Harish Rao : అసెంబ్లీని 15 రోజులు జరపాల్సిందే.. బీఏసీ మీటింగ్లో హరీష్ రావు డిమాండ్..
- అసెంబ్లీలో ముగిసిన BAC సమావేశం
- సభ 15 రోజులు జరపాలని పట్టు పట్టాం
- వారం రోజులు జరుపుతామన్నారు
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అనుమతి ఇవ్వాలని అడిగాం. -హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల నిర్వహణపై స్పష్టతనిచ్చేందుకు నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని, సభ నిర్వహణ తీరుపై పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సభను ఎక్కువ రోజులు నిర్వహించాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు.
బీఏసీ సమావేశం అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, అందుకే అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని తాము డిమాండ్ చేసినట్లు తెలిపారు. కేవలం వారం రోజుల్లో ప్రజా సమస్యలన్నింటిపై చర్చించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కేవలం మూడు లేదా నాలుగు రోజులతో సభను ముగించే ప్రయత్నం చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
- MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
- KTR: "రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా".. సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
ప్రతిపక్షాల డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తూ.. ప్రస్తుతం ఒక వారం పాటు సమావేశాలను నిర్వహించేందుకు అంగీకరించింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులను బట్టి సమావేశాలను మరిన్ని రోజులు పొడిగించే అంశంపై మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు హరీష్ రావు వెల్లడించారు. దీనివల్ల సభ ఎన్ని రోజులు జరుగుతుందనే దానిపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది.
నదీ జలాల అంశంపై సభలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. ప్రభుత్వం ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (PPT) ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తాము కూడా పీపీటీ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని బీఏసీ సమావేశంలో కోరింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని, ప్రాజెక్టుల వివరాలను ప్రజలకు వివరించేందుకు తమకు కూడా సమాన అవకాశం ఇవ్వాలని హరీష్ రావు కోరారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే బీఏసీలో జరిగిన ఈ చర్చలు చూస్తుంటే, రాబోయే రోజుల్లో సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. వారం రోజుల సమావేశాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రతిపక్షం ప్రభుత్వంపై ఎలాంటి అస్త్రాలను ప్రయోగిస్తుందనేది వేచి చూడాలి.
AP News: మందు బాబులకు శుభవార్త.. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు!
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్లో భారత్కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్ను క్లీన్స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..