Yarlagadda Venkatarao: 2024లో గన్నవరం నుంచి పోటీ చేయటం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మీయ సమావేశానికి రాకుండా కొందరు బెదిరించారని తెలిపారు. మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ కార్యకర్తలపై కేసులు తీయలేదని యార్లగడ్డ ఆరోపించారు. జగన్ తమ రాజకీయ భవిష్యత్ కు భరోసా ఇచ్చి గన్నవరం తీసుకువచ్చారని.. తాను రాక ముందు ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటో ఇక్కడ వారికే బాగా తెలుసని యార్లగడ్డ పేర్కొన్నారు.
Natural Star Nani: నాకు తెలిసిన హీరోల్లో పాన్ ఇండియా స్టార్ అంటే అతనే..
Also Read
- Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
- Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
- Tata Sierra EV: జూన్ 30న టాటా సియెర్రా EV లాంచ్.. 500 కి.మీ. రేంజ్తో వస్తున్న SUV
- Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
అయితే గత ఎన్నికల్లో దురదృష్టం, విధి వంచించటం వల్ల ఓడి పోయానని యార్లగడ్డ పేర్కొన్నారు. టెన్త్ క్లాస్ చదువుకునే రోజుల్లోనే తాను ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే తాను ఎమ్మెల్యేగా ఓడినా.. పార్టీ అధికారంలో ఉందని నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిద్దాం అనుకున్నట్లు పేర్కొన్నారు. తాను 2024లో గన్నవరం నుంచి పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. వంశీతో తనకు ఎలాంటి తగాదాలు లేవని.. కాదంటే వంశీతో కలిసి పనిచేయలేనన్నట్లు తాను సీఎం జగన్ కి చెప్పానన్నారు. వైసీపీ అభ్యర్ధిగా తాను పోటీ చేయటం వల్లే వంశీకి శత్రువుగా మారానని తెలిపారు. అయితే తనను విజయవాడ ఎంపీకి ఇంఛార్జిగా వెళ్ళాలని పార్టీ పెద్దలు కోరారని.. తాను మాత్రం గన్నవరంలోనే ఉంటానని చెప్పానని అన్నారు. వైసీపీకి తానే ముందు వచ్చానని.., తననే ముందు గుర్తించాలని జగన్ ను కోరుతున్నట్లు యార్లగడ్డ పేర్కొన్నారు.
Pawan Kalyan: పార్టీ నడపడానికి సినిమాలే నాకు ఇంధనం
తనను క్రాస్ రోడ్డులో వదలనన్న జగన్.. ఇప్పుడు నడిరోడ్డు మీద ఉన్నట్లు యార్లగడ్డ ఆరోపించారు. మరోవైపు తనను దుట్టా రామచంద్రరావు డొక్క చించి డోలు కడతారని తిట్టినా పార్టీ స్పందించలేదని తెలిపారు. ఎన్నో అవమానాలు భరించానని.. తాను మాత్రం జగన్ ను ఏమీ అనలేదని పేర్కొన్నారు. అయితే రెండేళ్లుగా తనకు సీఎం దగ్గర నుంచి అపాయింట్ మెంట్ లేదని.. తనకు గన్నవరం టికెట్ ఇవ్వాలని మరోసారి జగన్ ను కోరుతున్నట్లు తెలిపారు. ఇక తన భవిష్యత్ ను గన్నవరం ప్రజలు నిర్ణయిస్తారని యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!