Telangana Government: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 3 అధునాతన ఆస్పత్రుల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చింది. 2 వేల కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్టులకు సంబంధించి లెటర్ ఆఫ్ అవార్డును అందజేసింది. సనత్ నగర్, ఎల్బీ నగర్, ఆల్వాల్ ఏరియాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టేందుకు 3 నిర్మాణ సంస్థలను ఎంపిక చేసింది. ఈ ఆస్పత్రులను టిమ్స్ అనే పేరుతో పిలుస్తారు.
Jio : రిలయన్స్ జియో 5జీ నెట్వర్క్(Jio 5G Network) ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని ప్రతీ పట్టణం, మండలం, గ్రామాల్లో జియో తన ట్రూ 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది.
సంక్రాంతి పండుగ సమయం దగ్గరపడింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈనెల రేషన్ బియ్యం పంపిణీలని ఇంకా మొదలు పెట్టలేదు. ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం పంపిణీకి బ్రేకు పడింది. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుంది. అయితే.. ఈ నెల ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. కాగా.. కరోనా సమయంలో మాదిరిగా జనవరి నుంచి మరో ఏడాది పాటు కార్డులోని ప్రతి వ్యక్తికి అయిదు కిలోల చొప్పున ఉచిత…
ఖాకీ దుస్తులు ధరించి సమాజానికి సేవ చేయాలనే యువకుడి కల నెరవేరలేదు. ఆశయ సాధనలో ఓడిపోయానని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మూడు మార్కులు తక్కువ వచ్చినందుకు వరంగల్ జిల్లాకు చెందిన జక్కుల రాజ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మిర్చి ధర కొత్త రికార్డు సృష్టించింది. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డులు నెలకొల్పింది. వరంగల్ జిల్లాలో మిర్చి ధర బంగారం రేటు దాటి పోయింది. దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 80,100 వేలు పలికింది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ కొత్త మిర్చి చరిత్రలోనే హై రేట్ నమోదు చేసుకుంది.
హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం జరిగింది. కాజీపేటలో ప్రేమోన్మాది ఘూతుకానికి ఒడిగట్టాడు. పెళ్లికి ఒప్పుకోవడం లేదని, ప్రేయసి గొంగుకోశాడు దుర్మార్గుడు. ఆయువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నిన్న రాత్రి మండలంలోని కడిపికొండలో జరిగింది.
Bairi Naresh arrested: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వరంగల్ జిల్లాలో బైరి నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప స్వామి, హిందూ దేవీదేవతలపై, అయ్యప్ప మాలధారులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశాడు. గత మూడు రోజుల నుంచి ఇటీవల కోడంగల్ లో అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
Warangal: విగ్రహానికి పాలు తాగడం..శివుడిని పూజిస్తున్న పాము..ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం..ఆంజనేయుడు కళ్లు తెరవడం.. గణపతి కొబ్బరిరూపంలో ఉండటం..రాముడు కన్నీరు కారుస్తున్నట్లు ఉండటం ఇలాంటి విచిత్రమైన సంఘటనలు మనం చూస్తున్నాం.. వింటున్నాం. చాలా మంది భగవంతుడికి మహిమ ఉందని బలంగా నమ్ముతారు. ఇలాంటి సంఘటనలు వారి నమ్మకాలను నిజం చేస్తున్నాయి. దేవుళ్లనే కాదు ప్రకృతిలోని జంతువులను, పక్షులను కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే సంప్రదాయం భారతీయులది. అందుకే రాతిలో కూడా దేవుని ప్రతిమను పూజిస్తారు. Read…
భర్తను దారుణంగా చంపేసింది ఓభార్య. భర్త వేధింపులు భరించలేక ఈ దారుణానికి పాల్పడింది. భర్త పరాయి మహిళలతో ఉండటమే కాకుడా..వారితో ఉన్న వీడియోలు తీసి భార్యకు చూపిస్తూ పైశాచికానందం పొందుతున్నాడు. ఈ వేధింపులు భరించలేక భార్య ఆవేశంతో భర్తను హతమార్చిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.