ఏపీ సీఎం జగన్ బుధవారం బిజీ బిజీగా గడపనున్నారు. కరోనా పరిస్థితులపై మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో జగన్ పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ నేతలు, మంత్రులతో ఆయన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ వన్ టౌన్లో షా జహూర్ ముసాఫిర్ ఖానా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో సమావేశం అవుతారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో…
ఏపీలో వైసీపీ కీలక నేతలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ పార్టీ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజ్యసభ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డికి రీజనల్, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల కో ఆర్డినేషన్ బాధ్యతలను అప్పగించారు. గతంలోనే విజయసాయిరెడ్డి పార్టీ అనుబంధ సంఘాల కో ఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యేలు,…
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై ఎన్టీవీతో మంత్రి రోజా స్పందించారు. రుయాసంఘటన దురదృష్టకరమని అభిప్రాయపడ్డ ఆమె.. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డెడ్ బాడీకి ఇవ్వాల్సిన మహాప్రస్థానం వాహనం ఇవ్వలేదని తెలిసిందని.. ఇది సూపరింటెండెంట్, సీఎస్ఆర్ఎంవో బాధ్యత అని.. కానీ ఎలా మిస్ అయిందో తెలియదన్నారు. ఈ ఘటనపై వెంటనే జిల్లా అధికారులను పంపించి నివేదిక ఇవ్వమని చెప్పినట్లు మంత్రి రోజా వివరించారు. ఇప్పటికే ఈ ఘటనలో సీఎస్ఆర్ఎంవోను సస్పెండ్ చేశామని.. ఆస్పత్రి…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో ఆయన టీఆర్ఎస్ పార్టీతో పనిచేస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ను కలిసి మంతనాలు కూడా జరిపారు. అయితే జాతీయ రాజకీయాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగినా.. పలు రాష్ట్రాలలో ఇతర పార్టీలతో ఒప్పందాలు ఉన్న కారణంగా ఇది వర్కవుట్ కాదని తెలిసి వెనకడుగు వేశారు. ఈ మేరకు తాను కాంగ్రెస్ పార్టీలో…
వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్రెడ్డిపై నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి మాండ్ర శివానందరెడ్డి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నందికొట్కూరు నియెజకవర్గం ఎక్కడ అభివృద్ధి చెందిందో చెప్పాలని వైసీపీ నాయకులు చెప్పాలని మాండ్ర శివానందరెడ్డి డిమాండ్ చేశారు. రియల్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవడం తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. నందికొట్కూరులో వైసీపీ రాక్షస పాలన సాగుతోందని.. డాక్టర్పై దాడి ఘటనే అందుకు ఉదాహరణ అని మాండ్ర శివానందరెడ్డి విమర్శలు చేశారు. టీడీపీలో చేరాలని ఎవరెవరి కాళ్లు…
ఏపీలో ప్రభుత్వాసుపత్రుల్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. మొన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం హేయమయినది అన్నారు. ఇవాళ మరో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రైవేట్ అంబులెన్స్ దందా కారణంగా అమానవీయ ఘటన జరిగిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?చేతగాని పాలకుడు జగన్ చెత్త పాలన కారణంగా అనారోగ్యంతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని తండ్రి 90 కి.మీ.బైక్ పై తీసుకెళ్లి…
బాలినేని గౌరవానికి తగ్గట్టు ప్రకటన లేదని అనుచరులు నిరాశ బాలినేని శ్రీనివాసరెడ్డి. మాజీ మంత్రి. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆదిమూలపు సురేష్ను ఉంచి.. బాలినేనికి గుడ్బై చెప్పారు. దాంతో ఆయన అభిమానులు ఎలాంటి హంగామా చేశారో రాష్ట్రమంతా చూసింది. రెండురోజుల హైడ్రామా తర్వాత సీఎం జగన్తో భేటీ అయ్యాక అలకవీడారు బాలినేని. వైసీపీలో సముచిత స్థానం ఇవ్వడంతోపాటు త్వరలో జిల్లా పర్యటనకు వస్తానని ఆ సమయంలో బాలినేనికి మాట ఇచ్చారట సీఎం జగన్. ఆ క్రమంలోనే ప్రకాశం,…
విశాఖ నగరంపై పట్టు సాధించేందుకు అధికార వైసీపీ ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తోంది. సామాజిక సమీకరణాలు.. భవిష్యత్ అవసరాలు.. ఇలా అన్నింటినీ పక్కాగా లెక్కేసుకుని ముందుకెళ్తోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల నుంచి మంత్రివర్గ విస్తరణలో అవకాశాల వరకు ప్రతీదానికీ కేలిక్యూలేషన్స్ ఉన్నాయి. పార్టీని బలోపేతం చేసే దిశగా హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలపై కొంత వ్యతిరేకత ఉన్నా.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బయటపడిన సందర్భాలు తక్కువే. 2024నాటికి జీవీఎంసీ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలనూ కైవశం చేసుకోవాలని…
రాష్ట్రంలో విద్యుత్ రంగంలో నెలకొన్న సమస్యలపై విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం సాయంత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. బొగ్గు కొరత వల్ల దేశంలోని అనేక రాష్ట్రాలు విద్యుత్ సమస్యలతో సతమతం అవుతున్నాయని తెలిపారు. ఏపీలో విద్యుత్ సమస్యలకు కూడా దేశంలోని బొగ్గు కొరత కారణమని వెల్లడించారు. అటు కరోనా సంక్షోభం, భారీ వర్షాలు బొగ్గు ఉత్పాదనను ప్రభావితం చేశాయని తెలిపారు. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం…
2024 ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలపై త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేస్తామని ప్రకటించారు. తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న తాడేపల్లిలో జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరుకానున్నారు. కాగా మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీతో…