Pargi Municipal : పరిగి మున్సిపాలిటీలో హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే ఇంటికి భారీగా పోలీసులు..!
- సమానంగా కాంగ్రెస్–బీఆర్ఎస్ విజయం
- ఇండిపెండెంట్లపై పార్టీల దృష్టి
- మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
- పరిగిలో క్యాంపు రాజకీయాలు ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pargi Municipal : పరిగి మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం వికారాబాద్ జిల్లా పరిగిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడం, స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్లుగా మారడంతో ఇరు పార్టీల మధ్య ‘వార్డ్’ వార్ కాస్తా ‘కిడ్నాప్’ డ్రామాకు దారితీసింది. పరిగి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో 8 వార్డుల్లో విజయం సాధించి సమానంగా నిలిచాయి. దీంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి స్వతంత్ర అభ్యర్థుల మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి ఇరు పార్టీల నేతలు రంగంలోకి దిగారు.
Flat 31% Discount : భారతదేశపు మొట్టమొదటి అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్పై భారీ డీల్..!
Also Read
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
- Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!
- OTR : సడన్ గా ఆగిపోయిన గాంధీభవన్ ముఖాముఖి.. కాంగ్రెస్లో మంత్రులపై అధిష్టానం సీరియస్?
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి తన తల్లిని కిడ్నాప్ చేశారని ఒక స్వతంత్ర అభ్యర్థి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు పరిగిలోని మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్నారు. అయితే, పోలీసులు విచారించగా సదరు స్వతంత్ర అభ్యర్థి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను ఎవరి ఒత్తిడితోనూ ఇక్కడికి రాలేదని, తన ఇష్టపూర్వకంగానే మాజీ ఎమ్మెల్యే ఇంటికి వచ్చానని పోలీసులకు స్పష్టం చేయడంతో కిడ్నాప్ ఆరోపణలు సద్దుమణిగాయి.
ఇదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీపై ప్రతిదాడికి దిగాయి. ఒక బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిని ప్రస్తుత ఎమ్మెల్యే రాం మోహన్ రెడ్డి వర్గీయులు కిడ్నాప్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గెలిచిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని మండిపడుతున్నారు. ప్రస్తుతం పరిగిలో పోలీసుల పహారా కొనసాగుతోంది. మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ పట్టణంలో కొనసాగుతుండగా, క్యాంపు రాజకీయాలు కూడా జోరందుకున్నాయి.
Flat 31% Discount : భారతదేశపు మొట్టమొదటి అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్పై భారీ డీల్..!
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
-
Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!