Zaheer Khan: ఓటమిని అంగీకరిస్తున్నాం.. మాకు ఇంకా ఆరు మ్యాచ్లు ఉన్నాయి!
- పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో ఎల్ఎస్జీ ఓటమి
- పిచ్ విషయంలో ఫోకస్ పెడతాం
- తప్పకుండా లక్నో అభిమానులను అలరిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత మైదానం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఓడిపోవడం తమను బాధించిందని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మెంటార్ జహీర్ ఖాన్ తెలిపాడు. హోం గ్రౌండ్స్లో తమకు ఇంకా ఆరు మ్యాచ్లు ఉన్నాయని, తప్పకుండా అభిమానులను అలరిస్తామని చెప్పాడు. ఎకానా క్రికెట్ స్టేడియం తమకు హోం గ్రౌండ్ అయినప్పటికీ.. పంజాబ్ కింగ్స్ క్యురేటర్ ఇక్కడ ఉన్నట్లు అనిపించిందన్నాడు. తప్పకుండా రాబోయే మ్యాచుల్లో విజేతగా నిలుస్తాం అని జహీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎల్ఎస్జీ ఓడిపోయింది.
గాయాలతో ఎల్ఎస్జీ పేస్ విభాగం కాస్త బలహీనంగా ఉన్నప్పుడు.. స్పిన్కు అనుకూలంగా పిచ్ను తయారుచేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వెలువడ్డాయి. వీటిపై ఎల్ఎస్జీ మెంటార్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ… ‘సొంత మైదానంలో ఈ ఫలితం నిరాశపర్చింది. టీమ్లు అన్ని తమ హోం గ్రౌండ్లో పిచ్ను అనుకూలంగా తయారుచేసుకుంటాయి. లక్నో పిచ్ క్యూరేటర్ మాత్రం అలా ఆలోచించినట్లు లేదనిపిస్తోంది నాకు. పంజాబ్ క్యూరేటరే ఈ పిచ్ రూపొందించినట్లుంది. ఈ అంశాలపై మేం ఫోకస్ పెడతాం. పిచ్ విషయంలో ఇకపై పొరపాట్లు జరగవని ఆశిస్తున్నా’ అని చెప్పాడు.
Also Read
- Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
Also Read: Shreyas Iyer Record: ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ చరిత్ర.. ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్!
‘అభిమానులు మామీద ఎన్నో అంచనాలు పెట్టుకొని మైదానానికి వస్తారు. తొలి మ్యాచ్లోనే జట్టు ఓడిపోవడం వల్ల చాలా నిరాశపడ్డారు. అభిమానులను నిరుత్సాహానికి గురి చేయడం సరైంది కాదు. జట్టులో ఎలాంటి సమస్యలు లేవు. ఓటమిని మేం అంగీకరిస్తున్నాం. పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతాం. మాకు ఇక్కడ ఇంకా ఆరు మ్యాచ్లు ఉన్నాయి. అభిమానులను తప్పకుండా అలరిస్తాం. ఇలాంటి టోర్నీలలో పాజిటివ్ మైండ్సెట్తో ఉండాలి. పరుగులు చేయాలనే ఆకలి ఉన్న క్రికెటర్లను ప్రోత్సహించాలి. ఆటలో ప్రతిఒక్కరి భాగస్వామ్యం కీలకంగా ఉంటుంది. వచ్చే మ్యాచ్లలో విజేతగా నిలుస్తాం’ అని జహీర్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?