Yogi Adityanath: ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్లో పీఓకే కలుస్తుంది..
- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..
- కాశ్మీర్లో బీజేపీ అధికారంలోకి వస్తే.. పీఓకేను భారత్లో విలీనం చేస్తాం..
- పాకిస్తాన్ తన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది: ఆదిత్యనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేస్తామని ప్రకటించారు. జమ్మూలోని ఆర్ఎస్ పురాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ తన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోందన్నారు. అలాగే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మన దేశంలో విలీనం చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు.
Read Also: Eatala Rajendar: బట్టలు లేవు కానీ బంగారం కొనిస్తా అన్నట్టుంది.. హైడ్రా నోటీస్ ల పై ఈటల సెటైర్లు..
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
కాగా, పాకిస్థాన్ లో పెరుగుతున్న ఆహార ధరలు, పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు సైతం భారత్ లో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. ఇక, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్లో కూడా ఎన్నికలు నిర్వహిస్తే.. అది సానుకూల సందేశాన్ని పంపుతుందని ఆయన అన్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆరు నెలల్లో భారత్లో భాగమవుతుందని ఆ సమయంలో తాను చెప్పినట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.
Read Also: China Disruption : చైనా వల్ల ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి..!?
అయితే, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తైంది. మరో 40 స్థానాలకు మూడో దశలో అక్టోబర్ 1వ తేదీన ఓటింగ్ జరగనుంది. ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. అక్టోబరు 8వ తేదీన హర్యానా అసెంబ్లీ ఎన్నికల తర్వాత తుది ఫలితాలు వెలువడనున్నాయి.
— Yogi Adityanath (@myogiadityanath) September 26, 2024
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!