Harish Rao : అసెంబ్లీని 15 రోజులు జరపాల్సిందే.. బీఏసీ మీటింగ్లో హరీష్ రావు డిమాండ్..
- అసెంబ్లీలో ముగిసిన BAC సమావేశం
- సభ 15 రోజులు జరపాలని పట్టు పట్టాం
- వారం రోజులు జరుపుతామన్నారు
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అనుమతి ఇవ్వాలని అడిగాం. -హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల నిర్వహణపై స్పష్టతనిచ్చేందుకు నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని, సభ నిర్వహణ తీరుపై పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సభను ఎక్కువ రోజులు నిర్వహించాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు.
బీఏసీ సమావేశం అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, అందుకే అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని తాము డిమాండ్ చేసినట్లు తెలిపారు. కేవలం వారం రోజుల్లో ప్రజా సమస్యలన్నింటిపై చర్చించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కేవలం మూడు లేదా నాలుగు రోజులతో సభను ముగించే ప్రయత్నం చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
ప్రతిపక్షాల డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తూ.. ప్రస్తుతం ఒక వారం పాటు సమావేశాలను నిర్వహించేందుకు అంగీకరించింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులను బట్టి సమావేశాలను మరిన్ని రోజులు పొడిగించే అంశంపై మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు హరీష్ రావు వెల్లడించారు. దీనివల్ల సభ ఎన్ని రోజులు జరుగుతుందనే దానిపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది.
నదీ జలాల అంశంపై సభలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. ప్రభుత్వం ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (PPT) ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తాము కూడా పీపీటీ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని బీఏసీ సమావేశంలో కోరింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని, ప్రాజెక్టుల వివరాలను ప్రజలకు వివరించేందుకు తమకు కూడా సమాన అవకాశం ఇవ్వాలని హరీష్ రావు కోరారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే బీఏసీలో జరిగిన ఈ చర్చలు చూస్తుంటే, రాబోయే రోజుల్లో సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. వారం రోజుల సమావేశాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రతిపక్షం ప్రభుత్వంపై ఎలాంటి అస్త్రాలను ప్రయోగిస్తుందనేది వేచి చూడాలి.
AP News: మందు బాబులకు శుభవార్త.. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు!
తాజావార్తలు
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!