Minister Peddireddy: ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో చంద్రబాబు హింసను ప్రేరేపిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. పుంగనూరు ఘటనకు ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అంటూ ఆయన విమర్శించారు. బైపాస్ లో వెళతాం అని పోలీసులకు రోడ్ మ్యాప్ ఇచ్చారు.. ఆ తరువాత ఉన్నపళంగా పుంగనూరు టౌన్ లోకి వెళ్ళాలని చూసారు.. ఉన్నట్టుండి రూటు మారితే చంద్రబాబుకు ఏమైన జరుగుతుందన్న భయంతో పోలీసులు ఒప్పుకోలేదు.. అయన టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి పోలీసులపై దాడికి ప్రేరేపించారు అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
Read Also: Pawan Kalyan: రౌడీయిజం చేయగలిగినవాడే రాజకీయ నాయకుడు అనుకోవాలా..?
Also Read
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
- Minister Satyakumar: అమరావతిపై జగన్కు మంత్రి సత్యకుమార్ సవాల్.. ఎన్నికలకు వెళ్దామా..?
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
కాన్వాయ్ లో వచ్చేప్పుడు టీడీపీ నేతలు తుఫాకులు, రాళ్ళు తెచ్చుకున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మరి గవర్నర్ కి ఏమని ఫిర్యాదు చేశారు.. టీడీపీ వారు పోలీసులను కొట్టారని.. రాష్ట్రంలో రాజకీయంగా ఇక పోటీ పడలేమని ఇలాంటి వాటికి చంద్రబాబు తెరలేపారు.. ఇలాంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే.. కాలేజీ సమయం నుంచి చంద్రబాబుకి నన్ను టార్గెట్ చేశారు.. మా ప్రాంతంలో మూడు ప్రాజెక్టులు నిర్మాణం చేపడితే.. కేసులు వేసి ఆ నిర్మాణాలు ఆయన ఆపివేశారు అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. హంద్రీనీవా పనులు చేసేది ఎన్సీసీ కంపెనీ.. అది కూడా మాపై నింద మోపాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: Sangareddy: కొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె..
చంద్రబాబు కాన్వాయ్ లోని రౌడీ మూకలు కర్రలు, రాళ్లు తెచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ చేశారు. విచక్షణా రహితంగా పోలీసులపై దాడులు చేశారు.. చంద్రబాబు తీరు మొగుడ్ని కొట్టి మొగసాలికేక్కినట్టు ఉంది.. పోలీసులపై దాడులు చేసి.. రివర్స్ లో మాట్లాడుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో రాష్ట్రంలో చంద్రబాబు హింసను ప్రేరేపిస్తున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.
తాజావార్తలు
-
Leonardo DiCaprio: ఒక్క టిప్తో వెయిటర్ జీవితాన్ని మార్చిన ‘టైటానిక్’ హీరో… కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
-
Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!