చంద్రబాబు కాన్వాయ్ లోని రౌడీ మూకలు కర్రలు, రాళ్లు తెచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ చేశారు. విచక్షణా రహితంగా పోలీసులపై దాడులు చేశారు.. చంద్రబాబు తీరు మొగుడ్ని కొట్టి మొగసాలికేక్కినట్టు ఉంది.. పోలీసులపై దాడులు చేసి.. రివర్స్ లో మాట్లాడుతున్నారు.
కొంత మంది రాజకీయ నాయకులు, సొంతంగా ప్రకటించుకున్న ఆర్ధిక నిపుణులు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పై ప్రకటనలు చేస్తున్నారని, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా రాష్ట్ర అప్పుల గురించి వివరించారన్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్. దీంతో టీడీపీ, వాళ్ళ మీడియా బాధ మామూలుగా లేదని, ఎప్పుడూ కనిపించని గంటా కూడా అప్పుల పై స్టేట్ మెంట్లు ఇస్తున్నారన్నారు.
చంద్రబాబుకు సురక్ష లాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన రాలేదని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే సరిపోదన్నారు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి ల తరువాత రాష్ట్రంలో సంక్షేమానికి టార్చ్ బేరర్ గా జగన్ ఉన్నారని, అడవిలో చాలా జంతువులు ఉంటాయి.. కానీ ఒక్క సింహమే రాజు అని ఆయన అన్నారు. breaking news, latest news, telugu news, big news, devineni avinash,…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పేదల పక్కన ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పెత్తందార్ల వైపు ఉన్నారు అని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని తట్టుకోలేక చంద్రబాబు తమ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతరీ మారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులా.. బాబుగారు జనతా పార్టీకి అధ్యక్షులో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. మరిది గారు స్కిప్ట్ చిన్నమ్మ మాట్లాడింది అని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఎక్కడకు వెళ్లిన ఇదే సినిమా స్క్రిప్టు.. తండ్రి పార్టీ మరిది నడుపుతారు.. వీరు వేరే పార్టీని నడుపుతారు.. టీడీపీలో చేరి అధ్యక్ష బాధ్యతలు పురందేశ్వరి తీసుకుని మాట్లాడితే బాగుండేది…
టీడీపీ ఎందుకిలా అసత్యాలు ప్రచారం చేస్తుందని వైసీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. రాష్ట్రం దిశ యాప్ తో మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం.. పదవుల్లో సైతం మహిళకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం.. పవన్, చంద్రబాబు, లోకేష్ వాలంటీర్లపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు.. వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఇప్పుడు తోక ముడిచారు
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వర్షాలకు హైదరాబాద్ పట్నమే మునిగిపోయింది... చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీయే మునిగిపోయింది.. ఉత్తర భారత దేశంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరమే నీట మునిగిపోయింది.. ప్రత్యేక సందర్భంలో వచ్చే వర్షాలకు మునిపోవడం సహజం.. ఇక చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో మునిగిపోక తప్పదని బొత్స అన్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వాలంటీర్ల వ్యవస్థ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీతో హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పవన్ వాలంటీర్స్ ని బ్లేమ్ చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో వాలంటీర్స్ గా అత్యధికంగా మహిళలే పనిచేస్తున్నారని, అసలు కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు ఎందుకు సమాచారం ఇస్తారన్నారు తానేటి వనిత. breaking news, latest news, telugu news,…
ఐదవ విడత వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చారు అంటే నిల బెట్టుకుంటారని ఆయన అన్నారు. విద్యను ఆయుధంగా చేసుకోమని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పిలుపునిస్తే, విద్యను ఆస్తిగా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారు.. breaking news, latest news,…