ఏపీలో జరుగుతున్న వివిధ సంఘటనలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చిలమత్తూరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్ హెచ్చార్సీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడు వేణుగోపాల్ పై ఎస్ఐ దాడి చేసిన వీడియోను ఎన్ హెచ్చార్సీకి పంపించారు వర్ల.
సత్యసాయి జిల్లా, చిలమత్తూరు ఎస్.ఐ రంగడుపై చర్యలు తీసుకోవాలని వర్ల లేఖలో కోరారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ లో బాధితుడి వేణుగోపాల్ పై ఎస్.ఐ దాడి చేయడం కొంతమంది పోలీసుల దుర్మార్గపు చర్యలకు నిదర్శనం. హిందూపురం అసెంబ్లీలోని సజీవరాయనపాలెంకు చెందిన బీసీ మహిళ పద్మావతి చాలా ఏళ్లుగా వికలాంగుల పింఛను పొందుతున్నారు. ఆమె తమ పార్టీకి అనుకూలంగా లేదని వైసీపీ నాయకులు ఆమె పెన్షన్ను తొలగించారు.
పెన్షన్ తొలగించడాన్ని ప్రశ్నించిన ఆమె కుమారుడు వేణుగోపాల్ పై వైసీపీ నాయకుడు దామోదర్ రెడ్డి అతనిపై దాడి అక్రమ కేసు పెట్టారు. జరిగిన వాస్తవాలను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్లిన వేణుగోపాల్ పై చిలమత్తూరు ఎస్.ఐ రంగడు అసభ్యంగా దుర్భాషలాడుతూ దాడి చేశారు. బాధితుడిని మరింత బాధించడం అత్యంత దుర్మార్గం.
ఎస్.ఐ తీరు రాజ్యాంగం ప్రసాధించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే.ఇది ఏపీ పోలీస్ మాన్యూవల్కు కూడా పూర్తి విరుద్ధం.నాగరిక ప్రజాస్వామ్య సమాజంలో ఎస్.ఐ రంగడు ప్రవర్తన ఆమోద యోగ్యం కాదు.కాబట్టి వేణుగోపాల్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిన ఎస్.ఐ రంగడుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి.2019 జూన్ లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టింది.పోలీసులే బాధితులపైన దాడులు, వేధింపులు, అధికార దుర్వినియోగాలకు పాల్పడుతున్నారని వర్ల తనలేఖలో ఎన్ హెచ్చార్సీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జాతీయ మానవహక్కుల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.
NTPC VIZAG: ఎన్టీపీసీ సింహాద్రి 4 యూనిట్లలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి