హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్స్ కు సంబంధించిన ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతీరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. చెత్త సేకరణకు సంబంధించి…
మాదిగ సామాజిక వర్గ హక్కుల సాధనలో తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘మాదిగ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్’ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్గీకరణను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం తనకు గర్వకారణమని చాటిచెప్పారు. గత ఇరవై ఏళ్లుగా మాదిగ వర్గీకరణ పోరాటాన్ని తాను దగ్గరుండి చూస్తున్నానని సీఎం గుర్తు చేసుకున్నారు. “నాడు అసెంబ్లీలో వర్గీకరణ కోసం గళమెత్తితే,…
Rajya Sabha Nominations: తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. ఏఐసీసీ ముఖ్య ప్రతినిధి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి వీరు నామినేషన్ సెట్లను అందజేశారు. Pakistan: క్రికెట్ ఆడమంటే హోటల్లో ఇవేం పనులు రా.. హౌస్కీపింగ్ మహిళను పాకిస్థాన్ ప్లేయర్ ఏం చేశాడంటే?…
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దేశ రాజధానిలో జరిగిన ఈ సమావేశం సుమారు గంటకు పైగా కొనసాగింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ , మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణపై ఈ భేటీలో కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని మావోయిస్టుల అంశం చర్చకు వచ్చింది. మావోయిస్టుల లొంగుబాటు (Surrender) , వారికి పునరావాసం కల్పించే అంశాలపై ఇరువురు నేతలు…
తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. అభ్యర్థుల ఎంపికపై బుధవారం కాంగ్రెస్ అధిష్టానం కీలకమైన జూమ్ మీటింగ్ను నిర్వహించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు ఆశావహుల పేర్లు చర్చకు వచ్చినప్పటికీ, ఇద్దరి పేర్లు ప్రముఖంగా…
Balka Suman: ఆదిలాబాద్ జిల్లా జైల్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విడుదలయ్యారు. క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన గొడవలో సుమన్ సహా ఆయన అనుచరులు రాజి రెడ్డి, అనిల్, లక్ష్మికాంత్ అరెస్ట్ అయ్యారు. 14 రోజులుగా ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న నలుగురు క్యాతన పల్లి, చెన్నూరులో నమోదైన 3 కేసుల్లో బెయిల్ రావడంతో విడుదల అయ్యారు. ఇక జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే సుమన్ మాట్లాడుతూ..…
CM Revanth Reddy: డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. దేశ భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆయన.. “దేశం కోసం, మన అందరి కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. గత ఐదేళ్లుగా ఆయన చేసిన నిరంతర పోరాటాల ఫలితంగానే నేడు రాహుల్ గాంధీ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు.…
Telangana Government: మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా)లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ ప్రభుత్వం 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో…
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్కు రానున్నారు. ఉదయం 9:30 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి వికారాబాద్ జిల్లాకు బయలుదేరనున్నారు. T20 WC 2026 Semi Final Schedule: సెమీస్ షెడ్యూల్.. భారత్ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!…
ఇరాన్ తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుందని అన్నారు. ఇరాన్…