Jangaon : జనగామలో ఆందోళన..మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
- జనగామలో చైర్మన్ ఎన్నిక వాయిదా
- హంగ్ మున్సిపాలిటీగా మారిన పరిస్థితి
- కిడ్నాప్ ఆరోపణలతో ఉద్రిక్తత
- ప్రభుత్వ ఒత్తిడిపై బీఆర్ఎస్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మున్సిపల్ పీఠాలను దక్కించుకునే క్రమంలో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం (ఫిబ్రవరి 16) నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. మున్సిపల్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఆందోళనలు, కౌన్సిల్ హాల్లో సభ్యుల మధ్య నెలకొన్న గందరగోళం వల్ల సభ నియంత్రణలో లేదని, అందుకే ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఆర్డీఓ ప్రకటించారు.
Tollywood : టాలీవుడ్ డెబ్యూకి బాలీవుడ్ బ్యూటీస్ రెడీ
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
జనగామ మున్సిపాలిటీలోని 30 వార్డులకు గానూ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ ఏర్పడింది. బీఆర్ఎస్ అత్యధిక సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అధికారం దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో, స్వతంత్ర అభ్యర్థులు ఇప్పుడు కింగ్ మేకర్లుగా మారారు. ఈ నేపథ్యంలోనే కౌన్సిలర్ల మద్దతు కూడగట్టే క్రమంలో తీవ్రస్థాయిలో రాజకీయ ఎత్తుగడలు మొదలయ్యాయి.
ఎన్నికకు ముందు జనగామలో కిడ్నాప్ కథనాలు కలకలం రేపాయి. తమ కౌన్సిలర్లను ప్రత్యర్థి పార్టీలు కిడ్నాప్ చేశాయని ఒక వర్గం ఆరోపించగా, పోలీసుల ఒత్తిడితో అక్రమంగా కేసులు పెడుతున్నారని మరో వర్గం నిరసన వ్యక్తం చేసింది. మున్సిపల్ కార్యాలయం వెలుపల వివిధ పార్టీల కార్యకర్తలు భారీగా గుమిగూడి నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది.
ఎన్నిక వాయిదా పడటంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. తాము విజయం సాధిస్తామనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికను పోస్ట్పోన్ చేయించిందని మండిపడ్డారు. అధికారుల తీరు ప్రజాస్వామ్య విరుద్ధమని, కలెక్టర్ , పోలీస్ విభాగం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని వారు ఆరోపించారు. ఎప్పుడు ఎన్నిక నిర్వహించినా గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
-
Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్లు కూలి విద్యార్థులకు గాయాలు
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!