KCR : కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక భేటీ.. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ కోసం వ్యూహ రచన
- సభ విజయవంతం కోసం కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక
- సభలో ప్రదర్శించనున్న బీఆర్ఎస్ శక్తి
- పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశం ఆయన నివాసమైన ఎర్రవల్లి ఫామ్ హౌస్ (Erravalli Farm House) లో జరిగింది. ఈ సమావేశానికి మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా, ఈ నెల 27న వరంగల్ లో (Warangal BRS Sabha) జరగనున్న పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ తన రాజకీయ ప్రస్థానంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు.
Also Read
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
సభను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నియోజకవర్గాల వారీగా నేతలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. సభలో పాల్గొనే ప్రజల సంఖ్యపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా నేతలకు సూచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం లక్ష మంది ప్రజలను సభకు తరలించేందుకు సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ముందస్తు సమావేశాలను ఏర్పాటు చేసి, కార్యకర్తలను, ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు.
ఈ సిల్వర్ జూబ్లీ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ తన బలాన్ని మరోసారి ప్రదర్శించనుంది. విపక్షాలు చేస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇవ్వడంతో పాటు, ప్రజల్లో పార్టీకి మద్దతును పెంచుకునేలా ఈ సభను నిర్వహించాలని కేసీఆర్ స్పష్టంగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందనే అంశాన్ని సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు కూడా వరంగల్ సభను విజయవంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని, ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేందుకు సిద్ధమని కేసీఆర్ కు హామీ ఇచ్చారు. ఇక, ఈ సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుకు నాంది పలికేలా ఈ సభ నిలిచిపోతుందని బీఆర్ఎస్ శ్రేణులు నమ్ముతున్నాయి.
తాజావార్తలు
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!