-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్..
Uday Krishna Reddy: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేసి, ఉదయ్ కృష్ణారెడ్డిపై మరిన్ని కఠిన సెక్షన్లను నమోదు చేశారు. మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో లేని రెండు కీలకమైన, తీవ్రమైన నేర విభాగాలు ఈ విచారణ ప్రక్రియలో వెలుగులోకి వచ్చాయి. -
Ramayana Trailer: లీకులకు భయపడి విడుదల చేశారా?.. ‘రామాయణం’ ట్రైలర్ స్ట్రాటజీపై నెట్టింట తీవ్ర చర్చ!
Ramayana Trailer: రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం' ట్రైలర్ ఎట్టకేలకు విడుదలై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్, నటీనటుల లుక్స్ చూసి ప్రేక్షకులు ప్రశంసిస్తుంటే, మరోవైపు ఈ ట్రైలర్ను విడుదల చేసిన వ్యూహంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ ట్రైలర్ జూలై 24నే రావాల్సి ఉన్నప్పటికీ, వాయిదాల పర్వం తర్వాత జూలై 30న తెల్లవారుజామున 4:15 గంటల బ్రహ్మముహూర్తంలో విడుదల చేశారు. మేకర్స్ దీనికి… -
Ramayana Trailer: బ్రహ్మముహూర్తంలో ‘రామాయణం’ ట్రైలర్ విడుదల.. అద్భుత విజువల్స్తో కట్టిపడేసిన మేకర్స్
Ramayana Trailer: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ అద్భుత ఘట్టం రానే వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో, నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణం ధమాకా ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. గురువారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో, సరిగ్గా 4:15 గంటలకు మేకర్స్ ఈ ట్రైలర్ను ఆవిష్కరించారు. ఈ విజువల్ వండర్ చూసిన ప్రతీ ఒక్కరూ ఇంతకాలం వేచి చూసినందుకు ఫలితం దక్కిందని మూవీ టీమ్ను ప్రశంసిస్తున్నారు. -
Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
Supreme Court: పర్యావరణ అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు (Environmental Clearances - ECs) లేకుండా ప్రాజెక్ట్లను ప్రారంభించి, ఆ తర్వాత ‘పోస్ట్-ఫాక్టో’ అనుమతులు పొందే ధోరణికి సుప్రీంకోర్టు విరామం ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986లోని సెక్షన్ 3 కింద చట్టబద్ధమైన గెజెట్ నోటిఫికేషన్ ద్వారా పరిమితంగా ప్రాజెక్ట్లను క్రమబద్ధీకరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, కేవలం ఒక సాధారణ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మెమోరాండమ్ (OM) ద్వారా ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వడం కుదరదని… -
Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
Manmohan Singh: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అత్యంత సంచలనం సృష్టించిన బొగ్గు బ్లాకుల కేటాయింపుల (కోల్ స్కామ్) కేసులో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు బుధవారం ముగించింది. అంతేకాకుండా ఆయనకు విచారణకు హాజరుకావాలంటూ గతంలో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్ల ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. ఈ కేసులో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సీబీఐ ఇప్పటికే క్లీన్ చిట్ ఇస్తూ ముగింపు నివేదిక (క్లోజర్ రిపోర్ట్)… -
EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
EPFO: బ్యాంకులు, ఎల్ఐసీ (LIC), ఈపీఎఫ్ఓ (EPFO)లలో వేల కోట్ల రూపాయల క్లెయిమ్ చేయని (Unclaimed) సొమ్ము ఏళ్ల తరబడి మూలుగుతోంది. ఈ క్రమంలో కార్మిక వర్గానికి శుభవార్త అందిస్తూ.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ సొమ్మును అసలైన హక్కుదారులకు చేర్చేందుకు ఓ సరికొత్త విప్లవాత్మక అడుగు వేసింది. ఇకపై ఖాతాదారులు ఎలాంటి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే.. నిరుపయోగంగా (In-active) ఉన్న పీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా రూ.1 లక్షకు పైగా సబ్స్క్రైబర్ల బ్యాంక్ ఖాతాల్లోకి… -
