ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్ కేబినెట్ 2లో మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతలు చాలా మందే ఉన్నారు.. తమ మంత్రి పదవి ఊడిపోవడంతో సిట్టింగులు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. తొలిసారి పదవి రాలేదు.. మలి కేబినెట్లోనైనా అవకాశం వస్తుందని ఎదురుచూసినవారిలో కూడా కొంతమందికి మొండి చేయి చూపడంతో అసంతృప్తిగా ఉన్నారు.. ఇప్పటికే చాలా మందిని బుజ్జగించారు వైసీపీ నేతలు.. అయితే, ఇవాళ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి కాకాణి…
వైఎస్ జగన్ తొలి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి.. రెండో కేబినెట్లో మాత్రం చోటు దక్కలేదు.. అయితే, మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి.. ఇవాళ కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో పర్యటించారు.. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత నియోజకవర్గంలో తొలి కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నానికి ఘన స్వాగతం పలికాయి వైసీపీ శ్రేణులు. దొండపాడులో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో కలిసి…
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచార బాధితురాలి పరామర్శ ఇప్పుడు పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.. పరామర్శ సమయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య జరిగిన వాగ్వాదం రచ్చగా మారింది.. అయితే, ఈ ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. బాధితురాలి దగ్గర టీడీపీ నేతలు బల ప్రదర్శన చేశారని ఎద్దేవా చేసిన ఆమె.. గొడవను కంట్రోల్ చేయమని అడిగితే నాపై విరుచుకుపడ్డారని…
ఎవరైనా డబ్బు, పేరు కోసం రాజకీయాల్లోకి వస్తారు.. కానీ, సీఎం వైఎస్ జగన్ వేరు అన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. మంత్రి పదవి నుంచి ఆయనను తప్పించిన సీఎం వైఎస్ జగన్.. పార్టీ బాధ్యతలు అప్పజెప్పిన విషయం తెలిసిందే.. ఇవాళ శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ధర్మాన.. పరీక్షా సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.. అధ్యక్ష బాధ్యతల్లో నియమించిన జగనన్నకు కృతజ్ణతలు తెలిపారు.. ఇక, ఈ సందర్భంగా…
రాజకీయాలలో నల్లపురెడ్ల కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ కేబినెట్లో నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి నెంబర్-2గా కొనసాగారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యే. 2009లో టీడీపీ నుంచి గెలిచిన ప్రసన్నకుమార్రెడ్డి అనూహ్యంగా వైఎస్ఆర్ వైపు చేరారు. వైఎస్ హఠాన్మరణంతో జగన్కు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కూడా. 2012లో జరిగిన కోవూరు ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు ప్రసన్నకుమార్రెడ్డి. నాడు వైసీపీ తరఫున వైఎస్ విజయమ్మ తర్వాత…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఎంపీ విజయసాయి రెడ్డిని.. అనుబంధ సంఘాల ఇంచార్జ్కే పరిమితం చేశారు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ప్రాంతీయ పార్టీలలో అధినేత ఆదేశాలను పాటించడమే శిరోధార్యం… నాకు ఇది కావాలి, ఇది వద్దు అనే ప్రస్తావన ఎక్కడ రాకూడదన్నారు.. ఛార్టర్డ్ అకౌంటెంట్ అయిన నాకు జగన్ మోహన్ రెడ్డి అనేక అవకాశాలు ఇచ్చారన్న ఆయన.. సాక్షిలో ఫైనాన్స్ డైరెక్టర్ నుంచి…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రతిపాదన చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కలిసి ముందు సాగితే బాగుంటుందనే ప్రతిపాదన తీసుకొచ్చారు.. అయితే, వైసీపీ, కాంగ్రెస్ దోస్తీ విషయంలో ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై ఘాటుగా స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు పుట్టిందే వైసీపీ అన్న ఆయన.. వ్యూహకర్తలు సలహాలు ఇస్తారు.. కానీ, అమలు చేయాలో లేదో నిర్ణయం…
తిరుపతి జిల్లా తొలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు.. ఆయన సైనికుడిగా పనిచేస్తానని వెల్లడించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి.. తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆయనను నియమించిన విషయం తెలిసిందే కాదు.. ఆత్మీయ సమావేశం నిర్వహించాం.. జగనన్న అవకాశం ఇచ్చారు.. అందరినీ కలుపుకుని, పార్టీని మరింత బలపేతం చేస్తానని వెల్లడించారు.. ప్రతి పల్లెలోకి వెళ్తాం… ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రతి ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.. ప్రతి మండలంలో వైఎ్సార్సీపీ సర్వసభ్య…
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మళ్లీ ఆయన్ను సర్వీస్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని తోసిపుచ్చింది సుప్రీం.. అయితే, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించగా.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. సీరియస్గా స్పందించారు. ఏపీ ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసిందని.. ఆంద్రప్రదేశ్…
శాప్ ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియతో పాటు మీడియాను షేక్ చేస్తోంది.. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్తో బైరెడ్డికి విభేదాలు బహిరంగ రహస్యమే కాగా.. ఈ మధ్య ఓ పరిణామం చర్చకు దారితీసింది.. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు బైరెడ్డి సిద్ధం అవుతున్నారని.. అందులో భాగంగానే ఈ మధ్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో భేటీ అయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి.. అంతేకాదు.. టీడీపీలో చేరి…