ఏపీలో మహిళలపై చోటు చేసుకుంటున్న ఉదంతాలను నిరసిస్తూ నేడు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళల రక్షణలో ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ.. ఆందోళనకు పిలుపునిచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసనలు తెలుపనున్నారు. అయితే.. ఏపీలో వరుసగా అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న రేపల్లె రైల్వేస్టేషన్లో మహిళపై గ్యాంగ్ రేప్ జరుగగా, ఆ తరువాత…
పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్, ప్రశ్నాపత్రాల లీకవ్వడంపై టీడీపీ ప్రధాన కార్యకర్శి నారా లోకేష్ సీఎం జగన్కు లేఖ రాసిన విషయం తెలిసిందే! వైసీపీ వ్యాట్సాప్ గ్రూపుల్లోనే ప్రశ్నాపత్రాలు లీకయ్యాయంటూ ఆరోపణలు చేసిన ఆయన, పదో తరగతి పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అంతేకాదు, దేశ చరిత్రలోనే దీన్నో చీకటి అధ్యాయంగా పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణను తొలగించాలని డిమాండ్ కూడా చేశారు. Read Also: Andhra Pradesh:…
గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్తో పాటు ప్రశ్నాపత్రలు లీక్ అయ్యాయి. మొదటి పరీక్ష మొదలైనప్పటి నుంచి, ఏదో ఒక చోట క్వశ్చన్ పేపర్స్ లీకమవుతూ వస్తున్నాయి. దీంతో, ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై సీఎం జగన్కు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పదో తరగతి పరీక్షల్లో లీక్, మాస్ కాపీయింగ్తో విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని ఆ…
ప్రతిపక్షాల ఆరోపణలకు తనదైన శైలిలో జవాబులిచ్చే ఎంపీ నందిగం సురేష్.. తాజాగా మరోసారి కౌంటర్ల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్కు, కేఏ పాల్కు పెద్ద తేడా ఏమీ లేదని చెప్పిన ఆయన.. పవన్ కన్నా కేఏ పాల్ మేధస్సే ఎక్కువగా ఉంటుందని కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు, ఆయన పార్టీ టీడీపీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే పవన్ బయటకు వస్తారని, అంతే తప్ప ప్రజలు ఏమైనా ఆయనకు పని లేదని వ్యాఖ్యానించారు. Read Also: Yadadri: భక్తులకు ఊరట..…
రేపల్లె అత్యాచార ఘటన అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య అగ్గి రాజేసింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు సైతం వారి వ్యాఖ్యలకు ధీటుగా బదులిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మంత్రి మేరుగ నాగార్జున ప్రతిపక్షంపై ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. Read Also: Minister Gudivada Amarnath: చంద్రబాబు ఇరుక్కోవడం ఖాయం! పేద ప్రజల కోసం సీఎం…
విశాఖపట్నంలో ఫైబర్ నెట్ కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ను మరింత ఆధునీకరించడం జరిగిందని అన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా అతి తక్కువ ధరకు మూడు సర్వీసుల్ని అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. Read Also: Etela Rajender: ప్రాణహిత-చేవెళ్లకు అడ్డుపడింది…
ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో జరిగిన వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో కీలక అంశాలను వెల్లడించారు పోలీసులు.. రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలో భాగంగా వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు గురయ్యారు. బజరయ్య సహకారంతో సురేశ్, హేమంత్, మోహన్లు కలిసి గంజి ప్రసాద్ను పథకం ప్రకారం హత్య చేసినట్టు పోలీసు విచారణలో తేలింది. Read Also: RBI: వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..! రెడ్డి…
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో మెట్ట రాజకీయాలు డిఫరెంట్. ఇందులో జగ్గంపేట రాజకీయాలు ఇంకా ఆసక్తికరం. గడిచిన నాలుగు ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే రెండుసార్లు కాంగ్రెస్, మరో రెండుసార్లు వైసీపీ గెలిచాయి. అభ్యర్థులు ఎవరైనప్పటికీ పార్టీలే జగ్గంపేటలో కీలకమని టాక్. 2004, 2009 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు మాజీ మంత్రి తోట నరసింహం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో జగ్గంపేట ప్రజలు వైసీపీని గెలిపించారు. 2004లో టీడీపీ నుంచి 2009లో పీఆర్పీ…
టీడీపీ ఎన్నికల వ్యూహంపై చర్చ టార్గెట్ బిగ్షాట్స్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రస్తుతం అమలు చేయాలని అనుకుంటున్న ప్రణాళిక. ఇటీవల సీఎం జగన్ వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు.. జిల్లా అధ్యక్షులు, మంత్రులతో సమావేశమయ్యారు. పార్టీ బాధ్యతలను రీజినల్ కో-ఆర్డినేటర్లు.. జిల్లా అధ్యక్షుల మీద పెట్టారు. మంత్రులకంటే వారే ఎక్కువ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో సమన్వయకర్తలు.. జిల్లా అధ్యక్షులు గెలవడంతోపాటు వారి పరిధిలోని ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులను కూడా గెలిపించాల్సిన బాధ్యత వారికే…
ఏపీలో జరుగుతున్న వివిధ సంఘటనలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చిలమత్తూరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్ హెచ్చార్సీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడు వేణుగోపాల్ పై ఎస్ఐ దాడి చేసిన వీడియోను ఎన్ హెచ్చార్సీకి పంపించారు వర్ల. సత్యసాయి జిల్లా, చిలమత్తూరు ఎస్.ఐ రంగడుపై చర్యలు తీసుకోవాలని వర్ల లేఖలో కోరారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ లో…