Yogi Adityanath: ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్లో పీఓకే కలుస్తుంది..
- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..
- కాశ్మీర్లో బీజేపీ అధికారంలోకి వస్తే.. పీఓకేను భారత్లో విలీనం చేస్తాం..
- పాకిస్తాన్ తన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది: ఆదిత్యనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేస్తామని ప్రకటించారు. జమ్మూలోని ఆర్ఎస్ పురాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ తన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోందన్నారు. అలాగే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మన దేశంలో విలీనం చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు.
Read Also: Eatala Rajendar: బట్టలు లేవు కానీ బంగారం కొనిస్తా అన్నట్టుంది.. హైడ్రా నోటీస్ ల పై ఈటల సెటైర్లు..
Also Read
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
కాగా, పాకిస్థాన్ లో పెరుగుతున్న ఆహార ధరలు, పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు సైతం భారత్ లో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. ఇక, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్లో కూడా ఎన్నికలు నిర్వహిస్తే.. అది సానుకూల సందేశాన్ని పంపుతుందని ఆయన అన్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆరు నెలల్లో భారత్లో భాగమవుతుందని ఆ సమయంలో తాను చెప్పినట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.
Read Also: China Disruption : చైనా వల్ల ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి..!?
అయితే, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తైంది. మరో 40 స్థానాలకు మూడో దశలో అక్టోబర్ 1వ తేదీన ఓటింగ్ జరగనుంది. ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. అక్టోబరు 8వ తేదీన హర్యానా అసెంబ్లీ ఎన్నికల తర్వాత తుది ఫలితాలు వెలువడనున్నాయి.
— Yogi Adityanath (@myogiadityanath) September 26, 2024
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..