Nara Lokesh: సీఎం జగన్కు లోకేష్ ‘మాస్’ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్తో పాటు ప్రశ్నాపత్రలు లీక్ అయ్యాయి. మొదటి పరీక్ష మొదలైనప్పటి నుంచి, ఏదో ఒక చోట క్వశ్చన్ పేపర్స్ లీకమవుతూ వస్తున్నాయి. దీంతో, ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై సీఎం జగన్కు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పదో తరగతి పరీక్షల్లో లీక్, మాస్ కాపీయింగ్తో విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, వైసీపీ మీద తారాస్థాయి విమర్శలూ చేశారు.
Read Also: Breaking: రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు హైకోర్టు అనుమతి
Also Read
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
వైసీపీ వాట్సాప్ గ్రూపుల్లోనే ప్రశ్నాపత్రాలు ప్రత్యక్షమవుతున్నాయని ఆరోపించిన లోకేష్.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మేథ్స్ క్వశ్చన్ పేపర్లు ఎగ్జామ్ సెంటర్కి చేరకముందే వైసీపీ వాట్సాప్ గ్రూపుల్లో లీకమవుతున్నాయన్నారు. వైసీపీ నాయకుల పిల్లలకు మెరుగైన మార్కులు తెప్పించుకోవడం కోసమే ఈ లీకులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ‘‘పీఆర్సీ, సీపీఎస్ రద్దు కోసం మీ ప్రభుత్వంపై నిరసన తెలిపిన టీచర్లను వేధించేందుకు టెన్త్ పరీక్షల్ని వాడుకుంటున్నారనే అనుమానాలున్నా’’యని లోకేష్ ఆ లేఖలో బాంబ్ పేల్చారు. జగన్ పాలనలో విద్యాశాఖ భ్రష్టుపట్టిందని మండిపడ్డ ఆయన.. మంత్రుల వల్ల అది ఇంకా పతనావస్థకి చేరిందన్నారు.
పేపర్ల లీక్, మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్పై మంత్రి బొత్స పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయని ఇచ్చిన సమాధానం బాధ్యతారాహిత్యంగా ఉందని.. ఆయన్ను విద్యాశాఖ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇంకా మిగిలిన రెండు పరీక్షల్ని అయినా పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తోన్న పదోతరగతి పరీక్షల నిర్వహణలో జగన్ ప్రభుత్వం విఫలమైందని, ఈ ఘోర వైఫల్యంతోనైనా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జగన్ పాలనా యంత్రాంగం నిర్వహించిన ఈ పరీక్షలు చరిత్రలోనే చీకటి అధ్యాయంగా నిలిచాయన్నారు.
ప్రతిభకి కొలమానంగా నిలవాల్సిన పరీక్షలు అక్రమాల విక్రమార్కులకి వరంగా మారాయని ఆయన చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో పేపర్ లీకైన ఘటనలో, అప్పటి మంత్రి జీఎంసీ బాలయోగి తన పదవికి రాజీనామా చేసిన చరిత్ర ఉందని లోకేష్ గుర్తు చేసుకున్నారు. సీఎంగా వైఫల్యం, అధికారుల చేతగానితనం, వైసీపీ నేతల స్వార్థంతో టెన్త్ పరీక్షల నిర్వహణ అభాసుపాలై, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంగా మారిందంటూ ఆ లేఖలో లోకేష్ ఫైరయ్యారు. మరి, ఇందుకు బదులుగా అధికార పార్టీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
తాజావార్తలు
-
Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
-
Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్పై రూ.22 తగ్గించిన పాక్..
-
Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..