అప్పుడప్పుడు వడగళ్ళవాన పడడం కామన్. కానీ కొన్ని ప్రాంతాల్లో చేపల వాన కురవడం మనం అరుదుగా వింటుంటాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో నిజంగానే చేపల వర్షం కురిసింది. సోమవారం వేకువజామున ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెల్లవారు జామున భారీ వర్షం కురవడంతో కాళేశ్వరం పల్గుల బైపాస్ రోడ్డు కాలనీలో విచిత్రం చోటుచేసుకుంది. అక్కడే వున్న కొందరి ఇళ్ళ పరిసరాలలో, అటవీ ప్రాంతంలోని పడిదం చెరువు గుంతలలో చేపలు ప్రత్యక్షం అయ్యాయి. పడిదం చెరువు సమీపంలో ఉపాధి…
ప్రేమించిన వ్యక్తికి తన ప్రేమను తెలియజేసే పద్ధతి వినూత్నంగా ఉండాలని కొత్త కొత్త ఆలోచనలతో లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. లవ్ ప్రపోజ్కు సంబంధించిన చాలా వీడియోలు మనం చూసేం ఉంటాం. అయితే ఇలాంటి వారి కోసమే విదేశాల్లోని ఓ మెక్డొనాల్డ్స్ ‘రొమాంటిక్ మీల్’ పేరుతో ఓ స్కీంను ప్రవేశపెట్టింది. ఎవరైనా తమ ప్రేమను వారి వారి లవర్స్కు తెలియజేసేందుకు ఈ రొమాంటిక్ మీల్ ద్వారి తెలియజేయవచ్చు. అయితే.. ఓ యువతి తన బాయ్ఫ్రెండ్కు లవ్ ప్రపోజ్ చేసేందుకు..…
ఏంటీ ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు.. అంటూ య్యుట్యూబ్ థంబ్నైల్లా అనిపించిందా.. మే బీ అయ్యిండొచ్చు.. కానీ ఈ వార్త చదివితే మాత్రం మీరు నవ్వకుండ ఉండలేరు.. కనీసం ఓ చిన్న నవ్వైనా రాక మానదు.. అంతేకాకుండా ఇలాంటి వారుకూడా ఉంటారా.. అనే ఆలోచన కూడా మీ బుర్రలో రాక మానదు.. ఇంతకు విషయం ఏంటంటే.. మామూలుగా ఉద్యోగం చేసేవారు.. సెలవు కావాలంటే.. బాస్కు లీవ్ ఎందుకు కావాలో చెప్తూ లీవ్…
బంగారం అంటే ఆడవాళ్లకు ఎంత ప్రాణమో వేరేగా చెప్పన్నక్కర్లేదు. ఒళ్లంతా బంగారు ఆభరణాలు ధరించడానికి ఆడవాళ్లు ఎంతమాత్రం వెనుకాడరు. కానీ కాలిపట్టీల విషయంలో మాత్రం బంగారం కాకుండా వెండిని మాత్రమే ఆడవాళ్లు ధరిస్తారు. భారతీయ సంప్రదాయంలో మహిళలు వెండి పట్టీలు ధరించడం ఎప్పటినుంచో పాటిస్తున్న ఆచారం. ఆడవాళ్లే కాదు.. మగవాళ్ళు కూడా చేతులు, కాళ్ళకు వెండి కంకణాలు, కడియాలు ధరించేవారు. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు. దీని వెనుక గొప్ప సైన్స్ కూడా ఉంది.…
పెళ్ళి, సీమంతం, ఆషాఢమాసం సారె, సంక్రాంతికి ఇంటి అల్లుడికి అదిరిపోయే మర్యాదలు, వియ్యపురాలి సారె… కోడిపందేలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. అక్కడ ఏ వేడుక జరిగినా బ్రహ్మాండంగా వుంటుంది. అమ్మాయో, అబ్బాయో పుట్టినా.. వారికి బారసాల చేయడం ఆనవాయితీ. కాకినాడ జిల్లాలో ో పెద్దాయనకు ఆవులు, ఆవుదూడల్ని పెంచడం హాబీ. తన కుటుంబంలో సభ్యులుగా వాటిని సాకుతుంటారు. తాజాగా 3నెలల పుంగనూరు ఆవు దూడకు బారసాల చేశారు డాక్టర్ గౌరీ శేఖర్ దంపతులు. వేదమంత్రాలతో కుటుంబ…
