వినోద్ జైన్ ను సస్పెండ్ చేసి టీడీపీ చేతులు దులుపుకుంటోందని.. చిన్నారి ఆత్మహత్య ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టీడీపీ నేత వినోద్ జైన్ చిన్నారిని ఇబ్బంది పెట్టాడని.. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని విధంగా కఠినంగా వ్యవహరించాడని…. 54 ఏళ్ల వ్యక్తికి ఈ బుద్ది ఎలా వచ్చిందో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. వినోద్ కుమార్ జైన్ను కఠినంగా…
మహిళలపై అత్యాచారాలలో ఏపీ రెండవ స్థానంలో ఉందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ సందర్భంగా గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత చెల్లికి రక్షణ ఇవ్వలేని వ్యక్తి సీఎం జగన్ అని, ఇక రాష్ట్ర మహిళలకు ఏం ఇస్తాడు అంటూ విమర్శించారు. రాష్ట్రంలో నేరగాళ్లకు ప్రెంఢ్లీ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని దుయ్యబట్టారు. ఏపీలో మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారని ఆమె అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అత్యాచారం చెయ్యాలంటే భయపడే పరిస్థితి చంద్రబాబు కల్పించారన్నారు.…
తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపగల వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ను ఓ ప్రాంతానికో.. కులానికో పరిమితం చేయొద్దని మంత్రి పేర్నినాని అన్నారు. ప్రధానులనే నియమించి చక్రం తిప్పానన్న చంద్రబాబు.. ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు? ఎన్టీఆర్ పేరుతో జిల్లా పెట్టాలన్న ఆలోచనను చంద్రబాబు ఎందుకు చేయలేదని మండిపడ్డారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం…
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పరిపాలన సౌలభ్యం ఉండాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలని, జిల్లాల విభజన స్వాగతించాల్సిన అంశం అన్నారు.జిల్లాల విభజన వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. పరిపాలన సౌలభ్యం పెరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రజలకు పరిపాలన చేరువ అయ్యేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాంలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. దానిలో…
ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ఏర్పాటు శుభ పరిణామమని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాల వికేంద్రీకరణ వలన ప్రజలకు మరింత మేలు కలుగుతుందన్నారు. చారిత్రక నేపథ్యం.. ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకోనే ప్రభుత్వం కొత్త జిల్లాలకు నామకరణం చేయడం అభినందనీయమన్నారు.మన దేశం అనేక అంతర్గత, బహిర్గత సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. Read Also: నా ప్రసంగాలు యువత, సమాజంలో మార్పు తీసుకువస్తే చాలు: గరికపాటి నరసింహారావు దేశంలో మూడో వేవ్ కరోనా…
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం, సత్వర సేవలే లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. ఎన్నికల హామీని అమలు చేస్తూ కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి సారథ్యంలో నోటీఫికేషన్ విడుదల చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు. Read Also: ఆంధ్ర రాష్ట్రాన్ని వివాదాలు, అప్పులు, అవినీతిమయం కానివ్వం:…
విశాఖ నగర వైస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి అవంతి శ్రీనివాస్తో పాటు తిప్పల నాగిరెడ్డి, వరుదు కళ్యాణి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, నియోజకవర్గ సమన్వయ కర్తలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. జాతీయ జెండాను మంత్రి అవంతి శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి విశాక రావాలంటే ఐదు గంటల సమయం పడుతుందన్నారు.…
విజయవాడ ఉంగటూరు పోలీస్ స్టేషన్ ఉంగటూరు పోలీస్ స్టేషన్ నుండి సోము వీర్రాజు విడుదల అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ దెబ్బకి వైసీపీ ప్రభుత్వం, మంత్రి ఓడిపోయాడన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మమ్ముల్ని ఆపాలని చూశారు. సంక్రాంతి సంబరాలు ఎలా జరపాలో మా కార్య కర్తలు గుడివాడ నానికి చూపించారని చురకలు అంటించారు. ఢిల్లీలో తోకలు పట్టుకుని తిరిగే పార్టీలు మాపై కామెంట్లు చేస్తున్నాయన్నారు.…
ఏపీబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో “సంక్రాంతి సంబరాలు” ముగింపు కార్యక్రమలకు గుడివాడ వెళ్తున్న బీజేపీ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడారు. పోలీసులు ఏ నిబంధనలతో బీజేపీ నాయకులను అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడమేంటని ఆయన మండిపడ్డారు. అధికార దాహానికి, అధికార మదానికి హద్దు ఉంటుందని వైసీపీకి చురకలంటించారు.…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్గా ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలు టీడీపీ ఎమ్మెల్యే బుద్ధావెంకన్న వర్సెస్ మంత్రి కొడాలినానిగా మారాయి. ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా చిన్నపాటి మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. మంగళవారం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నానిపై ఫైర్ అయ్యారు. మంత్రి కొడాలి నానిది దొంగతనాలు చేసే బతుకు.. కొడాలి నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని బుద్ధా అన్నారు. కొడాలి నాని పాన్ పరాగ్…