Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
- 22లో 21 వార్డుల్లో కాంగ్రెస్ కూటమి విజయం
- పదేళ్ల బీఆర్ఎస్ కంచుకోటలో హస్తం జెండా
- భట్టి విక్రమార్క వ్యూహాలు ఫలించిన ఫలితం
- మధిర చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhira Muncipality : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిరలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న మధిర మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. ఈ విజయం రాష్ట్ర రాజకీయాల్లో భట్టి విక్రమార్క పరపతిని మరోసారి చాటిచెప్పింది.
మధిర మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 22 వార్డులకు గాను, కాంగ్రెస్ పార్టీ , ఆ పార్టీ బలపరిచిన టీడీపీ అభ్యర్థులు కలిసి ఎన్నికల బరిలోకి దిగారు. ఫలితాలు వెలువడగానే రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా ఏకంగా 21 వార్డుల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కేవలం ఒక్క వార్డులో మినహా మిగిలిన అన్ని చోట్లా హస్తం పార్టీ అభ్యర్థులే విజయం సాధించి విపక్షాలకు నామరూపాలు లేకుండా చేశారు.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
PM Modi: ప్రధాని మోడీకి ఢాకా ఆహ్వానం..?
ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పదేళ్ల కాలంలో మధిరలో జరిగిన అభివృద్ధి లోపాలను ఎత్తిచూపుతూనే, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. భట్టి వేసిన ఈ రాజకీయ వ్యూహాలు పక్కాగా ఫలించడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. “అభివృద్ధి, సంక్షేమానికి మధిర ప్రజలు పట్టం కట్టారు” అని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీలో తిరుగులేని మెజారిటీ రావడంతో, మధిర మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కౌన్సిలర్కు దక్కడం ఇప్పుడు లాంఛనమే అయింది. ఎల్లుండి జరగనున్న చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ అధికారికంగా మున్సిపల్ పీఠాన్ని అధిరోహించనుంది. పదేళ్ల తర్వాత మధిర పురవీధుల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడటం చూసి పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
Bangladesh: జూలై చార్టర్కు 70% బంగ్లాదేశీయుల ఓట్.. అసలు ఏంటి ఇది..?
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!