JP Nadda: “ఉద్యమాల్లో పాల్గొంటే పోలీసు దెబ్బలకు సిద్ధపడాల్సిందే”.. సీజేపీ నిరసనపై జేపీ నడ్డా ఫైర్
JP Nadda: విద్యార్థి ఉద్యమాలు, పోలీస్ చర్యలు, పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనలతో దేశ రాజకీయం తీవ్ర ఉత్కంఠగా మారింది. విద్యార్థి నేతలపై పోలీసుల దాడులపై అధికార, ప్రతిపక్షాల నడుమ పార్లమెంట్ వేదికగా విమర్శల యుద్ధం నడిచింది. నిరసనల్లో పాల్గొనే విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం సహజమేనని, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసు చర్యలు పూర్తిగా సమర్థనీయమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనేవారు పోలీస్ చర్యలకు సిద్ధపడాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) రోజుల్లో… -
Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక లైవ్ స్ట్రీమింగ్లో ఆ మాటలు వినిపించవు
Supreme Court: సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమింగ్ చూసేవారికి ఇకపై ఓ కీలక సమయంలో మాటలు వినిపించవు. అత్యవసర కేసుల విచారణకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ముందు న్యాయవాదులు చేసే అభ్యర్థనలు, ఆ సమయంలో జరిగే సంభాషణల ఆడియోను మ్యూట్ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల లైవ్ వీడియో ఫీడ్ కనిపిస్తుంది కానీ, లాయర్లు అడిగే అత్యవసర అంశాలు, దానికి కోర్టు ఇచ్చే మౌఖిక సమాధానాలు, వ్యాఖ్యలు ఇకపై సామాన్య ప్రజలకు, మీడియాకు వినపడవు. ఈ నిర్ణయం వెనుక ఓ… -
Sabir Bhatia: 2012లో ఫ్లాట్ బుక్ చేస్తే.. 2032లో చేతికి తాళాలు!.. కుబేరుడికే ఈ గతి పడితే సామాన్యుడి పరిస్థితేంటి?
Sabir Bhatia: భారత్లో సొంతిల్లు కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరి కల. మనకు ఇష్టమైన ఇంటి నిర్మాణం వెనుక ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఆందోళనలతో కూడిన దీర్ఘకాలిక ప్రయాణం ఉంటుంది. నిర్మాణంలో జాప్యాలు, చట్టపరమైన వివాదాలు, అనుమతుల్లో ఆలస్యం వల్ల ఎంతో మంది కొనుగోలుదారులు తమ కలల గృహాల కోసం ఏళ్లకు ఏళ్లు నిరీక్షిస్తూనే ఉంటారు ఉన్నారు కూడా. ఈ క్రమంలో హాట్మెయిల్ సహ వ్యవస్థాపకుడు, భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త సబీర్ భాటియా పంచుకున్న అనుభవం ఇప్పుడు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బాధితుల ఆవేదనకు… -
Income Tax: భారత్లో పెరుగుతున్న కుబేరులు.. 300% పెరిగిన శతకోటీశ్వరులు.. రూ.100 కోట్ల క్లబ్లో 576 మంది
Income Tax: భారత్లో కుబేరుల సంఖ్య రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని వెల్లడించిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య అసెస్మెంట్ ఇయర్ (AY) 2025-26 నాటికి ఏకంగా 576కు చేరింది. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన అధికారిక గణాంకాల ద్వారా ఈ విషయం బయటపడింది. గతేడాది ఈ సంఖ్య 415గా ఉండేది. దేశంలో శతకోటీశ్వరుల సంఖ్య పెరుగుతోందా అని అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఐదేళ్ల క్రితం…
తాజావార్తలు
-
Gulveer Singh History: గుల్వీర్ సింగ్ నయా చరిత్ర.. తొలి భారత అథ్లెట్గా!
-
Huawei MatePad 11.5 2026: హువావే మేట్ప్యాడ్ 11.5 భారత్లో లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 120Hz పేపర్మ్యాట్ డిస్ప్లే
-
Tilak Varma: స్టార్ బాయ్కి ప్రమోషన్.. సౌత్ జోన్ కెప్టెన్గా ఛాన్స్.!
-
Trump: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్పై కొత్త దాడులకు బ్రేక్..
-
Ghattamaneni Aadiseshagirirao : పద్మాలయ స్టూడియోస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే భాద్యత జై కృష్ణపై ఉంది
ట్రెండింగ్
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!