ఒక్కప్పుడు ఆ ఫ్యామిలీదే పెత్తనం…వారసులు ఆ స్పీడ్ అందుకోలేకపోయారా..?
డీకే ఆదికేశవులు…మాజీ ఎంపీ .. టీటీడీ మాజీ ఛైర్మన్. చిత్తూరు జిల్లాలో వ్యాపార పరంగా, రాజకీయంగాను పెద్ద కుటుంబం. ఆర్థికంగానూ బలమైన ఫ్యామిలీ. చిత్తూరుతోపాటు జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో డీకే కుటుంబానికి పట్టు ఉండేది. 2004లో టిడిపి తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసిన ఆదికేశవులు.. తర్వాత కాంగ్రెస్లో చేరి TTD ఛైర్మన్ అయ్యారు. డీకే శ్రీనివాసులు 2009లో పీఆర్పీ తరపున రాజంపేట లోక్సభకు పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత డీకే కుటుంబం మరోసారి టీడీపీకి చేరువైంది. 2014లో ఆదికేశవుల సతీమణి సత్యప్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆపై డీకే ఫ్యామిలీ మరోసారి సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది. సత్యప్రభ మృతి చెందిన తర్వాత డీకే కుటుంబం గురించి రాజకీయ చర్చే లేదు.
మరో రెండేళ్ల తర్వాత ఏపీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో డీకే ఫ్యామిలీ మరోసారి యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడానికి ఉత్సాహంగా ఉంది. డీకే ఆదికేశవుల తనయుడు డీకే శ్రీనివాసులు అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి శ్రీనివాసులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో బలిజ ఓటర్లు ఎక్కువ. శ్రీనివాసులు కూడా అదే సామాజికవర్గం కావడంతో ఈజీగా గెలవొచ్చని లెక్కలేస్తున్నారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి డీకే తనయుడికి వైసీపీ, టీడీపీ నుంచి ఆఫర్లు వెళ్లినట్టు తెలుస్తోంది. గత ఏడాది సీఎం జగన్ తిరుమల వచ్చినప్పుడు పద్మావతి అతిథి గృహం దగ్గర శ్రీనివాసులు ఆయనతో భేటీ అయ్యారు. రాజంపేట ఎంపీ మిధున్రెడ్డి ఆయన్ను సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. దాంతో ఆయన వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది.
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్ అనే ధీమాతో ఉన్నారు ఆరణి. మరికొందరు వైసీపీ నేతలు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ లెక్కలు చూశాక.. టీడీపీ నేతలు గేర్ మార్చేశారట. వైసీపీలో టికెట్ వస్తుందో లేదో తెలియదు.. అక్కడికి ఎందుకు.. టీడీపీలోకి వస్తే టికెట్ గ్యారెంటీ.. గెలుపు గ్యారెంటీ అని డీకే శ్రీనివాసులకు నూరిపోస్తున్నారట. అంతేకాదు.. పసుపు కండువా కప్పుకొంటే మరోసారి డీకే ఫ్యామిలీకి జిల్లాలో పూర్తి పట్టు వస్తుందని చెబుతున్నారట. దీంతో వైసీపీలోకి వెళ్లాలో.. టీడీపీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో శ్రీనివాసులు తేల్చుకోలేకపోతున్నారట.
తాజావార్తలు
-
High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
-
KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
-
Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..
-
Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
-
Lavanya : మా రామ్ చరణ్ బావకి థాంక్స్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!