Hyderabad: హైదరాబాద్లో డ్రగ్స్ దందా చేసి నాలుగేళ్లుగా పోలీసుల దృష్టికి రాకుండా పని చేస్తున్న నైజీరియన్ వ్యక్తిని నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (HNEW) అధికారులు పట్టుకున్నారు. ప్రేమ, సహజీవనం ముసుగులో యువతులను ఆకర్షించి, వారిని ఏజెంట్లుగా మార్చి మాదకద్రవ్యాల సరఫరా కోసం ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నిందితుడు స్టూడెంట్ వీసా మీద భారత్కు వచ్చి, మూడు నెలలకోసారి నగరాలను మార్చి డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడుతూ, హైదరాబాద్, బెంగళూరు, గోవా నగరాల్లో ఐదు ఇళ్లను అద్దెకు తీసుకుని […]
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. విచారణలో భాగంగా నేడు రెండో రోజు ప్రభాకర్రావును ప్రశ్నించనుంది. సిట్ కార్యాలయం నుంచి ఆయనను బషీర్బాగ్లోని సీసీఎస్కు తరలించి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వెనుక అసలు కుట్ర సూత్రధారి ఎవరు? ప్రభాకర్రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి? అనే కోణంలో సిట్ లోతుగా విచారణ చేస్తోంది. ఈ క్రమంలో ప్రభాకర్రావు, ప్రణీత్రావు ఇద్దరినీ ఒకేసారి ప్రశ్నించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫోన్…
Siddipet District: అప్పుల బాధ భరించలేక గడ్డి మందు త్రాగి దంపతుల ఆత్మహత్య ఘటన కలచివేసింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష-రుక్మిణి దంపతులు అదే గ్రామానికి చెందిన పలువురి వద్ద లక్షల్లో అప్పులు చేశారు. డబ్బులు ఇవ్వాలని శ్రీహర్షని అభిలాష్, భూపతిరెడ్డి అనే వ్యక్తులు బెదిరించారు. నిన్నటి రోజు(శనివారం) డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతూ.. ఆదివారం చెల్లించాలన్నారు. నేటితో గడువు ముగియడంతో గ్రామంలో తన పరువు పోతుందని పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తన…
Kishan Reddy letter to Sonia Gandhi: సోనియాగాంధీకి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ - 2047 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్" పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఇటీవల ఢిల్లీకి వచ్చి స్వయంగా సోనియాగాంధీకి అందించారు. ఈ సమయంలో 2 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న దూరదృష్టిని అభినందించినట్లు, తెలంగాణ…
IND vs PAK: భారత అండర్–19 జట్టు మరోసారి జూనియర్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే, రికార్డు స్థాయిలో 12వ టైటిల్ను సొంతం చేసుకునే అవకాశం భారత్కు దక్కుతుంది. టోర్నమెంట్ మొత్తం మీద భారత జట్టు మిగతా జట్ల కంటే చాలా మెరుగ్గా ఆడింది. ఆదివారం జరిగే ఫైనల్ హోరాహోరీగా సాగనుంది. ఆయుష్ మాథ్రే నాయకత్వంలో భారత్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. గ్రూప్–ఎలో ఒక్క మ్యాచ్ కూడా…
Pawan Kalyan Wishes YS Jagan Mohan Reddy: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. “వైఎస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని పవన్ కల్యాణ్ ట్వీట్లో పేర్కొన్నారు. READ MORE: Push-Ups on Railway Bridge: పైత్యం ముదిరిందా.. బ్రిడ్జిని పట్టుకుని కిందికి వేలాడిన […]
Top 5 Upcoming SUVs in India 2026: భారత కార్ మార్కెట్లో త్వరలో కొత్త మోడళ్లు రాబోతున్నాయి. వీటిలో ఎక్కువగా ఎస్యూవీ విభాగానికి చెందిన వాహనాలే ఉండటం విశేషం. కొన్ని మోడళ్లు కొత్తగా, మరికొన్ని ఇప్పటికే ఉన్న మోడళ్లకు అప్డేటెడ్ వెర్షన్లుగా రానున్నాయి. రాబోయే టాప్ 5 ఎస్యూవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
KCR: తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తదితరులు హాజరుకానున్నారు. మొత్తం సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తుండటంతో ఆయన ప్రసంగంపై పార్టీలో…
India T20 World Cup Squad: భారత్ టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటించిన వెంటనే పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా శుభ్మన్ గిల్, జితేష్ శర్మలను జట్టులోకి తీసుకోకపోవడం వార్తల్లో నిలిచింది. సెలెక్టర్లు వ్యక్తిగతం కంటే జట్టు అవసరాలు, వ్యూహాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ఒకవైపు స్పష్టమైన ఆలోచనగా కనిపిస్తుంది. మరోవైపు జట్టు ప్లానింగ్లో కొన్ని లోపాలు ఉన్నాయనే భావనను కూడా కలిగిస్తోంది. టెస్ట్, వన్డే కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ను ప్రపంచకప్ జట్టులోకి తీసుకోకపోవడం పెద్ద నిర్ణయమే. కానీ గిల్ తాజా ఫామ్ను…
India vs Pakistan: నేడు (డిసెంబర్ 21 ఆదివారం) దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో అండర్-19 ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. ఇందులో భారత్ జట్టు పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. ఆదివారం ఉదయం 10:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆయుష్ మాథ్రే నాయకత్వంలో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్ దశలోనే భారత్ పాకిస్థాన్ను 90 పరుగుల తేడాతో ఓడించింది. సెమీఫైనల్లో శ్రీలంకపై భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో సులభంగా గెలిచింది. మరోవైపు.. పాకిస్థాన్…