Ramesh Nalam
Author- NTV Telugu-
SomiReddy: అరాచకాలకు పాల్పడే వైసీపీతో ఏ పార్టీ కలవలేదు
పొత్తుల విషయంలో వైసీపీ నేతలు వరుసగా స్పందిస్తూ టీడీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేయడం తెలియదని, పొత్తు లేకపోతే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరని ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తుల విషయంలో వైసీపీ నేతల కామెంట్లపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అవినీతి, అరాచకాల కంపుకొట్టే వైసీపీ పక్కన నిలబడేందుకు ఏ రాజకీయ పార్టీ ఇష్టపడదని వ్యాఖ్యానించారు. అందుకే వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ కూడా ముందుకు రావడం […] -
Asani Cyclone: అలర్ట్.. అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు
అసని తుఫాన్ ఏపీ వైపునకు దూసుకొస్తోంది. ఇప్పటికే ఇది తీవ్ర తుఫాన్గా మారింది. బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 670కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. రేపు రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి తీవ్ర తుఫాన్ ప్రవేశించనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. గంటకు 19 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ దిశను మార్చుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వెంబడి ప్రయాణిస్తుందని భావిస్తోంది. సని తుఫాన్ ఒడిశా వైపు వెళ్లినా.. ఏపీ తీరంపైనా తీవ్రంగా ప్రభావం చూపే అవకాశముంది. శ్రీకాకుళం, […] -
Big Boss OTT: బిగ్బాస్ హౌస్లో ‘జై బాలయ్య’ నినాదాలు
ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న బిగ్బాస్ చివరి అంకానికి చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్లోకి మాజీ కంటెస్టెంట్లు వస్తూ సందడి చేస్తున్నారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ అందించేందుకు బిగ్బాస్-5 విన్నర్ వీజే సన్నీ హౌస్లోకి వచ్చి సరదాగా కంటెస్టెంట్లతో ముచ్చట్లు చెప్పాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం బిగ్బాస్ ఆదేశాల మేరకు ఐదుగురు సభ్యుల మధ్య పోటీని నిర్వహించాడు. అఖిల్, బిందుమాధవి, అనిల్, బాబా భాస్కర్, అరియానా ఈ పోటీలో పాల్గొన్నారు. అయితే ఈ పోటీలో బాబా భాస్కర్ […] -
IPL 2022: భారీ స్కోర్లలో CSKదే రికార్డు.. రెండో స్థానం ఎవరిదంటే..?
ఐపీఎల్లో ఆదివారం రాత్రి చెన్నై సూపర్కింగ్స్ జట్టు రెచ్చిపోయి ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే ఫోర్లు, సిక్సులతో డీవై పాటిల్ మైదానాన్ని హోరెత్తించాడు. దీంతో చెన్నై జట్టు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసిన జట్టుగా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్లో ఇప్పటివరకు 23 సార్లు 200 పస్ల్ స్కోర్లు […] -
PM Kisan: రైతులకు గమనిక.. ఈనెల 31 వరకే గడువు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఏడాదికి మూడు సార్లు జమ చేస్తుంది. ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ.6వేల నగదును కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా గతంలో కేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారి ఖాతాల్లోఏ […] -
Balineni: సొంత పార్టీపై చంద్రబాబుకు నమ్మకం లేదా?
ఏపీలో ప్రస్తుతం పొత్తుల రాజకీయం హాట్ హాట్గా నడుస్తోంది. కర్నూలు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ మంత్రులు, కీలక నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అనేక సంవత్సరాలు సీఎంగా పనిచేశారని, అయినప్పటికీ ఆయనకు సొంత పార్టీపై నమ్మకం లేదని బాలినేని విమర్శించారు. అందుకే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. […] -
Tirumala: టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి పూర్తిస్థాయి బాధ్యతలు
టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఆదివారం నాడు పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన అదనపు ఈవోగా సేవలు అందించారు. ప్రస్తుతం ఈవో పదవితో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న జవహర్రెడ్డిని ఈవో బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జవహర్రెడ్డి మాట్లాడుతూ.. తాను స్వామివారి సేవలో 19 నెలలు సేవలందించటం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని […] -
Andhra Pradesh: పలమనేరులో దారుణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై దాడి
చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై కొందరు దాడి చేయగా ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని కొడుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పలమనేరు పాతపేట పోలీస్ లైన్ వీధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నిరంజన్ నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో ఒకే వీధిలో కాపురం ఉంటున్న ఎదురెదురు ఇళ్ల మధ్య గొడవ జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి నిరంజన్పై దాడి కోసం ఎదురింటి వ్యక్తి ఓ గ్యాంగ్ను రంగంలోకి […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
★ ఏపీ హైకోర్టుకు నేటి నుంచి జూన్ 10 వరకు వేసవి సెలవులు.. సెలవుల్లో అత్యవసర పిటిషన్ల విచారణకు వెకేషన్ కోర్టులు ★ నెల్లూరు జిల్లాలో నేడు మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. పెన్నా, సంగం బ్యారేజీల సందర్శన.. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం ★ శ్రీకాకుళం : నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం.. హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ★ గుంటూరు: నేడు డీజీపీని కలవనున్న బీజేపీ నేతలు.. సత్యసాయి జిల్లాలో […] -
IPL 2022: చెన్నై బౌలర్ల దెబ్బకు అల్లాడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 91పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో చెన్నై బౌలర్ల దెబ్బకు 17.4 ఓవర్లలో ఢిల్లీ 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఒక్క ఆటగాడు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. వార్నర్ (19), శ్రీకర్ భరత్ (8), మిచెల్ […]
తాజావార్తలు
-
Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
-
Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
-
Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
-
Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!