Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Has Coordination Among Party Leaders Become A Challenge For Avanti

పార్టీ నేతల మధ్య సమన్వయం అవంతికి సవాలుగా మారిందా?

Published Date :May 12, 2022 , 11:59 am
By Premchand Chowdary
పార్టీ నేతల మధ్య సమన్వయం అవంతికి సవాలుగా మారిందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆరు నియోజకవర్గాలు కలిగిన విశాఖపట్టణంజిల్లా ప్రధాన రాజకీయపార్టీలకు ఆయువు పట్టు. సంస్ధాగతంగా పార్టీల బలోపేతంపై టీడీపీ, వైసీపీ ఫోకస్ పెంచాయి. సోషల్ ఇంజనీరింగ్‌లో పది అడుగులు ముందేవున్న వైసీపీ.. కీలకమైన జిల్లా అధ్యక్ష పదవిలో మార్పు చేసింది. మూడేళ్లు మంత్రిగా ఉన్న భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. తొలిసారి పార్టీని నడిపించే అవకాశం లభించడంతో అవంతి సైతం ప్రతిష్టాత్మకంగానే భావిస్తున్నారు. కానీ, క్షేత్రస్ధాయిలో పార్టీ పరిస్ధితులు అవంతికి ఏ మాత్రం కొరుకుడుపడ్డం లేదనేది అంతర్గత చర్చ.

గత ఎన్నికల్లో గ్రేటర్‌ విశాఖ పరిధిలో నాలుగు స్ధానాలను టీడీపీ గెలుచుకుంది. భీమిలి, గాజువాక మాత్రమే వైసీపీకి దక్కాయి. వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ తమ ఖాతాలోనే వేసుకోవాలనేది అధికారపార్టీ ఆలోచన. కొత్త అధ్యక్షుడుకి వైసీపీ కోఆర్డినేటర్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ నియోజకవర్గాల వారీగా అంతర్గత రాజకీయాలు ఇబ్బంది కలిగిస్తున్నాయట. పార్టీ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందనే సంకేతాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త హోదాలో తొలిసారి నగరానికి వైవీ సుబ్బారెడ్డి వచ్చారు. ఆయనకు స్వాగతం చెప్పే సమయంలోనే సమన్వయ లోపం బయటపడింది. అధ్యక్షుడిగా అవంతి అందరికీ సమాచారం పంపినా కొందరు సీనియర్లు సహకరించలేదట. ఈ అంశంపై కొందరిని అవంతి నేరుగానే ప్రశ్నించారని..అంతర్గత రాజకీయాలకు పార్టీ కార్యక్రమాలను వాడుకోవడం కరెక్ట్ కాదని చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఓ ఎమ్మెల్సీకి అవంతికి మధ్య వాగ్వివాదం జరిగిందట.

Also Read

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
  • Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ మొదలైందా?
  • Off The Record : స్వరం మార్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి..?
  • Off The Record : కాంగ్రెస్ హనుమంతుడికి పవర్ సంజీవని దొరకదా..?

వైవీ కార్యక్రమానికి భారీగా జనసమీకరణ చేయాలని వైసీపీ నేతలు భావించారు. నాయకులు, ముఖ్య కార్యకర్తలతో రెండుసార్లు సన్నాహాక సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా జన సమీకరణ ఎలా ఉండాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చివరికి కార్యకర్తలను సమీకరించడంలో మీరు ముందు అంటే మీరు ముందు అంటూ వాదులాడుకుని అంతా గాలికి వదిలేశారట. అదే సమయంలో అనకాపల్లి జిల్లా సమావేశం భారీగా జరిగింది. ఇప్పుడు రెండు జిల్లాల మధ్య ఆ ప్రోగ్రామ్‌పై పోలికలు మొదలయ్యాయి.

ప్రధానంగా తూర్పు, దక్షిణ నియోజకవర్గాల్లో అసంతృప్తులు, గ్రూపు రాజకీయాలు అవంతికి ఇబ్బందిగా మారాయనేది టాక్‌. దక్షిణంలో ఐదు గ్రూపులు ఉండగా.. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుదాకర్ వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. కేడర్ మధ్య అయోమయం, స్పష్టమైన చీలిక ఉంది. తూర్పు నియోజకవర్గంలో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, వీఎంఆర్‌డీ చైర్మన్‌ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వంశీకృష్ణల మధ్య పొసగటం లేదు. వీరి మధ్య సమన్వయం అవంతికి సవాలే అన్నది పార్టీ వర్గాల మాట.

ఇక మంత్రి గుడివాడ అమర్నాథ్, అవంతి మధ్య బలమైన సంబంధాలు లేవనేది బహిరంగ రహస్యం. పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న అవంతి.. కఠినమైన వైఖరి ప్రదర్శించేందుకు సిద్ధం అవుతున్నట్టు చెబుతున్నారు. ఈ దిశగా కీలకమైన చర్యలు తప్పవని బహిరంగ వేదికలపైనే హెచ్చరిస్తున్నారు. మంత్రులైన కార్యకర్తలైనా వరసగా మూడుసార్లు పార్టీ సమావేశాలకు హాజరు కాకపోతే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. తద్వారా మొత్తం పార్టీ కార్యకలాపాలను తన పరిధిలోని తెచ్చుకోవాలన్నది అధ్యక్షుడు ఆలోచనగా తెలుస్తోంది. మరి ఇవన్నీ ప్రాక్టికల్‌గా ఎంత వరకు సాధ్యమో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhra politics
  • avanthi srinivas
  • greater vishaka
  • latest news
  • ycp

తాజావార్తలు

  • Thalaivar 173: తలైవర్ 173 నుంచి షాకింగ్ న్యూస్.. శంకర్ వర్సెస్ రజనీకాంత్!

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions