Hyderabad Cyber Fraud: అర్ధ రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకోవడం, అడ్డొస్తే హతమార్చి సొత్తు కాజేయడం ఒకప్పుడు నేరగాళ్ల పంథా. నగరంలో ఈ తరహా దోపిడీలు, దొంగతనాల స్థానంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోవడం కలవరపెడుతోంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో గత కొంతకాలంగా చోరీలు, ఇళ్లల్లో దొంగతనాల కేసుల్లో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఇదే సమయంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. తాజాగా హబ్సిగూడ చెందిన డెంటల్ డాక్టర్ను సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేశారు. డాక్టర్ నుంచి…
Harish Rao: తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం కేసీఆర్ అని మాజీ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. నేడు దీక్షా దివస్ పురస్కరించుకొని ఎక్స్ లో పోస్ట్ చేశారు. "'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ దీక్ష, ఉద్యమ గతిని మలుపు తిప్పింది. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది. 'రానే రాదు, కానే కాదు' అన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన…
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లె సర్పంచ్ ఏకగ్రీవమైంది.. ఎస్సీకి రిజర్వ్ అయిన కొండారెడ్డిపల్లె సర్పంచ్ పదవికి 15 మంది పోటీ పడ్డారు. చివరికి సర్పంచ్ ఎన్నికను గ్రామ పెద్దలు ఏకగ్రీవం చేశారు.. 15 మందిలో ఒకరి పేరును సీల్డ్ కవర్లో ప్రకటించనున్నారు. ఎవరి పేరు వచ్చినా గ్రామం మొత్తం సమిష్టిగా ఆ నిర్ణయాన్ని గౌరవించాలనేది గ్రామ నాయకత్వం అభిప్రాయంగా చెబుతున్నారు.
Ditwah Cyclone: తుఫాన్ కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. మొదట, సెన్యార్ తుఫాను, ఇప్పుడు దిత్వా తుఫాను కలకలం సృష్టిస్తోంది. ఈ తుఫాను ఇప్పటికే శ్రీలంకలో విధ్వంసం సృష్టించింది. తాజాగా భారతదేశం వైపు కదులుతోంది. ఈరోజు భారత భూభాగాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేయబడింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. భారీ వర్షపాతం అంచనా వేస్తూ వాతావరణ శాఖ…
Bihar: బీహార్లోని అరారియా జిల్లాలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తనను కారులో కిడ్నాప్ చేసి ఢిల్లీ, బీహార్లోని వివిధ ప్రాంతాల్లో నెలల తరబడి బందీగా ఉంచారని ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు స్టేషన్లో కంప్లైంట్ చేసింది. నర్పత్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలాసి గ్రామానికి చెందిన మహ్మద్ ఆలం సహా ఎనిమిది మంది తనను ఇస్లాం మతంలోకి మారాలని బలవంతం చేసి.. శారీరకంగా, మానసికంగా హింసించారని బాధితురాలు ఆరోపించింది.
India GDP Q2 2025: ఇంతగా ఎవరూ ఊహించలేదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలు సైతం తారుమారయ్యాయి. వాస్తవానికి ఆర్బీఐ రెండవ త్రైమాసికంలో 7% GDP వృద్ధిని అంచనా వేసింది. కానీ తాజాగా ఆశ్చర్యకరమైన గణాంకాలు వెలువడ్డాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) భారత ఆర్థిక వ్యవస్థ అసాధారణంగా పని తీరును కనబరిచింది. ఈ కాలంలో GDP వృద్ధి గత ఆరు త్రైమాసికాలలో అత్యధికంగా నమోందైంది. ప్రభుత్వ డేటా ప్రకారం.. రెండవ త్రైమాసికంలో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (GDP) 8.2%…
Bengaluru Airport: బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుకున్నారు. ఏకంగా రూ. 200 కోట్ల విలువ చేసే 273 కేజీల గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. నలుగురు విదేశీయులతో పాటు 32 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ నవంబర్ మాసంతో అత్యధికంగా గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. ఈ నెల మొదటి వారంలోనే రూ. 94 కోట్ల విలువ చేసే 94 కేజీల గంజాయి సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి బెంగుళూరు చేరుకున్న 4 గురు విదేశీయుల వద్ద గంజాయి గుర్తించారు.…
Hyderabad: కొడుకు, అల్లుడితో కలిసి భర్తను లేపేసింది ఓ భార్య.. మద్యం మత్తులో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తన కొడుకు, అల్లుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి బోడుప్పల్లో చోటు చేసుకుంది.. బోడుప్పల్ దేవేందర్ నగర్ ఫేజ్ - 2 కు చెందిన బండారి అంజయ్య స్థానికంగా స్కూల్ బస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బాగా మద్యం తాగే అలవాటు ఉన్న అంజయ్య.. భార్య బుగ్గమ్మ, ముగ్గురు కొడుకులు, ఒక కూతురును మానసికంగా, శారీరకంగా…
Karnataka: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ శనివారం ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి నివాసం కావేరిలో అల్పాహార విందుకు హాజరుకానున్నారు. పార్టీ హైకమాండ్ సూచనల మేరకు ఈ సమావేశం జరుగుతోంది.
Maoist Leaders Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.. మావోయిస్టు పార్టీలోని ఇద్దరు కీలక సభ్యులు లొంగిపోయారు. ఎంఎంసీ జోనల్ సెక్రెటరీ అనంత్, ఛత్తీస్ఘఢ్ దర్భ డివిజన్ సెక్రెటరీ శ్యామ్ మహారాష్ట్రలో లొంగిపోయారు.. మహారాష్ట్రలోని గోండియా పోలీసుల ముందు అనంత్ లొంగిపోయారు. గత వారం రోజులుగా ఎమ్మెల్సీ అనంత్ పేరుతో ప్రకటనలు విడుదలయ్యాయి.. జనవరి ఒకటో తేదీ నుంచి సాయుధ పోరాట విరమణ చేస్తున్నట్లు ఇందులో ప్రకటించారు. నిన్న(శుక్రవారం) ఉదయమే సాయుధ పోరాట విరమణపై ప్రకటన చేశారు అనంత్.. అంతలోపే సాయంత్రం…