రేపటి నుంచి అమల్లోకి పెరిగిన భూముల రేట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పెరిగిన భూముల ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రేట్ల పెంపుపై ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్… వ్యవసాయ భూములపై 50 శాతం పెంచింది. కనిష్ఠ మార్కెట్ విలువ ఎకరాకు 75 వేలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా ఏరియాల్లో ఉన్న మార్కెట్ విలువలకు అనుగుణంగా 3 స్లాబ్ లు చేసింది. ఓపెన్ ప్లాట్ల చదరపు గజం కనీస ధర 100 రూపాయల నుంచి 200 లకు పెంచిన సర్కార్… 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన శ్లాబులుగా చేసింది. అపార్ట్మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు కనీస విలువ 800 నుంచి1000కి పెంచిన ప్రభుత్వం.. చదరపు అడుగుపై 20 శాతం, 30 శాతం లెక్కన పెంచింది. ఆదాయ వనరులు పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా భూముల మార్కెట్ ధరలు పెంచాలని, రిజిస్ట్రేషన్ చార్జెస్ హైక్ చేయాలని నిర్ణయించింది. 2013 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరిసారిగా భూముల విలువను సవరించింది అప్పటి ప్రభుత్వం. అప్పటి నుంచీ ల్యాండ్ వాల్యూస్ రివైజ్ చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం రెట్టింపు కావడంతో భూముల విలువ పెంచింది సర్కార్. కేబినెట్ సబ్ కమిటీ సూచనలతో ఈ నిర్ణయం తీసుకుంది.
పెంచిన భూముల ధరలు రేపటి నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాఫ్ట్వేర్ను కూడా సిద్ధం చేశారు అధికారులు. దీంతో రిజిస్ట్రేషన్ చార్జెస్ తో పాటు ఇతర సేవలు గిఫ్ట్ డీడ్, కుటుంబీకుల మధ్య రిజిస్ట్రేషన్లు, ఒప్పందాల రేట్లు కూడా పెరగనున్నాయి. అయితే, కరోనాతో అంచనా వేసుకున్నంత ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు. మరో వైపు ప్రభుత్వ వ్యయం పెరిగిపోతుంది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. వాటి కోసం వివిధ మార్గాలను వెతికింది. అందులో భాగంగా భూముల విలువల్ని, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది సర్కార్. గత వార్షిక బడ్జెట్లో రిజిస్ట్రేన్ల ద్వారా 10 వేల కోట్లు అంచనా వేస్తే.. కరోనా, ఇతర కారణాలతో టార్గెట్ రీచ్ కాలేదు. 2019-20లో అంచనా కన్నా ఎక్కువ ఆదాయం వచ్చినా.. 2020-21లో మాత్రం దెబ్బపడింది. టార్గెట్లో 52.43 శాతం మాత్రమే రీచ్ అయింది.
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
ఈ ఆర్థిక సంవత్సరంలో 12 వేల 500 కోట్ల ఆదాయం టార్గెట్గా పెట్టుకుంది ప్రభుత్వం. అయితే ఏప్రిల్, మే నెలలో వచ్చింది మాత్రం 957 కోట్లు మాత్రమే. ప్రస్తుతం రివైజ్డ్ చేసిన ధరల వల్ల ప్రభుత్వానికి నెలకు అదనంగా 250 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జ్లు రెండూ ఒకేసారి పెంచడంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఏదో ఒకటి పెంచి మరో దానికి గడువు ఇస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇన్నేళ్లు ఆగి ఇప్పుడు రెండూ ఒకే సారి పెంచడం వల్ల తీవ్ర భారం పడుతుందంటున్నారు విశ్లేషకులు. భూ సేకరణ కోసమే ప్రభుత్వం ఇన్ని రోజులు మార్కెట్ విలువను సవరించలేదని విమర్శిస్తున్నారు. భూముల విలువలు పెరిగినా.. ప్రస్తుత బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు.. పెంచిన మార్కెట్ ధరలకు వ్యత్యాసం ఎక్కువగానే ఉంది. ధరలు పెంచడం వల్ల కొద్దీ మేరకు నల్ల ధనాన్ని నివారించవచ్చు. లోన్లకు కూడా ఇబ్బంది ఉండదు అనే సానుకూలత కూడా వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
-
Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
-
Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
-
Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!