Supreme Court: 10 మంది పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ దక్కింది. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇటీవల స్పీకర్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించామని స్పీకర్ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. స్పీకర్ తీర్పు వచ్చినందున కేసును అత్యున్నత న్యాయస్థానం ముగించింది. రేపటిలోగా తీర్పు కాపీలు, 5 రోజుల్లో ఇతర డాక్యూమెంట్లను…
Hyderabad: భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. నేరేడ్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్కు చెందిన నగెల్లి శ్రీనివాస్(41) ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని స్వగ్రామం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్. శ్రీనివాస్ 2012లో జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. భార్ గ్రూప్స్ పరీక్షలకు ప్రీపేర్ అయ్యేందుకు భర్త శ్రీనివాస్ చాలా హెల్ప్ చేశాడు. భర్త సహాయంతో జ్యోతి…
Petrol, Diesel Prices: మధ్యప్రాచ్యంలో యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచమంతా కనిపిస్తోంది. భారత్పై మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం పడింది. ఇప్పటికే భారత్లోని ప్రధాన నగరాల్లో ఎల్పీజీ సంక్షోభం పెరిగిపోయింది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్యులు భయపడుతున్నారు. ఈ ధరలు రానున్న కొన్ని రోజుల్లో విపరీతంగా పెరుగుతాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. పెట్రోల్, డీజిల్ ధరలపై క్లారిటీ ఇచ్చింది. ఈ ధరపై ప్రస్తుతం ప్రభావం ఉండబోదని ప్రభుత్వ వర్గాలు […]
TS Inter Results 2026: తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 18తో ముగియనున్నాయి. ఇంతలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి కీలక అప్డెట్ వచ్చింది. వచ్చే నెల అంటే ఏప్రిల్ 10 తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల చేసే యోచనలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత తొందరగా ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ వైపు పరీక్షలు జరుగుతుండగానే.. మరోవైపు మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి…
Suryakumar Yadav: భారత్ ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్పు సొంతం చేసుకున్న ఏకైక టీమ్గా అవతరించింది. ఈ వరల్డ్ కప్పు వెనుక క్రీడాకారులు, కోచ్ల కృషి వర్ణణాతీతం. మొదటి నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న టీమ్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు. గంభీర్ ప్లేయర్స్ను ఉద్దేశించి చేసిన ప్రసంగం గురించి అభివర్ణించాడు. గంభీర్ తనదైన శైలిలో జట్టులో స్ఫూర్తిని నింపుతూ.. మనం ఎన్ని…
Hardik Pandya national flag controversy: భారత్ టీ20 వరల్డ్ కప్పులో ఘన విజయం సాధించింది. మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఎంతో జోష్లో సంబరాలు జరుపుకుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై సంచలన ఆరోపణలు వచ్చాయి. జాతీయ పతాకాన్ని అవమానించాడని ఆరోపిస్తూ ఓ న్యాయవాది పూణే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూణే నగరంలోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్లో న్యాయవాది వాజిద్ ఖాన్ ఈ ఫిర్యాదు సమర్పించారు. అహ్మదాబాద్ స్టేడియంలో హార్దిక్ పాండ్యా జాతీయ పతాకాన్ని తన మెడకు…
CM Revanth Reddy: ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా చూడటంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉపయోగపడతాయని సీఎం అన్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆర్ అండ్ బీ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు సమీపంలో రోడ్లు ఉంటే వాటిని అనుసంధానించి రింగ్ రోడ్లు ఏర్పాటు…
IPL 2026: బీసీసీఐ తాజాగా ఈ సీజన్కు సంబంధించి ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది. కర్ణాటకలోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. ఇక్కడ ఓ బిగ్ ట్విస్ట్ వచ్చి పడింది. గతేడాది ఆర్సీబీ విజయం అనంతరం.. అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత స్టేడియంలో మ్యాచ్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎత్తివేసినప్పటికీ తాజాగా ఐపీఎల్…
Shahid Afridi: టీమిండియా క్రికెట్లో హిస్టరీలు క్రియేట్ చేస్తోంది. తన రికార్డులు తానే బద్దలుగొట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఏకంగా మూడు టీ20 వరల్డ్ కప్పులను తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్కు కడుపు మంట ఎక్కువైంది. అయితే.. తాజాగా పాకిస్థాన్ మాజీ దిగ్గజం షాహిద్ అఫ్రిది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అంశంపై ఓ మీడియాలో మాట్లాడాడు. టీమిండియా గ్రాండ్ విక్టరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాత జ్ఞాపకాలు సైతం గుర్తు చేసుకున్నాడు. గతంలో పంజాబ్ రాష్ట్రం మొహాలీలో భారత్ vs పాకిస్థాన్…
MS Dhoni: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఊరట లభించింది. 'కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్' (పరస్పర ప్రయోజనాల ఘర్షణ) వివాదంలో బీసీసీఐ తీర్పు వెలువరించింది. బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ అరుణ్ మిశ్రా ధోనీపై వచ్చిన ఆరోపణలకు కొట్టేశారు. ధోనీ ఇప్పటికే సీఎస్కే తరఫున్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో క్రికెట్ అకాడమీల యజమానిగా ఉంటడం నిబంధలకు విరుద్ధమని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని బీసీసీఐ తీర్పు వెలువరించింది.