PM Modi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటోకాల్ వివాదంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్, సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతర్జాతీయ సంతాల్ సమావేశం వేదికను మార్చాడాన్ని తప్పుపట్టారు. ఈ పరిణామాలు ‘‘సిగ్గుచేటు, అపూర్వమైనది’’ అని అభివర్ణించారు. శనివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి, వేదికను బిధాన్నగర్ నుంచి గోషైపూర్కు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. మమతా బెనర్జీ లేదా ఇతర మంత్రులు ఎవరూ రిసీవ్ చేసుకోవడానికి రాకపోవడంపై రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Ustaad Bhagat Singh Trailer: ‘ఇది భగత్ గీత.. దమ్మున్నొడు దాటొచ్చు’.. ‘ఉస్తాద్’ ఊచకోత!
రాష్ట్రపతి వీడియోను పోస్ట్ చేసిన మోడీ.. ‘‘ తృణమూల్ కాంగ్రెస్ సంతాల్ సంస్కృతిని నిర్లక్ష్యంగా చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రపతి కూడా గిరిజన సమాజానికి చెందినవారని ఎత్తి చూపారు. ఇది సిగ్గుచేటు మరియు అపూర్వమైనది. ప్రజాస్వామ్యం, గిరిజన వర్గాల సాధికారతపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ నిరుత్సాహపడ్డారు. గిరిజన సమాజానికి చెందిన రాష్ట్రపతి జీ వ్యక్తం చేసిన బాధ, వేదన భారతదేశ ప్రజల మనస్సులలో తీవ్ర విచారాన్ని కలిగించింది. పశ్చిమ బెంగాల్లోని టిఎంసి ప్రభుత్వం నిజంగా అన్ని పరిమితులను దాటింది. రాష్ట్రపతికి జరిగిన ఈ అవమానానికి వారి పరిపాలన బాధ్యత వహిస్తుంది. సంతాల్ సంస్కృతి వంటి ముఖ్యమైన అంశాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా అంతే దురదృష్టకరం’’ అని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.