Sunil Deodhar: ఏపీలో వైసీపీని చాయ్కప్ వాలా మట్టి కరిపిస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయితీలకు కేటాయించిన నిధులను మళ్లించి వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సునీల్ దియోధర్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
Parliament Of CJI: సీజేఐ లేకుండానే ఎన్నికల సంఘం నియామకం.. బిల్లుకు రెడీ అయిన కేంద్రం
Also Read
- CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!
- Cockroach Janta Party: సీజేపీకి కోర్టు షాక్.. అత్యవసర విచారణకు నో..
- India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
అనంతరం సునీల్ దియోధర్ మాట్లాడుతూ.. వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ, జనసేనలు దేశం కోసం పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ అయినా.. హిందీలో ప్రెస్ నోట్ లు విడుదల చేస్తోందని దియోధర్ అన్నారు. వైసీపీ, టీడీపీ ఎందుకు హిందీలో ప్రెస్ నోట్ లు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాయకుడని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత సీఎంలు అక్కడ మాతృభాషకే ప్రాధాన్యత ఇస్తూ విద్యాబోధన చేయిస్తున్నారని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మాతృభాష తెలుగును కాదని ఇంగ్లీషును తీసుకొచ్చారని దుయ్యబట్టారు.
Suicide Attempt: కాకినాడ బీచ్ వద్ద విషాదం.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగు తల్లికి తీరని ద్రోహం చేశారని సునీల్ దియోధర్ అన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే ఆ దిశగా విద్యార్థులు కూడా పరిణతి సాధిస్తారన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో కాంగ్రెస్ ను చాయ్ వాలా మట్టికరిపించారని తెలిపారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చాయ్ కప్ వాలా(పవన్ కళ్యాణ్) మట్టి కరిపిస్తారని సునీల్ దియోధర్ అన్నారు. రాష్ట్రంలో తామర పువ్వు (బీజేపీ)కి గాజు గ్లాస్ ( జనసేన) తోడైతే ఫ్యాను రెక్కలు విరిగిపోయి గుజరీకి వెళ్లాల్సిందే అని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో ఎన్డీఏ అనుబంధ ప్రభుత్వం ఏర్పడబోతోందని సునీల్ దియోధర్ తెలిపారు.
- Tags
- bjp
- janasena
- puttaparthi
- RDO office
- ycp
తాజావార్తలు
-
Aamani : “రేపు నువ్వే హీరోయిన్” అని, కథలు వినటానికి గెస్ట్ హౌస్ లకి రమ్మని చెప్పేవారు!
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!
-
Cockroach Janta Party: సీజేపీకి కోర్టు షాక్.. అత్యవసర విచారణకు నో..
-
Vishwak Sen: మాస్ కా దాస్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఆ డైరెక్టర్తో విశ్వక్ మూవీ!
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!