Purandeswari : ఏపీలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు.. పురంధేశ్వరి ట్విట్టస్త్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ట్విట్టర్ వేదిక వైసీపీ ప్రభుత్వంపై వరుసగా ట్విట్టస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ.. ఏపీలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు. కేంద్రం పంచాయతీలకిచ్చిన నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లించింది. గ్రామాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలు వదిలింది. నాలుగున్నరేళ్ల కాలంలో రూ. 8600 కోట్లు ఏపీలోని గ్రామాలకు కేంద్రం ఇచ్చింది. సర్పంచులు అప్పులు చేసి పనులు చేస్తున్నా.. బిల్లులు రావడం లేదు. కొందరు సర్పంచులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్ర నిధుల వాటాతో జరిగే అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ.. ముడుపులిచ్చిన వారికి గ్రీన్ ఛానెల్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎన్జీటీ అభ్యంతరాలతో ఆపేసినా.. ఆ కాంట్రాక్టరుకు గ్రీన్ ఛానెల్ ద్వారా రూ. 800 కోట్లు ఇచ్చేశారు. ఈ నెల పదో తేదీన అన్ని జిల్లాల్లో సర్పంచులకు అండగా కార్యక్రమాలు చేపడుతున్నాం. జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతాం.’ అని ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Also Read : KCR Govt: ఇమామ్లు, మౌజంలకు గుడ్న్యూస్.. మరో 7 వేల మందికి గౌరవ వేతనం
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ఇదేకాకుండా.. రాష్ట్ర ప్రభత్వం గ్రామ పంచాయితీల నిర్వహణకు కేంద్రం ఇచ్చిన నిధులు మళ్ళించి సర్పంచ్ లు ఆత్మహత్యకు పాల్పడే స్థాయికి కారణభూతమైనటువంటి పరిస్థితులు, వేలాదిమంది కాంట్రాక్టర్లు అప్పుల ఊబిలో కోరుకుపోయి ప్రభుత్వ నిధులు రాక తిప్పలు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర బిజెపి ఈనెల 10 వ తారీఖున కలెక్టరేట్ల ముందు నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని వివరిస్తూ… ప్రజల సంఘీభావాన్ని కోరుతూ పురంధేశ్వరి వీడియో పోస్ట్ చేశారు.
Also Rea : Allu Arjun:’ప్రభాస్’ దెబ్బకు అలెర్ట్ అయిన ‘బన్నీ’..రిజెక్ట్ చేసేసినట్టే?
అంతేకాకుండా.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కారాదు. హిందూ ధర్మం పై నమ్మకమున్నవాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరు. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగింది. ఈ విషయం పై గలం విప్పిన తరువాత 52 మంది నియామకం నిలిపి వేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తున్నదని అర్ధమవుతున్నది. కనుక టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మం పై నమ్మకమున్న వారిని, హిందూ ధర్మం అనుసరించే వాళ్ళని నియమించాలి.’ అని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!