Loan Recovery Agents: లోన్ రికవరీ ఏజెంట్లు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నారు. బ్యాంక్ రుణం చెల్లించకపోవడంతో కుటుంబాన్ని వేధించారు. చివరకు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని హాపూర్లో చోటు చేసుకుంది. సోమవారం 18 ఏళ్ల కుమార్తెతో సహా దంపతులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. లోక్ రికవరీ ఏజెంట్లు వేధింపులకు గురిచేయడంతోనే వారు ఈ చర్యలకు ఒడిగట్టారని గ్రామస్తులు ఆరోపించారు.
Moradabad: గాఢమైన ప్రేమలో ఉన్న ఓ వ్యక్తి తన ప్రియురాలిని చూసేందుకు వెళ్లి చావు దెబ్బలుతిన్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్లో చోటు చేసుకుంది. ప్రియుడు బురఖా ధరించి తన ప్రేయసిని కలిసేందుకు వెళ్లాడు. అయితే, స్థానికులకు అనుమానం రావడంతో బురఖా తీసేసి చితక్కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. మొరాదాబాద్లో పట్టపగలే ఈ సంఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మెటా (ఫేస్బుక్) ఏఐ కారణంగా 21 ఏళ్ల యువతి ప్రాణం రక్షించబడింది. ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతకు ముందు కారణాలను ఓ వీడియో రూపంలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Wolf Attacks: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలను కిల్లర్ తోడేళ్లు వణికిస్తున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు ఊళ్లపైపడి దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేస్తునున్నాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో రాత్రి సమయాల్లో తోడేళ్ల గుంపు ఇళ్లలోకి చొరబడి పిల్లల్ని ఈడ్చుకెళ్లి చంపి తింటున్నాయి.
Kannauj rape case: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) నేత నిందితుడిగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ కన్నౌజ్లోని అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన ఎస్పీ నేత నవాబ్ సింగ్ యాదవ్ యొక్క డీఎన్ఏ నమూనా, బాలిక నుంచి సేకరించిన డీఎన్ఏతో మ్యాచ్ అయింది. దీంతో ఈ కేసులో అతడి చుట్టూ మరింత ఉచ్చు బిగిసింది.
Crime: దేశవ్యాప్తంగా రోజూ ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కోల్కతా డాక్టర్ ఘటన ఇప్పటికే దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలోనే పలు ప్రాంతాల్లో బాలికలు, మహిళలు అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నప్పటికీ కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. చాలా వరకు లైంగిక దాడులు తెలిసిన వారి నుంచే జరుగుతున్నాయి.
యూపీలోని బహ్రైజ్ జిల్లాలో తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి తోడేలు మళ్లీ దాడి చేసింది. పూరి బస్తీ గడారియాకు చెందిన మజ్రా జంగిల్ పూర్వా నివాసి పరాస్ (07) ఇంట్లో తన తల్లితో కలిసి పడుకుని ఉండగా తనపై తోడేలు దాడి చేసింది. తోడేలు చిన్నారి మెడ పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే చిన్నారి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు లేచి దాన్ని తరిమికొట్టారు.
యూపీలోని బల్రామ్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. నిందితుడు భర్త హత్యకు ముందు హాలీవుడ్ క్రైం సినిమాను చూసి భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా.. ఆమె శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి, ఆ పార్ట్స్ ను పలు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘటన ఆగస్టు 6న జరిగింది.
UP Crime: దేశంలో ప్రతీ రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కఠినమైన అత్యాచార చట్టాలు, నిర్భయ, పోక్సో వంటి చట్టాలు ఉన్నప్పటికీ కామాంధుల్లో భయం కలగడం లేదు. ఇటీవల కోల్కతా వైద్యురాలి అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. నిందితుడిని వెంటనే శిక్షించాలని ప్రజలు ఆందోళనలు చేశారు. మహిళల రక్షణకు మరింత కఠినమైన చట్టాలు రావాలని కోరారు.
18 people injured as bus over turns in UP Shahjahanpur: ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. ఎద్దును కాపాడే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. షాజహాన్ పూర్ జిల్లా సీతాపూర్ నుంచి హరిద్వార్ కు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు జాతీయ రహదారిపై ఎద్దును కాపాడే క్రమంలో అదుపు తప్పి బోల్తా…