Jagtial: జగిత్యాల పంచాయితీ కొలిక్కి వచ్చినట్టేనా..?
- చైర్మన్ పీఠంపై జీవన్రెడ్డి–సంజయ్ వర్గాల పోరు
- ప్రజాభవన్లో అధిష్టానం కీలక భేటీలు
- మెజారిటీ బలం వర్సెస్ సీనియార్టీ వాదనలు
- టర్మ్ షేరింగ్ ఫార్ములా పై చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవిపై నెలకొన్న సందిగ్ధత ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్రెడ్డి , ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఇప్పుడు రాజధానిలోని ‘ప్రజాభవన్’కు చేరింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చైర్మన్ పీఠం తమ వర్గానికే దక్కాలని ఇద్దరు నేతలు పట్టుబడుతుండటంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ , ఏఐసీసీ కార్యదర్శి సవంత్కు అప్పగించారు. ఈ క్రమంలోనే ప్రజాభవన్ వేదికగా ఇద్దరు నేతలతో విడివిడిగా భేటీలు జరిగాయి, తద్వారా జగిత్యాల పంచాయితీ ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
IND vs PAK: టాస్ గెలిచిన పాకిస్తాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
Also Read
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
ఈ చర్చల్లో ఇద్దరు నేతలు తమ తమ వాదనలను బలంగా వినిపించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి వెన్నంటి ఉన్న పాత కార్యకర్తలకు, నమ్మకస్తులకే చైర్మన్ పదవి కేటాయించాలని జీవన్రెడ్డి పట్టుబడుతున్నారు. అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించినప్పటికీ, మొదటి నుండి పార్టీ జెండా మోసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు, సంఖ్యా బలం పరంగా తన వర్గానికే ఎక్కువ మంది కౌన్సిలర్లు ఉన్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వాదిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గం నుండి 22 మంది గెలవగా, జీవన్రెడ్డి వర్గం నుండి 18 మందే గెలిచారని, ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్న తమకే చైర్మన్ పదవి ఇవ్వడం న్యాయమని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇద్దరు నేతలు ఎవరికి వారు చైర్మన్ పదవి కోసం పట్టుబట్టడంతో పార్టీలో ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడింది.
ఈ ఉత్కంఠకు తెరదించేందుకు అధిష్టానం ఒక మధ్య మార్గ పరిష్కారాన్ని అన్వేషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా చైర్మన్ పదవిని రెండున్నర ఏళ్లు ఒక వర్గానికి, మిగిలిన రెండున్నర ఏళ్లు ఇంకొక వర్గానికి ఇచ్చేలా ‘టర్మ్ షేరింగ్’ ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చైర్మన్ పదవి ఒకరికి ఇస్తే, వైస్ చైర్మన్ పదవిని రెండో వర్గానికి కేటాయించి ఇద్దరినీ సంతృప్తి పరచాలని చూస్తున్నారు. ఇప్పటికే జీవన్రెడ్డి తన కౌన్సిలర్లతో భేటీ ముగించుకుని వెనుదిరగగా, ప్రస్తుతం సంజయ్ కుమార్ వర్గంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. పార్టీలో చీలిక రాకుండా అందరినీ కలుపుకుపోయేలా అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం కోసం జగిత్యాల రాజకీయ వర్గాలు వేచి చూస్తున్నాయి.
తాజావార్తలు
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
-
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!