వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు వరంగల్ పోలీసులు.. లింగగిరి క్రాస్ రేపు తన పాదయాత్రను తిరిగి ప్రారంభించడానికి వైఎస్ షర్మిల సిద్ధం అయ్యారు.. రేపటి నుండి పాదయాత్రను పునఃప్రారంభించేందుకు గాను పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు.. అయితే, పాదయాత్ర అనుమతి కోసం ఆమె చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించవద్దు..? అంటూ ఆమెకు పోలీసులు షోకాజ్ నోటీసులను అందజేశారు. పాదయాత్రకు మొదటి సారి పోలీసులు అనుమతిని ఇచ్చినప్పుడు.. వారు…
తండ్రి తన గారాల బిడ్డకోసం ఎంతో ఇష్టంతో విదేశాల నుంచి తెచ్చిన చాక్లెట్ తన బిడ్డ ప్రాణాలే బలి గొంటుందని ఊహించలేక పోయాడు. నాన్న తెచ్చిన చాక్లెట్ లను తీసుకుని చిన్నారి స్కూల్ లో తిండామనుకున్నాడు.
నేటి నుంచి వరంగల్ మార్కెట్ ప్రారంభం అవుతుందని, అధ్వాన్న గోనె సంచులు, యూరియా బస్తాలు తప్ప అన్ని సంచుల కోసం రైతులకు 30 రూపాయలు చెల్లించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
రోజురోజుకు మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోతుందని కొన్ని ఘటనలు చేస్తూ స్పష్టంగా అర్థమవుతోంది.. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదలడంలేదు కామాంధులు.. చివరకు తోబుట్టువలను చెరపట్టే దుర్మార్గపు ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. అంతేకాదు.. కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా మృగాళ్లలా మారిపోతున్నారు.. పసికూనలు అనికూడా చూడకుండా వారి జీవితాలను చిదిమేస్తున్నారు.. తాజాగా, వరంగల్లో వెలుగుచూసిన ఘటన వీడు తండ్రా? మృగమా? అసలు మనిషేనా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తోంది. Read…
కరెంటు తగిలితే షాక్ వస్తుంది.. కానీ, కరెంట్ బిల్లు చూస్తేనే షాక్ గురైన సంఘటన ఒకటి వెలుగు చూసింది.. ప్రతినెలా 500, 600 వచ్చే కరెంట్ బిల్లు.. 50వేల రూపాయలు బిల్లును చూసి ఓ ఇంటి యజమాని షాక్ కు గురయ్యాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని పేద కుటుంబానికి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంటి కరెంట్ బిల్లు 51,249 రూపాయలు వచ్చింది… తనకున్నది మూడు రూమ్లేనని, తాను నిరుపేద…
ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. నేడు రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల నిరసన చేపట్టారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురం గ్రామానికి చెందిన యువకులు గ్రామ శివారులో దసరా సంబరాల్లో భాగంగా, మిత్రులంతా కలిసి మద్యం సేవిస్తుండగా ఉన్నట్టుండి వారిపై పిడుగు పడింది. దీంతో మందు పార్టీకి హాజరైన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.