India vs New Zealand: టీమిండియాకు ఆ హోటల్ అస్సలు కలిసి రావట్లేదట.. ఫైనల్కు ముందు సంచలన నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand: రేపు తుది సమరానికి భారత్ సిద్ధమైంది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఢీ కొట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకుంది. అయితే.. టీమిండియా తాజాగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హోటల్ను మార్చింది. భారత క్రికెట్ జట్టులో నమ్మకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. భారత జట్టులో చాలా మంది ఆటగాళ్లు చిన్న చిన్న విశ్వాసాలను సీరియస్గా తీసుకుంటారు. తాజాగా ఫైనల్ దగ్గర పడుతున్న సమయంలో అలాంటి సంఘటన ఒకటి చర్చకు వచ్చింది. అహ్మదాబాద్లో జరగబోయే తుది పోరుకు ముందు భారత జట్టు తమకు కేటాయించిన హోటల్ను మార్చిందని వార్తలు వచ్చాయి. అయితే అహ్మదాబాద్ నగరంలో గతంలో ఎదురైన చేదు అనుభవాలు ఇంకా జట్టు మనసుల్లో ఉన్నాయనే భావన కలుగుతోంది. ఎందుకంటే ఈ మైదానం భారత జట్టుకు గతంలో అంతగా కలిసిరాలేదు. రెండు పెద్ద మ్యాచ్లలో ఇక్కడే చేదు ఓటములు ఎదురయ్యాయి.
READ MORE: ‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ వద్ద మళ్ళీ వసూళ్ల సునామీ గ్యారంటీ!
Also Read
- BJP: ఇటు చూడు రాహుల్ గాంధీ.. ‘‘హగ్’’ కామెంట్స్కు ఇందిరాగాంధీతో సమాధానం..
- Asim Munir: అసిమ్ మునీర్కు కీలక బాధ్యతలు.. మతలబు ఏంటో..!?
- Multibagger Stocks: ఏడాదిగా ముంచిన షేరు.. ఒకే ఒక్క వార్తతో మళ్లీ రాకెట్లా దూసుకెళ్లింది..
- Bomb Threat: రాజధానిలో హై అలర్ట్.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో బాంబు బెదిరింపులు..
2023లో ప్రపంచ కప్ తుది పోరులో భారత జట్టు భారీ ఆశల మధ్య ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దేశమంతా విజయాన్ని ఎదురుచూస్తుండగా ఆ మ్యాచ్లో జట్టు పూర్తిగా తడబడింది. అదే మైదానంలో ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లోనూ భారత జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. 188 పరుగుల సాధించాల్సి ఉండగా.. జట్టు కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. అయితే.. ఈ రెండు కీలక మ్యాచుల్లో ప్లేయర్స్ ఓ హోటల్లో బస చేశారు. ఆ హోటల్ కలిసి రాలేదట. అందుకే అహ్మదాబాద్లోని మరో హోటల్కు సిఫ్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై అధికారికంగా ఎవరూ మాట్లాడకపోయినా గతంలో అదే హోటల్లో ఉన్నప్పుడు రెండు కీలక మ్యాచ్లలో ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇదొక్కటే కాదు, ఈ పోటీలో భారత జట్టు మరి కొన్ని విషయాల్లోనూ విశ్వాసాలను పాటించినట్లు తెలుస్తోంది. ముంబైలో జరిగిన సెమీఫైనల్కు ముందు రోజు సాధారణంగా జరిగే సాధన కార్యక్రమాన్ని జట్టు నలభై ఐదు నిమిషాలు ఆలస్యం చేసింది. ఆ సమయంలో చంద్ర గ్రహణం ఉండటమే కారణమని చెబుతున్నారు. భారతీయ సంప్రదాయాల్లో గ్రహణ సమయంలో కొత్త పనులు ప్రారంభించకూడదనే నమ్మకం ఉండటంతో ఆ సమయాన్ని దాటిన తర్వాతే సాధన మొదలుపెట్టారు.
READ MORE: Gaddar Film Awards 2025: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025.. ఉత్తమ చిత్రం, విజేతల జాబితా ఇదే!
తాజావార్తలు
-
BJP: ఇటు చూడు రాహుల్ గాంధీ.. ‘‘హగ్’’ కామెంట్స్కు ఇందిరాగాంధీతో సమాధానం..
-
George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
-
Asim Munir: అసిమ్ మునీర్కు కీలక బాధ్యతలు.. మతలబు ఏంటో..!?
-
Multibagger Stocks: ఏడాదిగా ముంచిన షేరు.. ఒకే ఒక్క వార్తతో మళ్లీ రాకెట్లా దూసుకెళ్లింది..
-
Prabhas Fauzi: ప్రభాస్లో ఊహించని మార్పు.. ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ అంతలా పట్టించుకుంటున్నాడా?
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!