Ind vs Pak : భారత్కు శివరాత్రి.. పాకిస్తాన్కు కాళరాత్రి.. పాక్పై భారత్ విజయ దుందుభి
- టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించిన భారత్
- పాకిస్తాన్ను బెంబేలెత్తించిన భారత బౌలర్లు
- 61 పరుగుల తేడాతో పాక్పై టీమిండియా ఘన విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs Pak : టీ20 వరల్డ్ కప్లో దాయాది దేశాల మధ్య జరిగిన హై-వోల్టేజ్ పోరులో టీమిండియా ఘనవిజయం సాధించింది. భారత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో పాకిస్తాన్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన పాక్ను భారత్ 61 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, తన అజేయమైన రికార్డును కొనసాగించింది.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అర్ష్దీప్ సింగ్ లేని లోటును భర్తీ చేస్తూ హార్దిక్ పాండ్యా, మొదటి ఓవర్లోనే సాహిబ్జాదా ఫర్హాన్ను డకౌట్ చేసి వికెట్ మెయిడిన్తో శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. తన మొదటి ఓవర్లోనే ప్రమాదకరమైన సయీమ్ అయూబ్ (6) , సల్మాన్ అఘా (4)లను అవుట్ చేసి పాక్ వెన్ను విరిచాడు.
Also Read
- Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
- Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
- India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
మధ్య ఓవర్లలో స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ పాక్ను కోలుకోనివ్వలేదు. ముఖ్యంగా పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. ఉస్మాన్ ఖాన్ (44) ఒక్కడే కాసేపు ప్రతిఘటించినా, అతడిని కూడా అక్షర్ స్టంప్ అవుట్ చేయడంతో పాక్ పతనం వేగవంతమైంది. చివరికి హార్దిక్ పాండ్యా తన అద్భుతమైన బౌలింగ్తో ఉస్మాన్ తారిఖ్ను బౌల్డ్ చేసి పాక్ ఇన్నింగ్స్ను ముగించాడు. 17.6 ఓవర్లలో పాకిస్తాన్ కేవలం 114 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్లలో.. హార్దిక్ పాండ్యా, బుమ్రా కీలక వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కూడా రెండు వికెట్లతో రాణించారు. వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్ చేరువలోకి రావడం విశేషం. ఈ విజయంతో టీమిండియా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. పాక్ బ్యాటర్ల తప్పుడు షాట్ సెలక్షన్ను భారత బౌలర్లు సమర్థవంతంగా వినియోగించుకున్నారు. ఫీల్డింగ్లో కూడా రింకూ సింగ్, దూబే అద్భుతమైన క్యాచ్లు పట్టి బౌలర్లకు అండగా నిలిచారు. గతేడాది ఛాంపియన్లుగా ఉన్న భారత్, ఈ ఏటా అదే జోరును కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీనితో భారత్ T20 ప్రపంచ కప్లలో పాకిస్తాన్పై 8-1తో ఆధిక్యంలో ఉంది.
తాజావార్తలు
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!