Harish Rao : అసెంబ్లీని 15 రోజులు జరపాల్సిందే.. బీఏసీ మీటింగ్లో హరీష్ రావు డిమాండ్..
- అసెంబ్లీలో ముగిసిన BAC సమావేశం
- సభ 15 రోజులు జరపాలని పట్టు పట్టాం
- వారం రోజులు జరుపుతామన్నారు
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అనుమతి ఇవ్వాలని అడిగాం. -హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల నిర్వహణపై స్పష్టతనిచ్చేందుకు నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని, సభ నిర్వహణ తీరుపై పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సభను ఎక్కువ రోజులు నిర్వహించాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు.
బీఏసీ సమావేశం అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, అందుకే అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని తాము డిమాండ్ చేసినట్లు తెలిపారు. కేవలం వారం రోజుల్లో ప్రజా సమస్యలన్నింటిపై చర్చించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కేవలం మూడు లేదా నాలుగు రోజులతో సభను ముగించే ప్రయత్నం చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
ప్రతిపక్షాల డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తూ.. ప్రస్తుతం ఒక వారం పాటు సమావేశాలను నిర్వహించేందుకు అంగీకరించింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులను బట్టి సమావేశాలను మరిన్ని రోజులు పొడిగించే అంశంపై మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు హరీష్ రావు వెల్లడించారు. దీనివల్ల సభ ఎన్ని రోజులు జరుగుతుందనే దానిపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది.
నదీ జలాల అంశంపై సభలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. ప్రభుత్వం ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (PPT) ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తాము కూడా పీపీటీ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని బీఏసీ సమావేశంలో కోరింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని, ప్రాజెక్టుల వివరాలను ప్రజలకు వివరించేందుకు తమకు కూడా సమాన అవకాశం ఇవ్వాలని హరీష్ రావు కోరారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే బీఏసీలో జరిగిన ఈ చర్చలు చూస్తుంటే, రాబోయే రోజుల్లో సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. వారం రోజుల సమావేశాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రతిపక్షం ప్రభుత్వంపై ఎలాంటి అస్త్రాలను ప్రయోగిస్తుందనేది వేచి చూడాలి.
AP News: మందు బాబులకు శుభవార్త.. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు!
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!