బిహార్ పాట్నాలోని పీఎంసీహెచ్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఓ వ్యక్తి ప్రైవేటు భాగాల్లో స్టీల్ గ్లాస్ ఇరుక్కుంది. ఈ షాకింగ్ ఘటన నవాదా జిల్లాలో వెలుగుచూసింది. ఓ వ్యక్తి మలద్వారంలోకి స్టీల్ గ్లాస్ చొచ్చుకెళ్లింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని పాట్నాలోని పీఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు. తొలుత కేసు వివరాలు తెలుసుకుని డాక్టర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆపై పరీక్షలు చేసిన డాక్టర్లు.. మలద్వారం నుంచి గ్లాసును వెనక్కి తీయడం సాధ్యం కాదని…
జీవితం అన్న తర్వాత కడుపు నిండాలంటే ఉద్యోగం చేయాల్సిందే. అయితే ఉద్యోగం చేసేవాళ్లు ఆఫీసుకు ఒక్కోసారి లేటుగా వెళ్తుంటారు. లేటుగా ఎందుకొచ్చావని కారణం అడిగితే సవాలక్ష చెప్తారు. ట్రాఫిక్ ఉందని.. బస్సు దొరకలేదని.. బండి చెడిపోయిందని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తారు. పైగా ఆఫీసు అన్నాక ఓ నిమిషం అటూ ఇటు అవుతుందని బాస్లతో వాదిస్తారు. ఇదిలా ఉంచితే.. తాజాగా ఓ ఆఫీస్కు చెందిన సర్క్యులర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ…
బుర్రకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లు కొందరు కొందరు చేసే పనులు చూస్తుంటే చేసేవారికి ఎలాగుంటుందో తెలియదు గానీ.. చూసే వారికి మాత్రం ఒళ్లు మండుతుంది. విషయం ఏంటంటే.. కొందరు యువకులు కదులుతున్న రైలు బోగీలు ఎక్కి స్టంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో వారి తీరుపై కొందరు విమర్శలు గుప్పిస్తుంటే.. మరి కొందరు వెరైటీగా స్పందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని బ్రూక్లిన్లో ఈ సంఘటన జరిగింది. ఒక లోకల్ రైలు విలియమ్స్బర్గ్…
యూపీఐ (UPI) అంటే యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇది ఒక వ్యక్తి యొక్క బ్యాంక్ ఖాతాలను ఒకే మొబైల్ అప్లికేషన్లో ఏకీకృతం చేసి ఆన్లైన్లో డబ్బును బదిలీ చేయడానికి అనుమతించే కేంద్రీకృత వ్యవస్థ. అయితే ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఈ యూపీఐ లావాదేవీలపైనే ఆధారపడుతుండటంతో.. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా యూపీఐ మోసాలకు తెర లేపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో యూపీఐ మోసం ముప్పుగా మారింది. భారతదేశంలో యూపీఐ మోసం నుండి మిమ్మల్ని మీరు…
ఆన్లైన్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల విషయానికి వస్తే భారతదేశం ప్రపంచంలోనే చాలా ముందుకు సాగినప్పటికీ, సైబర్ మోసాల కేసులు పూర్తిగా పెరిగాయి. అయితే, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఒక వ్యక్తి ఒకపైసా కారణంగా సైబర్ వల నుంచి బయటపడ్డాడు. గ్రేటర్ నోయిడాలోని డారిన్ గ్రామానికి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో కేవలం రూ. 9,999.99 ఉన్నందున రూ. 10,000 ఆన్లైన్ మోసం నుండి రక్షించబడ్డాడు. ఈ సంఘటన జూన్…