Indiramma Illu: ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: మంత్రి పొంగులేటి
- గ్రామాల్లో 3.60 లక్షల ఇళ్లు మంజూరు..
- లక్ష యూనిట్లకు ఈ నెలాఖరులోగా ప్రవేశాలు..
- ఈ నెలాఖరులోగా డబుల్ బెడ్రూం ఇళ్ల అర్హుల జాబితా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గూడు లేని పేదల కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో మొదటి దశ కింద ఇప్పటికే 3.60 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లలో కనీసం లక్ష యూనిట్లను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేసి.. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అందాల్సిన నగదు చెల్లింపుల్లో జాప్యం జరిగినా లేదా ఎక్కడైనా నిలిపివేసినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వచ్చే ఏప్రిల్ (APR) నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.
Also Read
- TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
- Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
- ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
- Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
Also Read:PM Modi: తృణమూల్ అన్ని హద్దుల్ని దాటేసింది.. రాష్ట్రపతి వివాదంపై ప్రధాని మోడీ..
ఈ పథకం కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా.. పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. సొంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని విడతల వారీగా అందిస్తున్న విషయం తెలిసిందే. పనుల పురోగతిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఐటి (IT) ఆధారిత వ్యవస్థను, మొబైల్ యాప్లను ప్రభుత్వం వినియోగిస్తోంది. దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండ్ మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చేలా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కేవలం ఇళ్లే కాకుండా.. ఆయా కాలనీల్లో రోడ్లు, విద్యుత్ , తాగునీటి సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సమయానికి ఇళ్లు పూర్తి చేయడం ద్వారా వేలాది కుటుంబాలకు సొంతింటి కల నెరవేరనుంది.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
ట్రెండింగ్
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!