Yarlagadda Venkatarao: 2024లో గన్నవరం నుంచి పోటీ చేయటం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మీయ సమావేశానికి రాకుండా కొందరు బెదిరించారని తెలిపారు. మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ కార్యకర్తలపై కేసులు తీయలేదని యార్లగడ్డ ఆరోపించారు. జగన్ తమ రాజకీయ భవిష్యత్ కు భరోసా ఇచ్చి గన్నవరం తీసుకువచ్చారని.. తాను రాక ముందు ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటో ఇక్కడ వారికే బాగా తెలుసని యార్లగడ్డ పేర్కొన్నారు.
Natural Star Nani: నాకు తెలిసిన హీరోల్లో పాన్ ఇండియా స్టార్ అంటే అతనే..
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
అయితే గత ఎన్నికల్లో దురదృష్టం, విధి వంచించటం వల్ల ఓడి పోయానని యార్లగడ్డ పేర్కొన్నారు. టెన్త్ క్లాస్ చదువుకునే రోజుల్లోనే తాను ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే తాను ఎమ్మెల్యేగా ఓడినా.. పార్టీ అధికారంలో ఉందని నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిద్దాం అనుకున్నట్లు పేర్కొన్నారు. తాను 2024లో గన్నవరం నుంచి పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. వంశీతో తనకు ఎలాంటి తగాదాలు లేవని.. కాదంటే వంశీతో కలిసి పనిచేయలేనన్నట్లు తాను సీఎం జగన్ కి చెప్పానన్నారు. వైసీపీ అభ్యర్ధిగా తాను పోటీ చేయటం వల్లే వంశీకి శత్రువుగా మారానని తెలిపారు. అయితే తనను విజయవాడ ఎంపీకి ఇంఛార్జిగా వెళ్ళాలని పార్టీ పెద్దలు కోరారని.. తాను మాత్రం గన్నవరంలోనే ఉంటానని చెప్పానని అన్నారు. వైసీపీకి తానే ముందు వచ్చానని.., తననే ముందు గుర్తించాలని జగన్ ను కోరుతున్నట్లు యార్లగడ్డ పేర్కొన్నారు.
Pawan Kalyan: పార్టీ నడపడానికి సినిమాలే నాకు ఇంధనం
తనను క్రాస్ రోడ్డులో వదలనన్న జగన్.. ఇప్పుడు నడిరోడ్డు మీద ఉన్నట్లు యార్లగడ్డ ఆరోపించారు. మరోవైపు తనను దుట్టా రామచంద్రరావు డొక్క చించి డోలు కడతారని తిట్టినా పార్టీ స్పందించలేదని తెలిపారు. ఎన్నో అవమానాలు భరించానని.. తాను మాత్రం జగన్ ను ఏమీ అనలేదని పేర్కొన్నారు. అయితే రెండేళ్లుగా తనకు సీఎం దగ్గర నుంచి అపాయింట్ మెంట్ లేదని.. తనకు గన్నవరం టికెట్ ఇవ్వాలని మరోసారి జగన్ ను కోరుతున్నట్లు తెలిపారు. ఇక తన భవిష్యత్ ను గన్నవరం ప్రజలు నిర్ణయిస్తారని యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!