UP: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో.. యూపీ సీఎం యోగి కీలక నిర్ణయం
- ఏపీలో కొనసాగుతున్న ప్రసాదంపై వివాదం
- యూపీలో మధురకు చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అలర్ట్
- 15 దుకాణాల నుంచి 43 ఆహార పదార్థాల నమూనాలను సేకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లోని తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం ముదురుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రసాదంగా సమర్పించిన ప్రసాదంలో కల్తీ జరిగినట్లు వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలపడంపై సాధువులు, సన్యాసులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ లడ్డూ వివాదానికి సంబంధించి సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది. తాజాగా.. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం మధురకు చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం , బృందావనం తదితర ప్రాంతాల్లోని ధార్మిక క్షేత్రాలకు సమీపంలోని 15 దుకాణాల నుంచి 43 ఆహార పదార్థాల నమూనాలను సేకరించింది. కల్తీ పదార్థాలను వాడుతున్నారనే అనుమానంతో లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి ‘పేడా’ (ఒక రకమైన స్వీట్) నమూనాను పరీక్షల నిమిత్తం పంపింది.
READ MORE: Amaravati: రాజధానిలో తొలి భూ కేటాయింపు చేసిన కూటమి ప్రభుత్వం
Also Read
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
- Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
ఎఫ్ఎస్డిఎ అసిస్టెంట్ కమిషనర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. సోమవారం మధుర, బృందావన్లలో నిర్వహించిన నమూనా ప్రచారంలో 15 మంది వ్యాపారుల నుంచి మొత్తం 43 నమూనాలను సేకరించినట్లు తెలిపారు. మిఠాయిలు, పాలు, పనీర్, పెడా, బర్ఫీ, మిల్క్ కేక్, రసగుల్లా, సోన్పాప్డి, ఇతర స్వీట్లు మసాలా దినుసులతో తయారుచేసిన వస్తువులను లాబ్ కు పంపించారు. వాటిలో 42 స్టాండర్డ్లో ఉన్నట్లు గుర్తించామని, అయితే ‘పెడా’ నమూనాను పరీక్ష కోసం లక్నోకు పంపామని ఆయన చెప్పారు. ఆలయాల చుట్టుపక్కల ఉన్న దుకాణాల నుంచి ఆదివారం, సోమవారాల్లో అన్ని నమూనాలను సేకరించినట్లు తెలిపారు.
READ MORE:Hyderabad: హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల భారీ వర్షం
ఇదిలా ఉండగా.. మార్కెట్లో నెయ్యిలో కల్తీ జరుగుతోందన్న అంశాన్ని లక్నోలోని పురాతన మంకమేశ్వర దేవాలయం అధిపతి మహంత్ దేవ్యగిరి లేవనెత్తారు. బయటి నుంచి తెచ్చిన ప్రసాదాన్ని మంకమేశ్వరాలయంలో సమర్పించబోమని మహంత్ దేవయగిరి స్పష్టం చెశారు. ప్రజలు ఇంట్లో తయారుచేసిన ప్రసాదం తీసుకువస్తేనే దేవుడికి నైవేద్యంగా పెడతారు. అలాగే, భక్తులు స్వామికి పొడి ప్రసాదాన్ని సమర్పించవచ్చన్నారు. సనాతన ధర్మ బోర్డును దేశం, రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే, నగరంలోని ప్రధాన ఆలయాల మహంతులు, ప్రధాన అర్చకులను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ బోర్డుకు న్యాయపరమైన అధికారం రావాలనే డిమాండ్ ను కూడా లేవనెత్తారు. దీనితో పాటు, మతపరమైన ప్రదేశాలలో (ఆలయాల్లో) ప్రసాదంగా విక్రయించే వస్తువులపై విచారణ జరపాలని మహంత్ దేవ్యగిరి డిమాండ్ చేశారు. ఇందులో అవినీతిపరులు ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో విచారణ చేపట్టాలన్నారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ కి లేఖ రాశారు. మహంత్ దేవ్యగిరి తన డిమాండ్ల లేఖను సీఎం యోగి పేరిట సోమవారం లక్నో డీఎం సూర్యపాల్ గంగ్వార్కు అందజేశారు.
తాజావార్తలు
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!