాడికి దిగాయి. ఒక బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిని ప్రస్తుత ఎమ్మెల్యే రాం మోహన్ రెడ్డి వర్గీయులు కిడ్నాప్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గెలిచిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని మండిపడుతున్నారు. ప్రస్తుతం పరిగిలో పోలీసుల పహారా కొనసాగుతోంది. మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ పట్టణంలో కొనసాగుతుండగా, క్యాంపు రాజకీయాలు కూడా జోరందుకున్నాయి.
Flat 31% Discount : భారతదేశపు మొట్టమొదటి అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్పై భారీ డీల్..!
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!