Sunil Deodhar: ఏపీలో వైసీపీని చాయ్కప్ వాలా మట్టి కరిపిస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయితీలకు కేటాయించిన నిధులను మళ్లించి వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సునీల్ దియోధర్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
Parliament Of CJI: సీజేఐ లేకుండానే ఎన్నికల సంఘం నియామకం.. బిల్లుకు రెడీ అయిన కేంద్రం
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
అనంతరం సునీల్ దియోధర్ మాట్లాడుతూ.. వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ, జనసేనలు దేశం కోసం పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ అయినా.. హిందీలో ప్రెస్ నోట్ లు విడుదల చేస్తోందని దియోధర్ అన్నారు. వైసీపీ, టీడీపీ ఎందుకు హిందీలో ప్రెస్ నోట్ లు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాయకుడని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత సీఎంలు అక్కడ మాతృభాషకే ప్రాధాన్యత ఇస్తూ విద్యాబోధన చేయిస్తున్నారని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మాతృభాష తెలుగును కాదని ఇంగ్లీషును తీసుకొచ్చారని దుయ్యబట్టారు.
Suicide Attempt: కాకినాడ బీచ్ వద్ద విషాదం.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగు తల్లికి తీరని ద్రోహం చేశారని సునీల్ దియోధర్ అన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే ఆ దిశగా విద్యార్థులు కూడా పరిణతి సాధిస్తారన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో కాంగ్రెస్ ను చాయ్ వాలా మట్టికరిపించారని తెలిపారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చాయ్ కప్ వాలా(పవన్ కళ్యాణ్) మట్టి కరిపిస్తారని సునీల్ దియోధర్ అన్నారు. రాష్ట్రంలో తామర పువ్వు (బీజేపీ)కి గాజు గ్లాస్ ( జనసేన) తోడైతే ఫ్యాను రెక్కలు విరిగిపోయి గుజరీకి వెళ్లాల్సిందే అని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో ఎన్డీఏ అనుబంధ ప్రభుత్వం ఏర్పడబోతోందని సునీల్ దియోధర్ తెలిపారు.
- Tags
- bjp
- janasena
- puttaparthi
- RDO office
- ycp
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!