కన్నడ నటి అయిన రమ్య నందమూరి కల్యాణ్ రామ్ నటించిన అభిమన్యు సినిమాలో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది రమ్య. కన్నడ, తమిళంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆమె సినిమాలకు గుడ్బై చెప్పి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చురుకుగా ఉండే రమ్య.. బీజేపీ అధికారంలోకి రావడంతో రాజీనామ చేసింది. ప్రస్తుతం రమ్య సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె…
అఘోరాలు అంటే మనం సినిమాల్లోనే చూస్తుంటాం. నార్త్ ఇండియాలో ట్రావెల్ చేసినవారు, కాశీ, ప్రయాగ వంటి తీర్థయాత్రలు చేసేవారు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. మన దక్షిణాదిన మాత్రం ఇటువంటి వారు కనిపించరు. సినిమాలో చూసినప్పుడు కథల్లో చదివినప్పుడు అలాంటి జీవితాన్ని గడిపే వారు కూడా ఉంటారా? అంటే మనిషి శరీరాన్ని పీక్కొని తినే మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది. కానీ నిజంగా అలాంటి మనుషులు ఉంటారు. ఉత్తర భారతదేశంలో అఘోరాలు ఎక్కువగా కనిపిస్తారు. కాశీ, వారణాసి,…
మనం రోజు వాడే ఇండియన్ కరెన్సీ నోట్లలో ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని నిజాలను తెలుసుకుందాం. మనం అందరం ఇండియన్ కరెన్సీని రోజు వినియోగిస్తుంటాం. అయితే.. కరెన్సీ నోట్లపై సింబల్స్ ఉంటాయి. అయితే అవి ఎందుకు ఉన్నాయని మీకు తెలుసా..? కళ్ళులేనివారు ఈ సింబల్స్ను బట్టి కరెన్సీ విలువ ఎంతని ఈజీగా గుర్తించడానికి ఈ సింబల్స్ను ప్రింట్ చేస్తుంటారు. అంధులు ఈ సింబల్స్పై వేలును పెట్టి ఆ…
ఒక్కొక్కరికి ఒక్కో వింత అలవాటు ఉంటుంది. కొందరు కొన్ని పదార్ధాలను ఇష్టంగా తింటుంటారు. చిన్నపిల్లలు బలపాలు తింటారు. పెద్దవాళ్లు జంక్ ఫుడ్ తింటారు. అయితే ఒడిశాలోని ఓ వ్యక్తి మాత్రం ఇసుక తింటున్నాడు. అతడి పేరు హరిలాల్ సక్సేనా. వయసు 68 ఏళ్లు ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అతడు వలసకూలీగా పనిచేస్తుంటాడు. ఉపాధి కోసం పదేళ్ల కిందట ఒడిశాకు వలస వెళ్లిపోయాడు. గంజాం జిల్లాలోని కిర్తిపూర్ గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు.…
ఒక్కో దేశంలో ఒక్కో రకంగా చట్టాలు ఉంటాయి. అక్కడి చట్టాలు కొన్ని మనకు వింతగానే అనిపిస్తుంటాయి. ఇటీవల ఓ గొర్రె ఒక మహిళను చంపినందుకు అరెస్ట్ చేసిన విషయం తెగ వైరల్ అయింది. తాజాగా ఇలాంటి ఘటనే మళ్లీ జరిగింది. ఒక బాలుడిని చంపినందుకు ఆవును అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆఫ్రికా దేశం సౌత్ సుడాన్ లో జరిగింది. ఈ విచిత్రమైన ఘటనలో 12 ఏళ్ల బాలుడిని చంపిన ఆవును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో…
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు. అయితే.. కొన్ని కొన్ని విషయాల గురించి తెలుసుకున్నప్పుడు ఒకింత ఆశ్చర్యంగా ఉంటుంది. సినిమాలో చనిపోకముందే సమాధి బుకింగ్ అనే ఓ కామెడీ సన్నివేశం గుర్తిండే ఉంటుంది. అయితే ఆ సినిమాలో కామెడీనే.. కానీ ఇక్కడ రియల్.. సమాధిలో మనిషిని పూడ్చిన తరువాత.. ఆ సమాధికి బార్ కోడ్ను ఏర్పాటు చేస్తారు. ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ సమాధిలో ఏ వ్యక్తిని పూడ్చిపెట్టారో తెలుస్తుంది. అంతేకాకుండా పూడ్చిపెట్టిన వ్యక్తి…
రోడ్లమీద లారీలు భారీ లోడ్ తో వెళుతుంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యమో.. రోడ్డు మీద సమస్య వల్ల లారీలు బోర్లాపడుతుంటాయి. ఆ లారీల్లో బీరు బాటిళ్ళు, సెల్ ఫోన్లు, చేపల లోడ్ వి అయితే సమీప ప్రాంతాల ప్రజలకు పండగే పండుగ. తాజాగా భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద అదుపు తప్పి చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. ఘటనస్థలానికి భారీగా తరలివచ్చిన జనం పండుగ చేసుకున్నారు. నిమిషాల్లో లారీ లోడ్ చేపల్ని మాయం చేసేశారు. భద్రాద్రి…
మాస్ మహారాజా రవితేజ నటించిన కిక్ సినిమా అందరు చూసే ఉంటారు.. కిక్కు కోసం ఏదైనా చేస్తూ ఉంటాడు. తాజాగా ఈ సినిమాను చూసి ప్రేరణ పొందాడో ఏమో కానీ ఒక యువకుడు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడున్నర కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశావ్ అంటే బోర్ కొడుతోంది.. కిక్కులేదని చెప్పడం విశేషం.. ఇంతకీ ఎవరా మహానుభావుడు అని తెలుసుకోవాలని ఉందా.. సరే చూద్దాం పదండి. నెట్ఫ్లిక్స్ ఎంత పెద్ద…
ప్రతి ఉద్యోగి జీవితంలో రిటైర్మెంట్ అనేది అనివార్యం. అయితే.. ఇంచుమించు ఇంటితో సమానంగా ఉద్యోగ సమయంలో కార్యాలయాలలో గడుపుతుంటారు. అంతేకాకుండా ఆఫీసులోని సహోద్యోగులకు పెరిగిన బంధం కూడా తక్కువేం ఉండదు. అయితే.. ఇదే పదవి విరమణ ఉపాధ్యాయులకు మరింత ప్రత్యేకమని చెప్పాలి. పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులకు ఉండే అనుబంధం అంతాఇంతా కాదు. ఉపాధ్యాయులు బదిలీపై వెళుతుంటే.. వెళ్లవద్దంటూ ఏడ్చేసిన సంఘటన కొన్ని వైరల్ అయ్యాయి కూడా. అయితే ఇప్పుడు చెప్పేది కూడా అలాంటిదే.. తను 22 ఏళ్ల…
అక్కడ ఒక బకెట్ నీళ్లుకావాలన్నా బావిలోకి దిగాల్సిందే.. ఎలాంటి సాయం లేకుండా కేవలం బావిలోని రాళ్లనే మెట్లుగా చేసుకొని ఎక్కడం దిగడం చేయాల్సిందే.. ఎక్కటప్పుడో దిగేటప్పుడో ప్రమాదవశాత్తు కాలజారితే భారం అంతా భగవంతుడిపైనే.. నీటి ఎద్దడికి నిలువుటద్దంలా ఓ మహిళ బావిలో దిగి నీళ్లు తీస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరతను ఈ వీడియో సాక్షిబూతమవుతోంది. వీడియోలో ఓ మహిళ నీటి కోసం ఎలాంటి తాడు, నిచ్చెన సాయం…