Jagtial: జగిత్యాల పంచాయితీ కొలిక్కి వచ్చినట్టేనా..?
- చైర్మన్ పీఠంపై జీవన్రెడ్డి–సంజయ్ వర్గాల పోరు
- ప్రజాభవన్లో అధిష్టానం కీలక భేటీలు
- మెజారిటీ బలం వర్సెస్ సీనియార్టీ వాదనలు
- టర్మ్ షేరింగ్ ఫార్ములా పై చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవిపై నెలకొన్న సందిగ్ధత ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్రెడ్డి , ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఇప్పుడు రాజధానిలోని ‘ప్రజాభవన్’కు చేరింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చైర్మన్ పీఠం తమ వర్గానికే దక్కాలని ఇద్దరు నేతలు పట్టుబడుతుండటంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ , ఏఐసీసీ కార్యదర్శి సవంత్కు అప్పగించారు. ఈ క్రమంలోనే ప్రజాభవన్ వేదికగా ఇద్దరు నేతలతో విడివిడిగా భేటీలు జరిగాయి, తద్వారా జగిత్యాల పంచాయితీ ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
IND vs PAK: టాస్ గెలిచిన పాకిస్తాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
Also Read
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
- Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
- KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
ఈ చర్చల్లో ఇద్దరు నేతలు తమ తమ వాదనలను బలంగా వినిపించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి వెన్నంటి ఉన్న పాత కార్యకర్తలకు, నమ్మకస్తులకే చైర్మన్ పదవి కేటాయించాలని జీవన్రెడ్డి పట్టుబడుతున్నారు. అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించినప్పటికీ, మొదటి నుండి పార్టీ జెండా మోసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు, సంఖ్యా బలం పరంగా తన వర్గానికే ఎక్కువ మంది కౌన్సిలర్లు ఉన్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వాదిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గం నుండి 22 మంది గెలవగా, జీవన్రెడ్డి వర్గం నుండి 18 మందే గెలిచారని, ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్న తమకే చైర్మన్ పదవి ఇవ్వడం న్యాయమని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇద్దరు నేతలు ఎవరికి వారు చైర్మన్ పదవి కోసం పట్టుబట్టడంతో పార్టీలో ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడింది.
ఈ ఉత్కంఠకు తెరదించేందుకు అధిష్టానం ఒక మధ్య మార్గ పరిష్కారాన్ని అన్వేషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా చైర్మన్ పదవిని రెండున్నర ఏళ్లు ఒక వర్గానికి, మిగిలిన రెండున్నర ఏళ్లు ఇంకొక వర్గానికి ఇచ్చేలా ‘టర్మ్ షేరింగ్’ ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చైర్మన్ పదవి ఒకరికి ఇస్తే, వైస్ చైర్మన్ పదవిని రెండో వర్గానికి కేటాయించి ఇద్దరినీ సంతృప్తి పరచాలని చూస్తున్నారు. ఇప్పటికే జీవన్రెడ్డి తన కౌన్సిలర్లతో భేటీ ముగించుకుని వెనుదిరగగా, ప్రస్తుతం సంజయ్ కుమార్ వర్గంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. పార్టీలో చీలిక రాకుండా అందరినీ కలుపుకుపోయేలా అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం కోసం జగిత్యాల రాజకీయ వర్గాలు వేచి చూస్తున్నాయి.
తాజావార్తలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్తో లింకప్ రూమర్స్పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
-
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
-
Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
-
Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!