భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది… మూడో విడతలో 11 నియోజకవర్గాలు, 5 జిల్లాల గుండా ఆయన పర్యటన సాగింది.. ఈ సారి 300.4 కిలోమీటర్లను చేరుకోవడంతో యాత్ర ముగియనుంది.. మొత్తంగా 3 విడతల్లో కలుపుకేంటే 1121 కిలోమీటర్లు, 18 జిల్లాలు, 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంజయ్ పాదయాత్ర సాగింది… వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు చేరుకోవడంతో మూడో విడత పాదయాత్ర ముగినుంది..…
రాష్ట్రంలో బీజేపీ-TRS వార్ జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ వరంగల్ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఎన్నో పోరాటాలకు పురుడుపోసిన కాకతీయ యూనివర్సిటీలో గవర్నర్ పర్యటన హై టెన్షన్ సృష్టిస్తోంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై వరంగల్లో పర్యటించనున్నారు. అక్కడ కాకతీయ యూనివర్సిటీలో జరిగే 22వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు.. 2019-2020 సంవత్సరంలో వివిధ కోర్స్ లలో పీ.హెచ్.డీ పూర్తి చేసుకున్న 56 మందికి డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేయడంతో పాటు 276 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం…
దేశవ్యాప్తంగా మతతత్వాలను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ దేశ సామాజిక సామరస్యాన్ని, సమగ్రతను నాశనం చేస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. వరంగల్ పట్టణంలోని కాజీపేటలో ప్రారంభమైన మూడు రోజుల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పై మండిపడ్డారు. రాజకీయ మైలేజ్ పొందడం కోసం కాషాయ పార్టీ మతతత్వానికి ఒడిగట్టిందని అన్నారు. తమ ‘మత విభజన భావజాలాన్ని’ పెంచుకునేందుకు బీజేపీ సమాజాన్ని పోలరైజ్ చేస్తోందని ఆరోపించారు. హిందూ-సైనికీకరణను విశ్వసించిన వీర్ సావర్కర్ అడుగుజాడల్లోనే…
సాధారణంగా యువకులకు బెదిరింపులకు దిగడం.. డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగు చూస్తుంటాయి.. అయితే, వరంగల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతకులు రోడ్లపై కనిపిస్తున్నారు.. సిటీలో తిరుగతూ.. యువకులను బెదిరిస్తున్నారు.. పేదవారికి సహాయం చేయండి అని అడుగుతూ.. ఏదో స్వచ్ఛందం సంస్థల పేర్లు చెబుతూ గట్టిగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. అనుమానం వచ్చిన స్థానికులు వారిని నిలదీశారు.. మొబైల్ ఫోన్లలో వారిని ఫొటోలు, వీడియోలు తీయడంతో అక్కడి నుంచి జారుకున్నారు.. వరంగల్ సిటీలో జరుగుతోన్న ఈ…
వరంగల్ జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి నిశ్చయమై.. తెల్లారితే నిశ్చితార్థం అనగా మృత్యువు ఊహించని విధంగా వర్షాల రూపంలో ఆ యువకున్ని మింగేసింది. ఈ ప్రమాదంలో యువకుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందగా.. తల్లికి తీవ్రగాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా వరంగల్లోని మండి బజారులో ఓ పాత భవనం కూలడంతో..ఇద్దరు మృతి చెందారు. వరంగల్ నగరంలోని మండి బజార్ మెయిన్ రోడ్ లో గ్రాంపాస్ బేకరీ పురాతనమైన బిల్డింగ్ కూలి పక్కనే ఉన్న…