Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
- 22లో 21 వార్డుల్లో కాంగ్రెస్ కూటమి విజయం
- పదేళ్ల బీఆర్ఎస్ కంచుకోటలో హస్తం జెండా
- భట్టి విక్రమార్క వ్యూహాలు ఫలించిన ఫలితం
- మధిర చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhira Muncipality : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిరలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న మధిర మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. ఈ విజయం రాష్ట్ర రాజకీయాల్లో భట్టి విక్రమార్క పరపతిని మరోసారి చాటిచెప్పింది.
మధిర మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 22 వార్డులకు గాను, కాంగ్రెస్ పార్టీ , ఆ పార్టీ బలపరిచిన టీడీపీ అభ్యర్థులు కలిసి ఎన్నికల బరిలోకి దిగారు. ఫలితాలు వెలువడగానే రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా ఏకంగా 21 వార్డుల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కేవలం ఒక్క వార్డులో మినహా మిగిలిన అన్ని చోట్లా హస్తం పార్టీ అభ్యర్థులే విజయం సాధించి విపక్షాలకు నామరూపాలు లేకుండా చేశారు.
Also Read
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
- Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
PM Modi: ప్రధాని మోడీకి ఢాకా ఆహ్వానం..?
ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పదేళ్ల కాలంలో మధిరలో జరిగిన అభివృద్ధి లోపాలను ఎత్తిచూపుతూనే, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. భట్టి వేసిన ఈ రాజకీయ వ్యూహాలు పక్కాగా ఫలించడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. “అభివృద్ధి, సంక్షేమానికి మధిర ప్రజలు పట్టం కట్టారు” అని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీలో తిరుగులేని మెజారిటీ రావడంతో, మధిర మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కౌన్సిలర్కు దక్కడం ఇప్పుడు లాంఛనమే అయింది. ఎల్లుండి జరగనున్న చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ అధికారికంగా మున్సిపల్ పీఠాన్ని అధిరోహించనుంది. పదేళ్ల తర్వాత మధిర పురవీధుల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడటం చూసి పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
Bangladesh: జూలై చార్టర్కు 70% బంగ్లాదేశీయుల ఓట్.. అసలు ఏంటి ఇది..?
తాజావార్తలు
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!