ఎమ్మెల్యేల గ్రాఫ్ పై ఆసక్తికర చర్చ
గ్రాఫ్ పడిపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కట్ అని సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పేయడంతో.. గోదావరి జిల్లాల్లో ఆ అంశం హాట్ టాపిక్గా మారిపోయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు టికెట్ వస్తుంది? ఎవరికి రాదు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఏ నలుగురు వైసీపీ శ్రేణులు కలిసినా ఇదే చర్చ. దీనిని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యేలపై కొందరు వ్యతిరేక ప్రచారాలు మొదలు పెట్టేస్తున్నారట.
జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు కష్టమే అనే ప్రచారం జోరుగా ఉంది. కాకినాడ జిల్లాలో ముగ్గురు వైసీపీ శాసనసభ్యులకు, కోనసీమ జిల్లాలో ఒక ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని వారి వైరివర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీకి పార్టీ కోఆర్డినేటర్ లేరు. రాజమండ్రి రూరల్ ఇంఛార్జ్ను పనితీరు మెరుగు పర్చుకోవాలనే సంకేతాలు ఇచ్చారట.
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
నియోజకవర్గాల్లో తమకు బలం తగ్గలేదని, బాగా పనిచేస్తున్నామని భుజాలు చర్చుకుంటున్న ఎమ్మెల్యేలకు.. సీఎం జగన్ చెప్పిన గ్రాఫ్ల విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఉలిక్కి పడుతున్నారట. ఆ జాబితాలో తాము ఉన్నామా? లేమా అని ఆందోళనలో ఉన్నారట. తొమ్మిది నెలల్లో గ్రాఫ్ పెంచుకోకపోతే టికెట్ కష్టమని స్పష్టం చేయడంతో రోజులు లెక్క పెడుతున్నారట. సర్వే ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని, ఫలితం బాగోకపోతే టిక్కెట్ రాదని చెప్పడంతో.. ఆ సాకుతో ఎవరికి ఎసరు పడుతుందో అనే చర్చ జరుగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసి బలంగా ఉన్నామని భావిస్తున్న ఎమ్మెల్యేలకు.. అధినేత ప్రకటన గాలి తీసేసినట్టు అయిందట. గడచిన మూడేళ్ల పనితీరు నిరూపించుకోవడానికి తమ చేతుల్లో ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా పథకాల పేరుతో నగదు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా పడుతోందని.. సమస్య వస్తే జనం సచివాలయ సిబ్బంది దగ్గరకు వెళ్తున్నారని.. ఇక తమ గ్రాఫ్ ఎలా పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారట. టికెట్ వచ్చే ఛాన్స్ లేని నియోజకవర్గాల్లో ఇంత వరకు తటస్థంగా ఉన్న సీనియర్లు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. జగ్గంపేటలో మాజీ మంత్రి తోట నరసింహం, ప్రత్తిపాడులో వరుపుల సుబ్బారావు చురుకుగా ఉన్నారు.
మే 10 నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటా తిరగాలి. ఆ డేట్ సమీపించే కొద్దీ తల పట్టుకుంటున్నారట. దాంతో గ్రాఫ్ పెరగకపోతే ఎలా అనే ప్రశ్నలు ఉన్నాయట. మరి.. పార్టీ జాబితాలో ఉండేదెవరో? పోయేదెవరో? కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్మేట్స్’ సిరీస్ రివ్యూ
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ముందున్న కఠినమైన సవాళ్లు ఇవే!
-
Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
-
NTRNeel : డ్రాగన్ కోసం ఎన్టీఆర్ డబుల్ మేకోవర్.. ఫ్యాన్స్ కు పూనకాలే
-
Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!