Hanamkonda: హనుమకొండ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని హసన్పర్తి మండలంలో నిన్న(శుక్రవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు SR కాలేజీకు చెందిన విద్యార్థులు కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు విద్యార్థులు కిందపడ్డారు. లారీ వారి శరీరంపై నుంచి వెళ్లింది. దీంతో విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను సుప్రతిక్, అక్రమ్గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.