Jagtial: జగిత్యాల పంచాయితీ కొలిక్కి వచ్చినట్టేనా..?
- చైర్మన్ పీఠంపై జీవన్రెడ్డి–సంజయ్ వర్గాల పోరు
- ప్రజాభవన్లో అధిష్టానం కీలక భేటీలు
- మెజారిటీ బలం వర్సెస్ సీనియార్టీ వాదనలు
- టర్మ్ షేరింగ్ ఫార్ములా పై చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవిపై నెలకొన్న సందిగ్ధత ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్రెడ్డి , ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఇప్పుడు రాజధానిలోని ‘ప్రజాభవన్’కు చేరింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చైర్మన్ పీఠం తమ వర్గానికే దక్కాలని ఇద్దరు నేతలు పట్టుబడుతుండటంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ , ఏఐసీసీ కార్యదర్శి సవంత్కు అప్పగించారు. ఈ క్రమంలోనే ప్రజాభవన్ వేదికగా ఇద్దరు నేతలతో విడివిడిగా భేటీలు జరిగాయి, తద్వారా జగిత్యాల పంచాయితీ ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
IND vs PAK: టాస్ గెలిచిన పాకిస్తాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
Also Read
- Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
- CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
- OTR : రంగంలోకి బొత్స వారసురాలు..! అనూష పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ..!!
- Harish Rao : రేవంత్కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
ఈ చర్చల్లో ఇద్దరు నేతలు తమ తమ వాదనలను బలంగా వినిపించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి వెన్నంటి ఉన్న పాత కార్యకర్తలకు, నమ్మకస్తులకే చైర్మన్ పదవి కేటాయించాలని జీవన్రెడ్డి పట్టుబడుతున్నారు. అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించినప్పటికీ, మొదటి నుండి పార్టీ జెండా మోసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు, సంఖ్యా బలం పరంగా తన వర్గానికే ఎక్కువ మంది కౌన్సిలర్లు ఉన్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వాదిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గం నుండి 22 మంది గెలవగా, జీవన్రెడ్డి వర్గం నుండి 18 మందే గెలిచారని, ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్న తమకే చైర్మన్ పదవి ఇవ్వడం న్యాయమని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇద్దరు నేతలు ఎవరికి వారు చైర్మన్ పదవి కోసం పట్టుబట్టడంతో పార్టీలో ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడింది.
ఈ ఉత్కంఠకు తెరదించేందుకు అధిష్టానం ఒక మధ్య మార్గ పరిష్కారాన్ని అన్వేషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా చైర్మన్ పదవిని రెండున్నర ఏళ్లు ఒక వర్గానికి, మిగిలిన రెండున్నర ఏళ్లు ఇంకొక వర్గానికి ఇచ్చేలా ‘టర్మ్ షేరింగ్’ ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చైర్మన్ పదవి ఒకరికి ఇస్తే, వైస్ చైర్మన్ పదవిని రెండో వర్గానికి కేటాయించి ఇద్దరినీ సంతృప్తి పరచాలని చూస్తున్నారు. ఇప్పటికే జీవన్రెడ్డి తన కౌన్సిలర్లతో భేటీ ముగించుకుని వెనుదిరగగా, ప్రస్తుతం సంజయ్ కుమార్ వర్గంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. పార్టీలో చీలిక రాకుండా అందరినీ కలుపుకుపోయేలా అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం కోసం జగిత్యాల రాజకీయ వర్గాలు వేచి చూస్తున్నాయి.
తాజావార్తలు
-
Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
-
Rocking Star Yash: యశ్ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
-
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
-
Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?