Sunil Deodhar: ఏపీలో వైసీపీని చాయ్కప్ వాలా మట్టి కరిపిస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయితీలకు కేటాయించిన నిధులను మళ్లించి వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సునీల్ దియోధర్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
Parliament Of CJI: సీజేఐ లేకుండానే ఎన్నికల సంఘం నియామకం.. బిల్లుకు రెడీ అయిన కేంద్రం
Also Read
- TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
- Akhil NRD: "ప్రేమ పెళ్లి".. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
అనంతరం సునీల్ దియోధర్ మాట్లాడుతూ.. వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ, జనసేనలు దేశం కోసం పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ అయినా.. హిందీలో ప్రెస్ నోట్ లు విడుదల చేస్తోందని దియోధర్ అన్నారు. వైసీపీ, టీడీపీ ఎందుకు హిందీలో ప్రెస్ నోట్ లు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాయకుడని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత సీఎంలు అక్కడ మాతృభాషకే ప్రాధాన్యత ఇస్తూ విద్యాబోధన చేయిస్తున్నారని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మాతృభాష తెలుగును కాదని ఇంగ్లీషును తీసుకొచ్చారని దుయ్యబట్టారు.
Suicide Attempt: కాకినాడ బీచ్ వద్ద విషాదం.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగు తల్లికి తీరని ద్రోహం చేశారని సునీల్ దియోధర్ అన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే ఆ దిశగా విద్యార్థులు కూడా పరిణతి సాధిస్తారన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో కాంగ్రెస్ ను చాయ్ వాలా మట్టికరిపించారని తెలిపారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చాయ్ కప్ వాలా(పవన్ కళ్యాణ్) మట్టి కరిపిస్తారని సునీల్ దియోధర్ అన్నారు. రాష్ట్రంలో తామర పువ్వు (బీజేపీ)కి గాజు గ్లాస్ ( జనసేన) తోడైతే ఫ్యాను రెక్కలు విరిగిపోయి గుజరీకి వెళ్లాల్సిందే అని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో ఎన్డీఏ అనుబంధ ప్రభుత్వం ఏర్పడబోతోందని సునీల్ దియోధర్ తెలిపారు.
- Tags
- bjp
- janasena
- puttaparthi
- RDO office
- ycp
తాజావార్తలు
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ట్రెండింగ్
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!