Indiramma Illu: ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: మంత్రి పొంగులేటి
- గ్రామాల్లో 3.60 లక్షల ఇళ్లు మంజూరు..
- లక్ష యూనిట్లకు ఈ నెలాఖరులోగా ప్రవేశాలు..
- ఈ నెలాఖరులోగా డబుల్ బెడ్రూం ఇళ్ల అర్హుల జాబితా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గూడు లేని పేదల కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో మొదటి దశ కింద ఇప్పటికే 3.60 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లలో కనీసం లక్ష యూనిట్లను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేసి.. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అందాల్సిన నగదు చెల్లింపుల్లో జాప్యం జరిగినా లేదా ఎక్కడైనా నిలిపివేసినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వచ్చే ఏప్రిల్ (APR) నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.
Also Read
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
Also Read:PM Modi: తృణమూల్ అన్ని హద్దుల్ని దాటేసింది.. రాష్ట్రపతి వివాదంపై ప్రధాని మోడీ..
ఈ పథకం కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా.. పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. సొంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని విడతల వారీగా అందిస్తున్న విషయం తెలిసిందే. పనుల పురోగతిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఐటి (IT) ఆధారిత వ్యవస్థను, మొబైల్ యాప్లను ప్రభుత్వం వినియోగిస్తోంది. దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండ్ మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చేలా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కేవలం ఇళ్లే కాకుండా.. ఆయా కాలనీల్లో రోడ్లు, విద్యుత్ , తాగునీటి సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సమయానికి ఇళ్లు పూర్తి చేయడం ద్వారా వేలాది కుటుంబాలకు సొంతింటి కల నెరవేరనుంది.
తాజావార్తలు
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్ఫ్లిక్స్లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!