Maha Kumbh Mela 2025: వచ్చే నెల 13 నుంచి 45 రోజుల పాటు కొనసాగనున్న మహా కుంభమేళాకు ప్రయాగ్రాజ్ రెడీ అయింది. భక్తుల అవసరాలు, భద్రత కోసం ఉత్తర్ప్రదేశ్ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తోంది.
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆలయంలో దొంగతనానికి పాల్పడే ముందు దొంగ ఆలయ ప్రాంగణంలో కూర్చుని దేవుడికి పూజలు చేశాడు. దీని తరువాత.. ఆలయంలోకి ప్రవేశించి హనుమంతుని విగ్రహానికి అలంకరించిన కిరీటాన్ని దొంగిలించి పారిపోయాడు. ఈ చోరీ ఘటన అంతా ఆలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
UP: ఉత్తర్ ప్రదేశ్లో ఝాన్సీలో ఓ ఉపాధ్యాయుడు స్టూడెంట్ని చితకబాదాడు. ప్రైవేట్ స్కూట్ టీచర్ క్లాస్ రూపంలో పోర్న్ వీడియోలు చూడటాన్ని చూసిన విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుల్దీప్ యాదవ్ అనే టీచర్ క్లాస్ రూంలో అసభ్యమైన కంటెంట్ చూస్తున్నాడని గుర్తించిన విద్యార్థులు అతడిని చూసి నవ్వారు. దీంతో ఆగ్రహించిన అతను బాలుడిని కొట్టాడు.
Asaduddin Owaisi: గత నెలలో ఉత్తర్ ప్రదేశ్ సంభాల్లోని షాహీ జామా మసీదు వివాదంపై హింస చెలరేగింది. కోర్టు ఆదేశాలతో మసీదు సర్వేకి వెళ్లిన అధికారుల బృందంపై ఓ వర్గం రాళ్లుతో దాడి చేసింది. స్థానికంగా ఉన్న ఇళ్లు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. రాళ్ల దాడిలో 20కి మందికి పైగా పోలీసులు గాయపడ్డారు.
UP: డబ్బుల కోసం మగాళ్లను పెళ్లాడుతున్న ఓ లేడీ ఖిలాడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘నిత్య పెళ్లికూతురు’’ మారిన మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ బండాకి చెందిన ఇద్దరు మహిళలు చాలా మంది మగాళ్లను, ఒంటరి పురుషులను పెళ్లి పేరుతో మోసం చేసి, వారి ఇళ్లలోని నగదు, ఆభరణాలను దొంగిలించే రాకెట్ నడుపుతున్నట్లు తేలింది.
యూపీలో ఓ ప్రియురాలు ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడి ప్రైవేటు పార్ట్ను కత్తిరించేసింది. దీంతో బాధితుడు విలవిలలాడిపోయాడు. ఈ ఘటన ముజఫర్నగర్లో చోటుచేసుకుంది.
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఉత్తరప్రదేశ్లోని బరేలీ కోర్టు సమన్లు జారీ చేసింది. పార్లమెంట్లో జై పాలస్తీనా అనే నినాదానికి చెందిన అంశంపై 2025 జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
Sambhal: సంభాల్కు సంబంధించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. సంభాల్ను తీర్థయాత్రా స్థలంగా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక్కడి బావులు, చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది.
Zia Ur Rehman Barq: విద్యుత్ చౌర్యం కేసులో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్పై యూపీ విద్యుత్ శాఖ కేసు నమోదు చేశారు. నవంబర్ నెలలో సంభాల్లోని షాహీ జామా మసీదు సర్వే సమయంలో అధికారులపై దాడులు చేసిన ఘటనలో రెహ్మాన్ బార్క్ నిందితుడుగా ఉన్నాడు. అప్పటి నుంచి ఉత్తర్ ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్, ఆ ప్రాంతంలోని ఆక్రమణలను తొలగిస్తోంది. ఆ ప్రాంతంలో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యక్తులపై కేసులు పెడుతోంది.