Bhatti Vikramarka: ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఫైర్ అయ్యారు. న్నిన్న ఏబీఎన్లో అర్థం పర్థం లేని ఓ కథనం ప్రచురితమైంది. ఈ అంశంపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఈ బాధ్యతలో ఉన్నంతకాలం ఏ గద్దలను తెలంగాణ ఆస్తులపై వాలనివ్వనని స్పష్టం చేశారు..
Bhatti Vikramarka: బొగ్గు గనుల కోసమే అంటూ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురించడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ సీరియస్ అయ్యారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. తన పేరును పెద్ద అక్షరాలతో ప్రస్తావించారన్నారు.. ఒక లక్ష్యం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. ఆస్తులు సంపాదించేందుకు, హోదా అనుభవించేందుకు రాజీకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.. ఆస్తులను, వనరులను సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చేయడమే తన లక్ష్యమన్నారు. తన జీవితం పూర్తి పారదర్శకంగా ఉంటుందని.. ఏ మాత్రం జ్ఞానం లేకుండా మీకు…
BJP MP Manoj Tiwari’s Mumbai Home Theft: బీజేపీ నేత, ఢిల్లీ ఈశాన్య లోక్సభ నియోజకవర్గ ఎంపీ, ప్రముఖ గాయకుడు మనోజ్ తివారీ ముంబై ఇంట్లో జరిగిన చోరీ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంధేరీ వెస్ట్లోని శాస్త్రి నగర్ ప్రాంతంలో ఉన్న సుందర్బన్ అపార్ట్మెంట్లో ఈ సంఘటన జరిగింది. మొత్తం 5.40 లక్షల రూపాయల నగదు చోరీ జరిగినట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చోరీ చేసిన దొంగ ఎవరో బయట వ్యక్తి కాదు. మనోజ్ తివారీ…
PhonePe Republic Day Scam Alert: సంక్రాంతి, గణతంత్ర దినోత్సవాల వేళ ప్రజల ఆనందాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో వస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్లో "PhonePe రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్", "సంక్రాంతి కానుక" అంటూ కొన్ని నకిలీ లింకులు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిని క్లిక్ చేస్తే రూ. 5,000 ఉచితంగా పొందవచ్చని సైబర్ నేరగాల్లు ఆశపెడుతున్నారు. "మొదట ఇది నకిలీ అనుకున్నాను, కానీ నిజంగానే నాకు రూ. 5,000 వచ్చింది! మీరు కూడా ప్రయత్నించి చూడండి!" అంటూ ఒక…
MG Majestor: భారత ఎస్యూవీ మార్కెట్ను మలుపు తిప్పేందుకు ఎంజీ మోటార్ సిద్ధమవుతోంది. కంపెనీ తన కొత్త ఫ్లాగ్షిప్ ఫుల్ సైజ్ ఎస్యూవీ ఎంజీ మేజెస్టర్ను తీసుకురాబోతోంది. ఈ కొత్త ఎస్యూవీని 2026 ఫిబ్రవరి 12న అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంజీ గ్లోస్టర్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. చూడటానికి బలంగా, ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు కోరుకునే కస్టమర్లుకు ఇది మంచి ఎంపిక. లాంచ్కు ముందే ఎంజీ మేజెస్టర్ గురించి ఆటో రంగంలో మంచి చర్చ మొదలైంది.…
Kakinada: శాంతిభద్రతలను గాడిలో పెట్టేందుకు పోలీసులు చేస్తున్న కృషి గురించి అందరికి తెలిసిందే. కొందరు రక్షకబటులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటారు. అచ్చం లాంటి ఓ ఘటన తాజాగా కాకినాడలో చోటు చేసుకుంది. తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఓ ఉమెన్ కానిస్టేబుల్ ట్రాఫిక్ను క్లియర్ చేసి అందరి మన్ననలు పొందారు. ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్సును ట్రాఫిక్ నుంచి తప్పించారు. స్థానికులు వివరాల ప్రకారం.. నిన్న (శనివారం) సీఎం పర్యటన సందర్భంగా రంగంపేట పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతికి…
Amazon Great Republic Day Sale 2026: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 మొదలై 24 గంటలకు పైగా గడిచింది. ఈ ఏడాది అమెజాన్ నిర్వహిస్తున్న తొలి పెద్ద సేల్ ఇదే కావడంతో షాపింగ్ చేసే వాళ్లలో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్స్ నుంచి గృహోపకరణాలు, ఫ్యాషన్ నుంచి గేమింగ్ ల్యాప్టాప్ల వరకు దాదాపు అన్ని విభాగాల్లో ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గేమింగ్ ల్యాప్టాప్లు కొనాలనుకునే వారికి ఈ సేల్ బాగా ఉపయోగపడుతోంది. మధ్య స్థాయి ల్యాప్టాప్లు, హైఎండ్…
Cabinet Meeting: ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం, అధికారులు మేడారం రానున్నారు. వన దేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీ కానుంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4:30 ని.లకు ముఖ్యమంత్రి, మంత్రులు మేడారం చేరుకోనున్నారు. 5 గంటలకు మేడారం గద్దెల ప్రాంగణంలో ఆదివాసి ఆచారసాంప్రదాయాల ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలుకుతారు. 5PM టూ 6:30PM వరకు హరిత హోటల్ ప్రాంగణంలో మంత్రివర్గం భేటీ కానుంది.
AR Rahman Controversy: ఇటీవల ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చకు కారణమయ్యాయి. గత ఎనిమిదేళ్లుగా తనకు అవకాశాలు తగ్గాయని, దానికి కారణం కేవలం పని విషయంలో మార్పులే కాదు, నిర్ణయాలు తీసుకునే వాళ్ల ఆలోచనలు మారిపోవడమని చెప్పారు. ఈ మాటల్లో “కమ్యూనల్” అనే కోణం ఉండొచ్చని అనడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ను ఒక ప్రశ్న అడిగారు. "బాలీవుడ్లో తమిళ వర్గం పట్ల వివక్ష ఉందని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.. 1990లలో మీ అనుభవం ఎలా ఉంది"…
Komuravelli Mallanna Jatara 2026: కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి జాతర ఈరోజు (జనవరి 18) నుంచి ప్రారంభం కానుంది. అయితే, సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ప్రారంభమై ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ముగియనుంది. సుమారు రెండున్నర నెలల పాటు ఈ జాతర జరుగుతుంది. ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు కొనసాగిస్తారు. బోనాలతో భక్తులు ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లకు నైవేథ్యం సమర్పించనున్నారు. ఇక, పట్నం వేసి కల్యాణం జరిపించి తమ మొక్కులు తీర్చుకుంటారు.