AP Weaver Welfare: నేతన్నలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్..
- ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్
- 1.03 లక్షల చేనేత కుటుంబాలకు లబ్ధి
- 200–500 యూనిట్ల వరకు ఫ్రీ పవర్
- ఏడాదికి రూ. 85 కోట్ల భారం భరిస్తున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లోని చేనేత, మరమగ్గాల కార్మికులకు కూటమి ప్రభుత్వం చారిత్రాత్మకమైన తీపి కబురును అందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తూ, రాష్ట్రంలోని నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక పథకం ఏప్రిల్ 1, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి రాబోతోంది. దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.03 లక్షల నేతన్నల కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది.
Ishan Kishan: ఇషాన్ కిషన్ మనసు దోచిన సుందరి ఈమెనే.. త్వరలో పెళ్లి బాజాలు!
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
ఈ పథకం కింద ప్రభుత్వం నిర్దిష్టమైన విద్యుత్ రాయితీలను ప్రకటించింది. చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు, , మరమగ్గాల (Power Looms) కార్మికులకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని, బడ్జెట్లో ఈ పథకానికి అవసరమైన నిధులను ప్రత్యేకంగా కేటాయించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి సగటున రూ. 8,640, , మరమగ్గాల యజమానులకు ఏడాదికి రూ. 21,600 వరకు ఆదా అవుతుందని అంచనా. ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ. 85 కోట్ల అదనపు భారం పడనున్నప్పటికీ, కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకోవడమే పరమావధిగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై చేనేత జౌళి శాఖ మంత్రి సవిత హర్షం వ్యక్తం చేస్తూ, నేతన్నల కుటుంబాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చేనేతలకు ఉన్న పెన్షన్ వయస్సును తగ్గించడంతో పాటు, పెన్షన్ మొత్తాన్ని రూ. 3,000 నుంచి రూ. 4,000కు పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు ఉచిత విద్యుత్ ద్వారా మరో భారీ హామీని నెరవేర్చిందని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్నికల హామీ మాత్రమే కాదని, చేనేత రంగాన్ని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడానికి వేసిన బలమైన అడుగు అని ఆమె అభివర్ణించారు. ఏప్రిల్ 1 నుంచి నేతన్నల ఇళ్లలో కొత్త వెలుగులు నిండబోతున్నాయని రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!