Minister Peddireddy: ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో చంద్రబాబు హింసను ప్రేరేపిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. పుంగనూరు ఘటనకు ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అంటూ ఆయన విమర్శించారు. బైపాస్ లో వెళతాం అని పోలీసులకు రోడ్ మ్యాప్ ఇచ్చారు.. ఆ తరువాత ఉన్నపళంగా పుంగనూరు టౌన్ లోకి వెళ్ళాలని చూసారు.. ఉన్నట్టుండి రూటు మారితే చంద్రబాబుకు ఏమైన జరుగుతుందన్న భయంతో పోలీసులు ఒప్పుకోలేదు.. అయన టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి పోలీసులపై దాడికి ప్రేరేపించారు అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
Read Also: Pawan Kalyan: రౌడీయిజం చేయగలిగినవాడే రాజకీయ నాయకుడు అనుకోవాలా..?
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
కాన్వాయ్ లో వచ్చేప్పుడు టీడీపీ నేతలు తుఫాకులు, రాళ్ళు తెచ్చుకున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మరి గవర్నర్ కి ఏమని ఫిర్యాదు చేశారు.. టీడీపీ వారు పోలీసులను కొట్టారని.. రాష్ట్రంలో రాజకీయంగా ఇక పోటీ పడలేమని ఇలాంటి వాటికి చంద్రబాబు తెరలేపారు.. ఇలాంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే.. కాలేజీ సమయం నుంచి చంద్రబాబుకి నన్ను టార్గెట్ చేశారు.. మా ప్రాంతంలో మూడు ప్రాజెక్టులు నిర్మాణం చేపడితే.. కేసులు వేసి ఆ నిర్మాణాలు ఆయన ఆపివేశారు అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. హంద్రీనీవా పనులు చేసేది ఎన్సీసీ కంపెనీ.. అది కూడా మాపై నింద మోపాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: Sangareddy: కొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె..
చంద్రబాబు కాన్వాయ్ లోని రౌడీ మూకలు కర్రలు, రాళ్లు తెచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ చేశారు. విచక్షణా రహితంగా పోలీసులపై దాడులు చేశారు.. చంద్రబాబు తీరు మొగుడ్ని కొట్టి మొగసాలికేక్కినట్టు ఉంది.. పోలీసులపై దాడులు చేసి.. రివర్స్ లో మాట్లాడుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో రాష్ట్రంలో చంద్రబాబు హింసను ప్రేరేపిస్తున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
-
SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
-
RCB IPL 2026 Playoffs: ఆర్సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!
-
DRDO TARA Test: డీఆర్డీఓ స్వదేశీ ‘తారా’ కిట్ టెస్ట్ సక్సెస్.. శత్రువులకిక దబిడి దిబిడే
-
Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!