AP Weaver Welfare: నేతన్నలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్..
- ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్
- 1.03 లక్షల చేనేత కుటుంబాలకు లబ్ధి
- 200–500 యూనిట్ల వరకు ఫ్రీ పవర్
- ఏడాదికి రూ. 85 కోట్ల భారం భరిస్తున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లోని చేనేత, మరమగ్గాల కార్మికులకు కూటమి ప్రభుత్వం చారిత్రాత్మకమైన తీపి కబురును అందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తూ, రాష్ట్రంలోని నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక పథకం ఏప్రిల్ 1, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి రాబోతోంది. దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.03 లక్షల నేతన్నల కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది.
Ishan Kishan: ఇషాన్ కిషన్ మనసు దోచిన సుందరి ఈమెనే.. త్వరలో పెళ్లి బాజాలు!
Also Read
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్ను..!
- Fake Currency Scam: రూపాయి ఇస్తే మూడు రూపాయలు.. నకిలీ నోట్ల ఆశతో 14 లక్షలు పోగొట్టుకున్న అన్నదమ్ములు!
- Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
ఈ పథకం కింద ప్రభుత్వం నిర్దిష్టమైన విద్యుత్ రాయితీలను ప్రకటించింది. చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు, , మరమగ్గాల (Power Looms) కార్మికులకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని, బడ్జెట్లో ఈ పథకానికి అవసరమైన నిధులను ప్రత్యేకంగా కేటాయించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి సగటున రూ. 8,640, , మరమగ్గాల యజమానులకు ఏడాదికి రూ. 21,600 వరకు ఆదా అవుతుందని అంచనా. ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ. 85 కోట్ల అదనపు భారం పడనున్నప్పటికీ, కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకోవడమే పరమావధిగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై చేనేత జౌళి శాఖ మంత్రి సవిత హర్షం వ్యక్తం చేస్తూ, నేతన్నల కుటుంబాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చేనేతలకు ఉన్న పెన్షన్ వయస్సును తగ్గించడంతో పాటు, పెన్షన్ మొత్తాన్ని రూ. 3,000 నుంచి రూ. 4,000కు పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు ఉచిత విద్యుత్ ద్వారా మరో భారీ హామీని నెరవేర్చిందని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్నికల హామీ మాత్రమే కాదని, చేనేత రంగాన్ని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడానికి వేసిన బలమైన అడుగు అని ఆమె అభివర్ణించారు. ఏప్రిల్ 1 నుంచి నేతన్నల ఇళ్లలో కొత్త వెలుగులు నిండబోతున్నాయని రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
-
Vivo T5 Lite 5G: వివో T5 Lite 5G త్వరలో భారత్లోకి.. 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
-
Obsession : ఇండియాలో అబ్సెషన్ కలెక్షన్ల సునామీ… కన్జ్యూరింగ్ రికార్డ్స్ బ్రేక్
-
RBI Young Professionals Recruitment 2026: ఆర్బీఐలో జాబ్స్.. నెలకు రూ.1.5 లక్షల స్టైపెండ్.. అర్హతలు, దరఖాస్తు వివరాలివే
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?