Illegal Affair: 30 ఏళ్ల కానిస్టేబుల్తో 45 ఏళ్ల మహిళ జంప్..
- 30 ఏళ్ల కానిస్టేబుల్తో 45 ఏళ్ల మహిళ అదృశ్యం
- యూపీలోని భాదోహిలో ఘటన
- మహిళ ఓ బీజేపీ నాయకురాలు
- తన ఇంట్లో అద్దెకు ఉంటున్న కానిస్టేబుల్తో జంప్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
30 ఏళ్ల కానిస్టేబుల్తో 45 ఏళ్ల మహిళ అదృశ్యమైన ఘటన యూపీలోని భాదోహిలో చోటు చేసుకుంది. బీజేపీ తరపున చైర్మన్ ఎన్నికకు పోటీ చేసిన ఓ బీజేపీ నాయకురాలిగా గుర్తించారు. అయితే.. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న కానిస్టేబుల్తో కలిసి జంప్ అయింది. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 25 ఏళ్ల కూతురు, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. తనతో పాటు తన కొడుకును తీసుకుని పారిపోయింది. భర్త కూడా బీజేపీ నాయకుడిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఇంట్లో నుంచి రూ.2.5 కోట్ల విలువైన నగలు, నగదు తీసుకుని తన భార్య కానిస్టేబుల్తో కలిసి పారిపోయిందని భర్త ఆరోపించాడు. కానిస్టేబుల్ తన భార్యను డబ్బు కోసం లొంగదీసుకున్నాడని భర్త తెలిపాడు. భార్యకు 45 ఏళ్లు, కానిస్టేబుల్కు 30 ఏళ్లు అని భర్త చెప్పాడు. కాగా.. భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh: వరద బాధితులకు పరిహారం ప్యాకేజీపై ప్రభుత్వం ఉత్తర్వులు
Also Read
ఏడాది క్రితం.. కానిస్టేబుల్ వినయ్ తివారీ అలియాస్ రాజ్ తివారీ తన ఇంట్లో అద్దెకు దిగాడని భర్త పోలీసు ఫిర్యాదులో తెలిపాడు. కొన్ని అసభ్యకరమైన ఫోటోలు తీసి తన భార్యను బ్లాక్మెయిల్ చేశాడని.. నోరు విప్పితే అందరినీ చంపేస్తానని బెదిరించానని చెప్పాడు. ఈ విషయం తెలియగానే కానిస్టేబుల్ను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో.. అతను తమపై పగ పెంచుకున్నాడని.. అప్పటి నుంచి తన భార్యను ప్రలోభపెట్టి అతనితో తీసుకెళ్లాడని తెలిపాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.. దీన్ని అవకాశంగా తీసుకుని వెళ్లేటప్పుడు సుమారు రెండు కోట్ల రూపాయల నగలు, నాలుగు లక్షల రూపాయల నగదు, ఇతర వస్తువులను తీసుకెళ్లారని అన్నాడు. తనతో పాటు తన కొడుకుని కూడా తీసుకెళ్లిందని.. వారి కోసం వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. కాగా.. తన భార్య వద్ద ఉన్న బంగారం, నగదును మొత్తం తీసుకుని భార్య, బిడ్డను చంపేసే అవకాశం ఉందని భర్త పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి కొంతమంది స్థానికుల ప్రమేయం ఉందని భర్త ఆరోపించాడు.
Breaking News: పోలీసులపై కాల్పులు జరిపిన అత్యాచార నిందితుడు.. ఏమైందంటే?
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!