India vs New Zealand: టీమిండియాకు ఆ హోటల్ అస్సలు కలిసి రావట్లేదట.. ఫైనల్కు ముందు సంచలన నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand: రేపు తుది సమరానికి భారత్ సిద్ధమైంది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఢీ కొట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకుంది. అయితే.. టీమిండియా తాజాగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హోటల్ను మార్చింది. భారత క్రికెట్ జట్టులో నమ్మకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. భారత జట్టులో చాలా మంది ఆటగాళ్లు చిన్న చిన్న విశ్వాసాలను సీరియస్గా తీసుకుంటారు. తాజాగా ఫైనల్ దగ్గర పడుతున్న సమయంలో అలాంటి సంఘటన ఒకటి చర్చకు వచ్చింది. అహ్మదాబాద్లో జరగబోయే తుది పోరుకు ముందు భారత జట్టు తమకు కేటాయించిన హోటల్ను మార్చిందని వార్తలు వచ్చాయి. అయితే అహ్మదాబాద్ నగరంలో గతంలో ఎదురైన చేదు అనుభవాలు ఇంకా జట్టు మనసుల్లో ఉన్నాయనే భావన కలుగుతోంది. ఎందుకంటే ఈ మైదానం భారత జట్టుకు గతంలో అంతగా కలిసిరాలేదు. రెండు పెద్ద మ్యాచ్లలో ఇక్కడే చేదు ఓటములు ఎదురయ్యాయి.
READ MORE: ‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ వద్ద మళ్ళీ వసూళ్ల సునామీ గ్యారంటీ!
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
2023లో ప్రపంచ కప్ తుది పోరులో భారత జట్టు భారీ ఆశల మధ్య ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దేశమంతా విజయాన్ని ఎదురుచూస్తుండగా ఆ మ్యాచ్లో జట్టు పూర్తిగా తడబడింది. అదే మైదానంలో ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లోనూ భారత జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. 188 పరుగుల సాధించాల్సి ఉండగా.. జట్టు కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. అయితే.. ఈ రెండు కీలక మ్యాచుల్లో ప్లేయర్స్ ఓ హోటల్లో బస చేశారు. ఆ హోటల్ కలిసి రాలేదట. అందుకే అహ్మదాబాద్లోని మరో హోటల్కు సిఫ్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై అధికారికంగా ఎవరూ మాట్లాడకపోయినా గతంలో అదే హోటల్లో ఉన్నప్పుడు రెండు కీలక మ్యాచ్లలో ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇదొక్కటే కాదు, ఈ పోటీలో భారత జట్టు మరి కొన్ని విషయాల్లోనూ విశ్వాసాలను పాటించినట్లు తెలుస్తోంది. ముంబైలో జరిగిన సెమీఫైనల్కు ముందు రోజు సాధారణంగా జరిగే సాధన కార్యక్రమాన్ని జట్టు నలభై ఐదు నిమిషాలు ఆలస్యం చేసింది. ఆ సమయంలో చంద్ర గ్రహణం ఉండటమే కారణమని చెబుతున్నారు. భారతీయ సంప్రదాయాల్లో గ్రహణ సమయంలో కొత్త పనులు ప్రారంభించకూడదనే నమ్మకం ఉండటంతో ఆ సమయాన్ని దాటిన తర్వాతే సాధన మొదలుపెట్టారు.
READ MORE: Gaddar Film Awards 2025: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025.. ఉత్తమ చిత్రం, విజేతల జాబితా ఇదే!
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!