Pargi Municipal : పరిగి మున్సిపాలిటీలో హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే ఇంటికి భారీగా పోలీసులు..!
- సమానంగా కాంగ్రెస్–బీఆర్ఎస్ విజయం
- ఇండిపెండెంట్లపై పార్టీల దృష్టి
- మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
- పరిగిలో క్యాంపు రాజకీయాలు ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pargi Municipal : పరిగి మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం వికారాబాద్ జిల్లా పరిగిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడం, స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్లుగా మారడంతో ఇరు పార్టీల మధ్య ‘వార్డ్’ వార్ కాస్తా ‘కిడ్నాప్’ డ్రామాకు దారితీసింది. పరిగి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో 8 వార్డుల్లో విజయం సాధించి సమానంగా నిలిచాయి. దీంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి స్వతంత్ర అభ్యర్థుల మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి ఇరు పార్టీల నేతలు రంగంలోకి దిగారు.
Flat 31% Discount : భారతదేశపు మొట్టమొదటి అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్పై భారీ డీల్..!
Also Read
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి తన తల్లిని కిడ్నాప్ చేశారని ఒక స్వతంత్ర అభ్యర్థి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు పరిగిలోని మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్నారు. అయితే, పోలీసులు విచారించగా సదరు స్వతంత్ర అభ్యర్థి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను ఎవరి ఒత్తిడితోనూ ఇక్కడికి రాలేదని, తన ఇష్టపూర్వకంగానే మాజీ ఎమ్మెల్యే ఇంటికి వచ్చానని పోలీసులకు స్పష్టం చేయడంతో కిడ్నాప్ ఆరోపణలు సద్దుమణిగాయి.
ఇదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీపై ప్రతిదాడికి దిగాయి. ఒక బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిని ప్రస్తుత ఎమ్మెల్యే రాం మోహన్ రెడ్డి వర్గీయులు కిడ్నాప్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గెలిచిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని మండిపడుతున్నారు. ప్రస్తుతం పరిగిలో పోలీసుల పహారా కొనసాగుతోంది. మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ పట్టణంలో కొనసాగుతుండగా, క్యాంపు రాజకీయాలు కూడా జోరందుకున్నాయి.
Flat 31% Discount : భారతదేశపు మొట్టమొదటి అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్పై భారీ డీల్..!
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!